By: ABP Desam | Updated at : 12 Nov 2021 01:29 PM (IST)
ఏపీఈఆర్సీ సభ్యులు (ఫైల్ ఫోటో )
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీతో పాటు విద్యుత్ బిల్లుల బకాయిలను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ సంస్థ ( ఏపీఈఆర్సీ ) ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, డిస్కంలు, ఇంధన శాఖ సెక్రెటరీకి ఏపీఈఆర్సీ ఈ లేఖ పంపింది. మొత్తంగా ప్రభుత్వం నుంచి విద్యుత్ పంపిణీ సంసథలకు రూ. 25,257 కోట్ల బకాయి ఉందని ఈఆర్సీ గుర్తు చేసింది. ఈ లేఖను పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ బయట పెట్టారు.
అదానీ పవర్తో అత్యధిక రేటుకు కరెంట్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటన్నారని ఫిర్యాదు చేసేందుకు ఏపీఈఆర్సీ కార్యాలయానికి పయ్యావుల కేశవ్ 9వ తేదీన వెళ్లారు. ఆ రోజున ఈఆర్సీని కలిసి ఇంధన శాఖలో పరిస్థితులు, నిర్ణయాలపై అనేక వివరాలతో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏపీఆర్సీ ప్రభుత్వానికిలేఖ రాసింది. ప్రభుత్వం నుంచి డిస్కంలకు రూ. 15474 కోట్ల సబ్సిడీ బకాయిలు రావాల్సి ఉందని వెంటనే చెల్లించాలని లేఖలో ఈఆర్సీ కోరారు. అలాగే స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖలు విద్యుత్ ఉపయోగించుకుని బిల్లులు చెల్లించడం మానేశాయని.. ఈ మొత్తం రూ. 9783 కోట్లు రావాల్సి ఉందన్నారు.
Also Read : బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగింది.. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే వాళ్లు జైలుకే
అటు విద్యుత్ సబ్సిడీ బకాయిలు.. ఇటు ప్రభుత్వ సంస్థలు ఉపయోగించుకున్న బిల్లుల బకాయిలు మొత్తం కలిపి రూ. 25,257 కోట్లను ఫద్నాలుగు రోజుల్లోగా డిస్కంలకు చెల్లించాలని ఈఆర్సీ స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపులపై 14 రోజుల గుడువుతో నోటీసులు ఇవ్వాలని... ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుంచి 14 రోజుల్లో స్పందన రాకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది. ఇలా బకాయిలు పేరుకుపోవడం వల్ల డిస్కంల మనుగడే ప్రమాదంలో పడిందని ఏపీఈఆర్సీ లేఖలో పేర్కొంది.
Also Read : పంచ్ ప్రభాకర్ కోసం ఇంటర్పోల్ బ్లూ నోటీస్ ! ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్ట్ ?
ప్రభుత్వ విద్యుత్తు పంపిణీ సంస్థలు పూర్తిస్థాయిలో దివాలా చట్టం పరిధిలోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. వాటి ఆస్తులను వేలం వేసి... ఏయే సంస్థలకు డిస్కమ్లు అప్పులు చెల్లించాలో ఆ సంస్థలకు వేలం సొమ్ము జమ చేయవచ్చు. రుణాలు, బాకీల చెల్లింపులో డిస్కమ్లు ఏ మాత్రం విఫలమైనా రుణదాతలు, అరువుపై డిస్కమ్లకు వస్తు, సేవలు సరఫరా చేసిన సంస్థలు దివాలా పరిష్కార ప్రక్రియ కోసం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించవచ్చు. దీంతో ఏపీ డిస్కమ్లు తీవ్ర ఇబ్బందల్లో పడనున్నాయి. ఇప్పటికే జెన్కో తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో నిరర్థక ఆస్తిగా మారింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Breaking News Live Updates: హైదరాబాద్లో మరోసారి గంజాయి కలకలం, పెద్దమొత్తంలో పట్టుకున్న పోలీసులు
MLC Driver Murder Case: ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ గన్మెన్లు సస్పెండ్, ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ అరెస్ట్
Petrol-Diesel Price, 23 May: శుభవార్త! నేడూ తగ్గిన ఇంధన ధరలు, ఈ ఒక్క నగరంలోనే పెరుగుదల
Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట! నేటి ధరలు ఇవీ - నగరాల వారీగా రేట్లు ఇలా
Kushi Update: 'ఖుషి' కశ్మీర్ షెడ్యూల్ పూర్తి - నెక్స్ట్ హైదరాబాద్ లోనే!
PM Modi Arrives In Tokyo: జపాన్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video
Viral News: తాళి కట్టే టైంలో స్పృహ తప్పిన వధువు- తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్కి పోలీసులు ఎంట్రీ!
Hyderabad Honour Killing Case: అవమానం తట్టుకోలేని సంజన ఫ్యామిలీ, పక్కా ప్లాన్తో నీరజ్ పరువు హత్య - రిమాండ్ రిపోర్ట్లో కీలకాంశాలు ఇవే