అన్వేషించండి

YSRCP MLC : వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. సగం బలహీనవర్గాల నేతలకే..!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులును వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది. సగం బలహీనవర్గాలకే ఇచ్చినట్లుగా సజ్జల తెలిపారు. వీరంతా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల కోటా కింద 11 ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. జిల్లాల వారీగా ఆశావహులు, సామాజిక సమీకరణాలపై కసరత్తు చేసి ఈ మేరకు తుది జాబితాను ఖరారు చేశారు. ఈ జాబితాను ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ముగ్గుర్ని ప్రకటించేశారు. వీరితో కలిసి మొత్తం 14 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎమ్మెల్సీ స్థానాలు లభించినట్లయింది. 

Also Read : సీఎం జగన్ బిచ్చమెత్తుకుంటున్నారన్న తెలంగాణ మంత్రి... సీఎం కేసీఆర్ దిల్లీ ఎందుకు వెళ్తున్నారని ఏపీ మంత్రి కౌంటర్

తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా నుంచి అనంత ఉదయభాస్కర్‌కు అవకాశం కల్పించారు. ఆయన ఏజెన్సీ ప్రాంతానికి చెందిన యువ నేత. గుంటూరు జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావుకు చాన్సిచ్చారు. ఈయన బీసీ వర్గానికి చెందిన వారు. ఇక గుంటూరు నుంచే మరొకరికి చోటుదక్కింది. సీనియర్ నేత, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు పొడిగింపు ఇచ్చారు. అలాగే చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న భరత్‌కు చాన్సిచ్చారు. ఆయన తండ్రి చంద్రమౌళి గత ఎన్నికల్లోకుప్పం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తరవాత ఆయన చనిపోయారు. 

Also Read: ప్రభుత్వంపై ఇక తిరుగుబాటే .. ఉద్యోగ సంఘాల ఆగ్రహం !జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ బాయ్‌కాట్ !

 
అనంతపురం జిల్లా నుంచి ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన వై. శివరామిరెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు, విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరు రఘురాజు, విశాఖ నుంచి వరుదు కల్యాణి, వంశీ కృష్ణ యాదవ్‌కు చాన్సిచ్చారు. వీరిద్దరూ గత ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల కోసం ప్రయత్నించారు. వంశీకృష్ణ యాదవ్‌కు విశాఖ మేయర్ సీటు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి సంతృప్తి పరిచారు. ఇక కృష్ణా జిల్లా నుంచి ఇద్దరికి చాన్సిచ్చారు మొండితోక అరుణ్‌కుమార్, తలశిల రఘురాంలు ఎమ్మెల్సీలు కానున్నారు. తలశిల రఘురాం పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్‌గా ఉన్నారు.

Also Read : ఏపీ సీఎం జగన్ కాలుకు గాయం.. మణిపాల్ ఆస్పత్రిలో రెండు గంటల పాటు చికిత్స !

సామాజికవర్గాల సమీకరణాలు చూసుకోవడంతో పలువురు సీనియర్లకు అవకాశం కల్పించలేకపోయారు. ఏడుగురు ఓసీలు .. ఏడుగురు బలహీవర్గాలకు చెందిన వారికి చాన్సిచ్చామని వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది. స్ధానిక సంస్థల్లో వైఎస్ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ ఉండటంతో విపక్షాలు కూడా పోటీ పెట్టే అవకాశం లేదు. 

Also Read : రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Embed widget