అన్వేషించండి

AP Aided Institutions: ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ఒత్తిడి లేదు... గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు... ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు

ఏపీలో ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనంపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. కొత్త మార్గదర్శకాలతో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఓ మెమో జారీ చేసింది. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో ఎయిడెడ్ విద్యాసంస్థ విలీనం వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలీన అంశాన్ని విద్యాసంస్థలకే వదిలిపెడుతూ నాలుగు ఆఫ్షన్లతో మార్గదర్శకాలు జారీచేసింది. ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు గ్రాంటు నిలిపివేతపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. విద్యాసంస్థల ఆస్తులతో సహా సిబ్బందిని లేదా సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించిన యాజమాన్యాలు తమ నిర్ణయంపై పునరాలోచించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అందుకు వెసులుబాటు కల్పించింది. శుక్రవారం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర ఓ మెమో జారీ చేశారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనానికి ఇప్పటికే మూడు ఐచ్ఛికాలు ఇవ్వగా తాజాగా అంగీకారాన్ని వెనక్కి తీసుకునే ఆఫ్షన్ అందులో చేర్చింది. పాఠశాల, జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలలకు ఈ మెమో జారీ చేశారు. 

Also Read: రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !

కొత్తగా మరో ఆఫ్షన్

1. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను యాజమాన్యులు ఆస్తులు, సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వ విద్యా సంస్థలుగా నిర్వహిస్తారు.
2. ఆస్తులు ఇవ్వకుండా కేవలం సిబ్బందిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు లిఖిత పూర్వక అంగీకారం తెలిపితే ఆ విద్యా సంస్థలను ప్రైవేటుగా సంస్థలుగా నిర్వహించుకోవచ్చు. 
3. ఎలాంటి అంగీకారం తెలపకుంటే నిబంధనల మేరకు ఎయిడ్‌ కొనసాగిస్తారు.
4. గతంలో ఆస్తులతో సహా సిబ్బందిని లేదా సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించిన యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు. యథావిధిగా ఎయిడెడ్‌ విద్యా సంస్థలుగా నిర్వహించవచ్చు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కొనసాగుతుంది.

Also Read: ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?

ఎయిడెడ్ సిబ్బంది వెనక్కి పంపుతారా...?

ఏపీలో 137 ఎయిడెడ్‌ కళాశాలల్లో 124 యాజమాన్యాలు ప్రభుత్వానికి సిబ్బందిని అప్పగించేందుకు అంగీకరించాయి. దీంతో కళాశాలల్లోని సిబ్బందిని అధికారులు ప్రభుత్వంలో విలీనం చేశారు. వీరికి ఇప్పటికే పోస్టింగ్‌లు ఖరారు చేశారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో యాజమాన్యాలు తమ సమ్మతిని వెనక్కి తీసుకుంటే సిబ్బందిని ఎలా సర్దుబాటు చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎయిడెడ్‌ సిబ్బందికి పోస్టులు ఇచ్చేందుకు రెగ్యులర్‌ సిబ్బందిని బదిలీ చేశారు. ఆ ఖాళీల్లో ఎయిడెడ్‌ సిబ్బందిని నియమించారు. తాజా నిర్ణయంతో ఎయిడెడ్‌ సిబ్బందిని వెనక్కి పంపుతారా లేక యథావిధిగా కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. పీహెచ్‌డీ విద్యార్హత ఉన్న ఎయిడెడ్‌ అధ్యాపకులకు విశ్వవిద్యాలయాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. సుమారు 342 మంది వరకు పీహెచ్‌డీ అర్హత కలిగి ఉంటే... వీరిలో 113 మందిని మూడేళ్ల పాటు డిప్యూటేషన్‌పై ఆంధ్ర యూనివర్శిటీకి కేటాయించారు. మిగతా వారిని రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు కేటాయించారు. 

Also Read: పీఆర్సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావడం లేదు.. అమలు చేస్తారా? లేదా?

68.78శాతం యాజమాన్యాలు ఓకే

రాష్ట్రంలోని 2,249 ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో 68.78 శాతం యాజమాన్యాలు విలీనానికి అంగీకరించాయని ప్రభుత్వం తెలిపింది. 702 ఎయిడెడ్‌ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని వెల్లడించింది. విలీనానికి అంగీకరించని ఎయిడెడ్‌ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి లేదని ఉన్నత విద్యా శాఖ స్పష్టం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,600 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రభుత్వంలో విలీనానికి అంగీకారించాయని ప్రభుత్వం వెల్లడించింది.

Also Read: కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత... విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమరావతిలో దాడులపై 3 కేసులు నమోదు.. వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు!
అమరావతిలో దాడులపై 3 కేసులు నమోదు.. వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు!
Anant Ambani: తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ 27.5 కోట్ల విలువైన భారీ విరాళం, గోశాల ఆధునీకరణకు నిర్ణయం
తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ 27.5 కోట్ల విలువైన భారీ విరాళం, గోశాల ఆధునీకరణకు నిర్ణయం
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Sunday Puja Vidhi : ఆదివారం ఉప్పు తినొద్దు! ఈ రోజు పూజావిధానం, ఫలితాల గురించి తెలుసుకోండి!
ఆదివారం ఉప్పు తినొద్దు! ఈ రోజు పూజావిధానం, ఫలితాల గురించి తెలుసుకోండి!
Embed widget