అన్వేషించండి

Kakinada News: కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత... విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట

ఏపీలో ఎయిడెడ్ కాలేజీల విద్యార్థులు ఆందోళన బాటపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఐడియల్ ఎయిడెడ్ కళాశాల విద్యార్థుల ధర్నా ఉద్రిక్తంగా మారింది.

ఎయిడెడ్ కళశాలల విలీన నిర్ణయం ఏపీలో ఆందోళనలకు దారితీస్తుంది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో విద్యార్థుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఐడియల్‌ ఎయిడెడ్‌ కళాశాల విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. కళాశాలను ప్రైవేటీకరించవద్దని నిరసన చేశారు. సామర్లకోట రోడ్డులోని కళాశాల వద్ద నుంచి వందలాది మంది విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్‌కు చేరుకొన్నారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్‌ వద్ద అడ్డంగా ఉంచిన బారీకేడ్లను తోసుకుని విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. 

Also Read: పీఆర్సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావడం లేదు.. అమలు చేస్తారా? లేదా?

విద్యార్థులపై ఫీజుల భారం

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యం.సూరిబాబు, టి.రాజాలు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా పోలీసులు, అధికారులు ఆలోచించకపోవడం శోచనీయమన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై లాఠీఛార్జ్ చేసే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి తన సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఐడియల్ కళాశాలను ప్రైవేటుపరం చేస్తే భారీ స్థాయిలో విద్యార్థులపై ఫీజుల భారం పడే అవకాశం ఉన్నందున ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మూడు గంటలపాటు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు హోరున వర్షంలో సైతం ఆందోళన నిర్వహించారు. సుమారు రెండు వందల మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

Also Read: కుప్పంలో గూండాలు, రౌడీలు, ఎర్రచందనం స్మగ్లర్లు .. భయపడకుండా ఓటేయాలని లోకేష్ పిలుపు !

భారీ వర్షంలోనూ ఆందోళన

కాకినాడ కలెక్టరేట్ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను అడ్డుకునేందుకు కలెక్టరేట్‌ పోలీసులు ప్రధాన ద్వారాన్ని మూసేశారు. దీంతో భారీ వర్షంలోనే విద్యార్థులు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన కొనసాగించారు. జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు విద్యార్థుల వద్దకు వచ్చి నిరసన విమరించాలని కోరారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. 

Also Read: రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !

ప్రభుత్వం నిర్ణయం వివాదాస్పదం

ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం వివాదస్పందంగా మారింది. ఇన్నాళ్లు ఎయిడెడ్ విద్యాసంస్థల భారం ప్రభుత్వమే భరించేది. తాజాగా జీవో నెంబర్ 35,42, 50 ద్వారా ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించంది. దీంతో ఏపీలోని అనేక కళాశాలలో విద్యార్థులు.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు ఘర్షణకు దారితీస్తున్నాయి. అనంతపురం,కృష్ణా జిల్లాల్లో విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడంతో మరో మారు ఎయిడెడ్ పై సీఎం జగన్ నిర్ణయం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఎక్కువ నష్టపోయేది ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులే. ప్రభుత్వానికి ఎయిడ్ ఆస్తులు స్వాధీనం చేస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. అలా కాకుండా  ఎయిడెడ్ విద్యాసంస్థలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి స్వాధీనం చేయడం ఇష్టలేని ఎయిడ్ యాజమాన్యాలు మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. అలా కాకుండా తామే నడుపుకునేందుకు సిద్ధమైతే ఇక అవి ప్రైవేట్ విద్యాసంస్థలను తలపించేలా అధిక ఫీజులు వసూలు చేసే అవకాశాలే ఎక్కువ. అందుకే విద్యార్థులు అంగీకరించడంలేదు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget