అన్వేషించండి

Kuppam Lokesh : కుప్పంలో గూండాలు, రౌడీలు, ఎర్రచందనం స్మగ్లర్లు .. భయపడకుండా ఓటేయాలని లోకేష్ పిలుపు !

కుప్పంలో నారా లోకేష్ ఎన్నిక ప్రచారం చేస్తున్నారు. గూండాలు, రౌడీలు, ఎర్రచందనం స్మగ్లర్లు కుప్పంలో దిగి పులివెందుల రాజకీయం చేయాలని చూస్తున్నారని ఎవరూ భయపడవద్దని పిలుపునిచ్చారు.


కుప్పం నియోజకవర్గ ప్రజలను భయపెట్టి, బెదిరించి ఓట్లు వేయించుకోవాలనుకోవడం సాధ్యం కాదని నారా లోకేష్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో నారా లోకేష్ ప్రచారం చేస్తున్నారు. జోరుగా వర్షం పడుతున్నప్పటికీ మున్సిపాలిటీలో పలు వార్డుల్లో  లోకేష్ భారీ అభిమాన సందోహం మధ్య ప్రచారం నిర్వహిస్తున్నారు. కుప్పం నియోజకవర్గం టీడీపీకి అడ్డా అని.. అందుకే అలజడులు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కక్ష సాధింపుతో కుప్పం నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం లేదని హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను మధ్యలో ఆపేశారని విమర్శించారు. 

Also Read : శాసనమండలిలో వైఎస్ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ ! ఇక "రద్దు తీర్మానాన్ని" ఉపసంహరించుకుంటారా ?

జే ట్యాక్స్‌తో ఏపీలో  నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు.  జగన్ కటింగ్‌ల ముఖ్యమంత్రన్నారు. ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వార్డులకు వస్తే ఏం చేశారో అడగాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రూ. 10 విడుదల చేసి 100రూపాయలు ప్రభుత్వం లాగేసుకుంటోందని.. ఎందుకు ఓటేయాలో వైసీపీ అభ్యర్థులను ప్రశ్నించాలన్నారు. బెదిరింపులకు భయపడవద్ద.. ధైర్యంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇడుపులపాయ రాజకీయాన్ని కుప్పంకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని కుప్పంలో టిడిపిని గెలిపించాలన్నారు. కుప్పంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది చంద్రబాబేనని.. కుప్పంలో గూండాలు, రౌడీలు, ఎర్రచందనం స్మగ్లర్లు దిగారు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. 

Also Read : బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగింది.. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే వాళ్లు జైలుకే

కుప్పంలో వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నియోజకవర్గాల నేతలు పెద్ద ఎత్తున మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్ల సాయంతో ఓటర్లను బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో  కుప్పంలో టీడీపీ కూడా కీలకమైన నేతల్ని మోహరించింది. వారిని పోలీసులు అక్కడ్నుంచి పంపేందుకు ప్రయత్నించారు. తమ అనుమతితోనే ప్రచారం చేయాలని డీఎస్పీ ఆర్డర్స్ ఇచ్చారు. వాటిపై టీడీపీ న్యాయపోరాటం చేస్తోంది.

Also Read: Nellore Heavy Rains: జోరు వానలో వైసీపీ ఎమ్మెల్యే అగచాట్లు.. కనీసం గొడుగు కూడా లేకుండా ఎందుకో తెలుసా?

ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే చంద్రబాబు కూడా వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. ఇప్పుడు లోకేష్ కూడా రావడంతో  కుప్పంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రెండు పార్టీల నేతలు మోహరించడంతో కుప్పంలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. 

Also Read : పీఆర్సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావడం లేదు.. అమలు చేస్తారా? లేదా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget