అన్వేషించండి

Top Headlines: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్ - దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:

1. పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ తన టార్గెట్ పెంచారు. రాష్ట్ర స్థాయినేత నుంచి జాతీయస్థాయి పొలిటిషయన్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 20 ఏళ్ల పాటు రాజకీయాలు చేస్తానని పాలిటిక్స్‌లో అడుగు పెట్టిన పవన్ పదేళ్లలోపే ఒక రాష్ట్రనికి ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. 2014 నుంచి జన సేనతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ మొదట్లో ఎదురు దెబ్బలే తిన్నారు. 2019లో తొలిసారి పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్ల ఓడిపోయారు. ఇంకా చదవండి.

2. ఏపీలో ఫార్మసీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఏపీలో ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్‌లో ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూలును సాంకేతిక విద్యాశాఖ నవంబరు 27న ప్రకటించింది. దీనిప్రకారం ఎంపీసీ విభాగానికి చెందిన విద్యార్థులకు నవంబరు 29 నుంచి డిసెంబరు 6 వరకు, బైపీసీ విభాగానికి చెందిన విద్యార్థులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 14 మధ్య కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఎంపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులు నవంబరు 29 నుంచి 30 వరకు, బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులు నవంబరు 30 నుంచి డిసెంబరు 5 వరకు  ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా చదవండి.

3. తుపానుగా మారిన ఫెంగల్

నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఫెంగల్... తుపానుగా మారింది. ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 100 కి.మీ, నాగపట్టణానికి ఆగ్నేయంగా 320 కి.మీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కి.మీ. చెన్నైకి ఆగ్నేయంగా 490 కి.మీ.ల దూరంలో ప్రస్తుతానికి కేంద్రీకృతమై ఉంది. ఇది దాదాపు ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ ఉంది. నవంబర్ 30 నాటికి కారైకాల్, మహాబలిపురం మధ్య ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమపై కూడా ప్రభావం కనిపిస్తోంది. ఇంకా చదవండి.

4. దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు

నిర్మల్​ జిల్లా దిలావర్ పూర్​ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఇప్పుడు తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమవుతోంది. దిలావర్‌పూర్‌–గుండంపల్లి మధ్య నిర్మాణ దశలో పీఎంకే ఇథనాల్‌ ఫ్యాక్టరీ వద్దంటూ ప్రజలు రోడ్డు ఎక్కారు. తమకు అన్నం పెట్టే పొలాలను వదుకునేందుకు సిద్దంగా లేమని ఫ్యాక్టరీ వల్ల పంట భూములు నాశనం అవుతాయని ఆందోళన బాటపట్టారు. దీంతో ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో వారంతా శాంతించారు. కానీ రాజకీయ కాక మాత్రం చల్లారడం లేదు. ఇంకా చదవండి.

5. హైడ్రా, మూసీ ప్రాజెక్టులకు తొలగిన అడ్డంకులు

తెలంగాణ  ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తోంది. ఈ ఏడాదిలో రేవంత్ ప్రారంభించిన రెండు ముఖ్యమైన పనులు హైడ్రా ద్వారా చెరువుల పునరుజ్జీవం, మూసి ప్రక్షాళన. ఈ రెండింటిని ఎంత దూకుడుగా ప్రారంభించారో అంతే దూకుడుగా స్లో చేశారు. బహిరంగసభల్లో ఆపేదే లేదు అని చెబుతున్నారు కానీ.. ఆగినవి మళ్లీ ప్రారంభమయ్యే సూచనలే కనిపించడం లేదు. ఈ రెండు ఇష్యూలను సరిగ్గా డీల్ చేయకపోవడం వల్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతుందన్న కారణంగా రేవంత్ పక్కన పెట్టేశారన్న అభిప్రాయం ఈ కారణంగా వినిపిస్తోంది. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
AP DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ - లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణకు రోజా, పేర్ని నాని డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ - లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణకు రోజా, పేర్ని నాని డిమాండ్!
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
Breaking News: నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget