అన్వేషించండి

Top Headlines: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్ - బీఆర్ఎస్‌తో పొత్తుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Top Headlines In AP And Telangana: 

1. అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేరే లెవల్‌కు తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్లాన్ రెడీ చేస్తోంది. చుట్టుపక్కల ఉన్న నగరాలను కలుపుకొని దీన్ని మెగా సిటీగా రూపకల్పన చేయాలని భావిస్తోంది. కొత్త రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌ మతిపోయేలా చేస్తోంది. కోటి మంది జనాభాతో ప్రపంచంలోనే టాప్ మెగా సిటీగా తీర్చిదిద్దాలని స్కెచ్ వేస్తోంది ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే ప్రతిపాదనలు రెడీ చేసింది. అమరావతితోపాటు విజయవాడ, గుంటూరు, మంగళగిరిని కూడా వేరే లెవల్‌క తీసుకెళ్లాలని సీఆర్డీఏను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంకా చదవండి.

2. విశాఖలో కొడాలి నానిపై ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారన్న కారణంతో వైసీపీ నేతలపై ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు అయింది. ఈ కేసుల అంశంపై కోర్టులో పోరాడుదామనుకుంటున్న వైసీపీ నేతలకు తాజాగా కోర్టు చేసిన వ్యాఖ్యలు పెద్ద షాక్ ఇస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో చంద్రబాబు, లోకేష్‌పై ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పి మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు అయింది. విశాఖలో ఓ మహిళ ఈ ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా చదవండి.

3. తెలంగాణ గ్రూప్ - 3 పరీక్ష ప్రారంభం

తెలంగాణ వ్యాప్తంగా 1,365 పోస్టుల కోసం టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-౩ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్రవ్యాప్తంగా 5.36 లక్షల మంది అప్లై చేసుకుంటే అందులో దాదాపు ఐదు లక్షల మంది పరీక్ష రాశారు. పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులతో రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ఇవాళ(ఆదివారం) రెండు పేపర్లు, సోమవారం ఒక పేపర్‌కు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం పది గంటలన నుంచి 12.30 ఒక పేపర్‌ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఇంకొక పరీక్ష నిర్వహిస్తారు. సోమవారం మూడో పరీక్షలను ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మరో పరీక్ష ఉంటుంది. అర గంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లను క్లోజ్ చేశారు. ఇంకా చదవండి.

4. బీఆర్ఎస్‌తో పొత్తుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మూసీ ప్రక్షాళన రాజకీయం మరోసారి హీటెక్కింది. నిర్వాసిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బస్తీ నిద్ర చేశారు. అనంతరం రేవంత్ సర్కారుపై విమర్శలు చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి అదే స్థాయిలో రియాక్షన్ కూడా వచ్చింది. ఈ సందర్భంగా భవిష్యత్ రాజకీయాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నది విషతుల్యమైపోయిందని అక్కడ ఒక ఆరు నెలలపాటు సామాన్య ప్రజల్లో నివసిస్తే కచ్చితంగా ప్రక్షాళన ఆపేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి తరచూ సవాళ్లు చేస్తున్నారు. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఇంకా చదవండి.

5. ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ

ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కైలాష్ గెహ్లాట్ రాజీనామా చేశారు. ఈ మరేకు పార్టీ అధినేతఅరవింద్ కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో తన రాజీనామాకు కారణాలు వివరించారు. ఇందులో కీలక ఆరోపణలు చేశారు. పార్టీ స్థాపించినప్పటి విలువలకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు చాలా వ్యత్సాసం ఉందని అభిప్రాయపడ్డారు. అందర్నీ ఏకం చేసిన విలువ నుంచి పార్టీ దూరమై సవాళ్లు ఎదుర్కొంటోందని అన్నారు. ప్రజల పట్ల పార్టీ నిబద్ధతను రాజకీయ ఆశయాలు అధిగమించాయని అన్నారు గెహ్లాట్‌. ఫలితంగా చాలా వాగ్దానాలు నెరవేరకుండా మిగిలిపోయాయని అన్నారు. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Embed widget