Ind vs Pak T20 World Cup 2026 | భారత్ తో మ్యాచ్ ఆడమంటున్న పాక్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ( ICC T20 World Cup 2026 ) టోర్నమెంట్ కు సంబంధించి పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీలో భాగంగా భారత్తో ఫిబ్రవరి 15న కొలంబో జరగాల్సిన లీగ్ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్టుగా పాకిస్థాన్ ప్రభుత్వం ( Pakistan Government ) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఈ టోర్నీలోని మిగతా మ్యాచ్లను మాత్రం ఆడుతామని స్పష్టం చేసింది.
'టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టుకు ఇస్లామిక్ రిపబ్లిక్ పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరించాలని సూచించింది.'అని పాకిస్థాన్ ప్రభుత్వం ఎక్స్ వేదికగా పేర్కొంది.
భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగకపోతే భారత్ను విజేతగా ప్రకటించి 2 పాయింట్స్ ఇస్తారు. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) ఇంకా ఐసీసీకి అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. ఐసీసీకి అధికారికంగా పీసీబీ నుంచి లేఖ వస్తేనే.. ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై స్పష్టత వస్తుంది. భారత్తో మ్యాచ్ని బాయ్కాట్ చేయడం వల్ల పాకిస్తాన్కి సూపర్ 8 చేరే అవకాశాలు కూడా తక్కువే.























