India va Namibia Match Preview | T20 World Cup 2026 లో మోత మొదలు పెడతారా.? | ABP Desam
టీ20 వరల్డ్ కప్ 2026ను ప్రారంభించిన భారత్...ఇంకా తన స్థాయి ప్రదర్శన చేయలేదు. వరల్డ్ కప్ కి ముందు న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో 200,250 అంటూ పరుగుల మోత మోగించిన భారత బ్యాటర్లు వాస్తవంగా చెప్పాలంటే పసికూన USA పై మ్యాచ్ లోనే తేలిపోయారు. ఏదో సూర్యా భాయ్ ఆదుకున్నాడు కాబట్టి సరిపోయింది కానీ ఒకానొక దశనలో USA పై భారత్ కి ఘోర పరాభవం తప్పదేమోననే టెన్షనే ఎక్కువ ఉంది. పైగా ఈ వరల్డ్ కప్ లో చిన్న జట్లు వీర విధ్వంసం చేస్తున్నాయి. ఇంగ్లాండ్ పై నేపాల్, సౌతాఫ్రికాపై ఆఫ్గనిస్తాన్ ఆల్మోస్ట్ విక్టరీలు కొట్టేవే. అనుభవం, అదృష్టం ఉన్న కారణంగా ఆ జట్లు తృటిలో ఓటమిని తప్పించుకుని. మరి అలాంటి ఓ చిన్న జట్టు నమీబియా పై భారత్ ఇవాళ తన వరల్డ్ కప్ జర్నీలో రెండో మ్యాచ్ ఢిల్లీలో ఆడబోతోంది. ఈ మ్యాచ్ కు కడుపునొప్పి కారణంగా అభిషేక్ శర్మ దూరం కానున్నాడని టాక్ బలంగా వినిపిస్తోంది. తన ప్లేస్ లో ఇషాన్ తో కలిసి సీనియర్ బ్యాటర్ సంజూశాంసన్ ఓపెనింగ్ కి దిగొచ్చు. న్యూజిలాండ్ తో సిరీస్ నుంచి టచ్ లో కి వచ్చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో ఉండటం భారత్ కి కలిసొచ్చే అంశం. తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ వీళ్లంతా USA మ్యాచ్ లో అంతగా అదరగొట్టలేదు. సో నమీబియాతో మ్యాచ్ లో టచ్ లోకి వచ్చేస్తారేమో చూడాలి. బుమ్రా కి జ్వరం తగ్గింది..కానీ చిన్న టీమ్ తో మ్యాచ్ కాబట్టి తనకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే హైదరాబాదీ మియా సిరాజ్ భాయ్ మొదటి మ్యాచ్ లో చూపించిన ఊపును నమీబియాపైన కనబరిచే అవకాశం ఉంది. బుమ్రా వస్తే మాత్రం సిరాజ్ బెంచ్ కి పరిమితం కాక తప్పదు. అర్ష్ దీప్ తో కలిసి బుమ్రా పేస్ బాధ్యతలు చూసుకుంటాడు. వరుణ్, అక్షర్ పటేల్, కుల్దీప్ స్పిన్ సంగతి చూసుకుంటారు. నమీబియా లో స్టార్ ప్లేయర్లు లేకపోయినా ఎరాస్మస్ కెప్టెన్సీ లో నడుస్తున్న ఆ టీమ్ లో ఆల్ రౌండర్స్ ఎక్కువ. మొదటి మ్యాచ్ వాళ్లు నెదర్లాండ్స్ మీద ఓడిపోయినప్పటికీ మనోళ్లు మరీ లైట్ గా తీసుకుంటే కంగారు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి నమీబియా పై విరుచుకపడి భారత్ తన పాత ఊపులోకి మళ్లీ వచ్చేస్తుందేమో.























