Changes in Team India vs Zimbabwe T20 World Cup | టీమిండియాలో భారీ మార్పులు
టీ20 ప్రపంచకప్ 2026 ( T20 World Cup 2026 ) సూపర్-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన 76 పరుగుల ఘోర పరాజయం టీమిండియా సెమీస్ ఆశలపై నీళ్లు చల్లింది. నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ కేవలం గెలుపు కోసమే కాదు, సెమీస్ రేసులో నిలవడానికి అవసరమైన 'భారీ విజయం' కోసం ఆడాల్సి ఉంటుంది.
ఒకవేళ భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తే, నెట్ రన్ రేట్ను పాజిటివ్లోకి తీసుకురావడానికి కనీసం 77 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అంటే భారత్ 170 పరుగులు చేస్తే.. జింబాబ్వేను 92 లోపే ఆలౌట్ చేయాలి. ఒకవేళ 200 పరుగులు చేస్తే.. 123 పరుగులకే కట్టడి చేయాలి. భారీ స్కోరుతో పాటు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తేనే ఇది సాధ్యం.
ఒకవేళ భారత్ ఛేజింగ్కు దిగితే పరిస్థితి మరింత ఉత్కంఠగా మారుతుంది. పవర్ప్లే నుంచే విధ్వంసకర బ్యాటింగ్ అవసరం ఉంటుంది. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి, భారీ హిట్టింగ్ చేయడం సవాలుతో కూడుకున్న పని. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడమే భారత్కు కలిసొచ్చే అంశం. మరి సూర్య సేన ఈ మ్యాచ్ ను ఎలాంటి ప్లాన్ తో గెలుస్తుందో చూడాలి.























