అన్వేషించండి

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు

Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనకు ఒక్కరోజు ముందే కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలపై మంత్రి కొండా సురేఖ కోపంగా ఉన్నారని తెలుస్తోంది.

Warangal Congress Politics | వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పాలాభిషేకం చిచ్చు రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయారు. వరంగల్ లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లలో ఉంటే.. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఎయిర్ పోర్టుకు నిధులు విడుదల చేసినందుకు రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. దీంతో కొండా సురేఖ తాను లేకుండా ఎలా చేస్తారు, తన సమక్షంలో ఇలాంటివి జరగాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంత్రి సురేఖ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 19న వరంగల్ పర్యటనకు ముందే ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి కొండా సురేఖ మధ్య సమన్వయ లోపం తలెత్తింది. వరంగల్ సభను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మంత్రి కొండా సురేఖ సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ లో సభ వేదికను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో సభకు ముందు రోజే ఇందిరమ్మ మహిళ శక్తి స్టాల్స్ (Indiramma Shakti Stalls) ను ప్రారంభించాలని నిర్ణయించారు.


Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు

స్టాల్స్ ప్రారంభించేందుకు కొండా సురేఖ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎంపీ, ఎమ్మెల్యేల కోసం చూస్తున్నారు. కానీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో మునిగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం కోసం రూ.205 కోట్లు విడుదల చేసిన సందర్భంగా ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో ఎంపీ కడియం కావ్య, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, మేయర్ సుధారాణి తోపాటు ముఖ్య నేతలు పాలాభిషేకం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాను లేకుండా పార్టీకి విధేయత చాటుకున్నారా అంటూ కొండా సురేఖకు కోపం వచ్చింది 

ఎమ్మెల్యేలపై అలిగిన మంత్రి కొండా సురేఖ
మంత్రి కొండా సురేఖ లేని సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం ఆమెకు కోపం తెప్పించింది. తాను స్టాల్స్ ప్రారంభించడం కోసం సభ ప్రాంగణంలో వేచి ఉంటే మీరు అభిషేకాలు చేస్తున్నారు, నేను ఉండవద్దా అని ఎమ్మెల్యేలపై కొండ సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు చేసిన పనికి మంత్రిగారు అలిగారు. దీంతో కొండా సురేఖ, సిటీలోని ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య సమన్వయ లోపం ఏర్పడి ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వరంగల్ కాంగ్రెస్ నేతల పరిస్థితి తయారైంది.

Also Read: Ghost News: 2 నెలల్లో 30 మంది మృతి, గ్రామానికి దెయ్యం పట్టిందని వణికిపోతున్న ప్రజలు - వీడిన మిస్టరీ


Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు

కావాలనే కొండా సురేఖను పక్కన పెట్టారా..!
సభ ప్రాంగణంలో స్టాల్స్ ప్రారంభం మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో ఫిక్స్ చేసినదే. అదే సమయంలో రేవంత్ రెడ్డి చిత్ర పటానికి ఎయిర్ పార్ట్ ప్రాంగణాల్లో పాలాభిషేకం చేశారు. అయితే పాలాభిషేకం అనుకోకుండా చేశారా, లేక మంత్రి కొండా సురేఖ ను కావాలనే ఈ పాలభిషేకానికి దూరంగా ఉంచేలా ఎంపీ, ఎమ్మెల్యేలు ఏకమయ్యారా అని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ పాలాభిషేకంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు అందరూ కొండా ఫ్యామిలీ అంటే గిట్టనివారే నని వినిపిస్తోంది. కనుక కావాలనే ఆమెను పాలాభిషేకానికి దూరంగా ఉంచారా, ఈ విషయాన్ని కొండా సురేఖ ఎలా తీసుకుంటారో అనేది త్వరలో తేలనుంది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు వరంగల్ కాంగ్రెస్ నేతల్లో గ్రూపు రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
Advertisement

వీడియోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Marriages in 2026: డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
Embed widget