అన్వేషించండి

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు

Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనకు ఒక్కరోజు ముందే కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలపై మంత్రి కొండా సురేఖ కోపంగా ఉన్నారని తెలుస్తోంది.

Warangal Congress Politics | వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పాలాభిషేకం చిచ్చు రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయారు. వరంగల్ లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లలో ఉంటే.. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఎయిర్ పోర్టుకు నిధులు విడుదల చేసినందుకు రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. దీంతో కొండా సురేఖ తాను లేకుండా ఎలా చేస్తారు, తన సమక్షంలో ఇలాంటివి జరగాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంత్రి సురేఖ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 19న వరంగల్ పర్యటనకు ముందే ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి కొండా సురేఖ మధ్య సమన్వయ లోపం తలెత్తింది. వరంగల్ సభను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మంత్రి కొండా సురేఖ సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ లో సభ వేదికను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో సభకు ముందు రోజే ఇందిరమ్మ మహిళ శక్తి స్టాల్స్ (Indiramma Shakti Stalls) ను ప్రారంభించాలని నిర్ణయించారు.


Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు

స్టాల్స్ ప్రారంభించేందుకు కొండా సురేఖ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎంపీ, ఎమ్మెల్యేల కోసం చూస్తున్నారు. కానీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో మునిగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం కోసం రూ.205 కోట్లు విడుదల చేసిన సందర్భంగా ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో ఎంపీ కడియం కావ్య, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, మేయర్ సుధారాణి తోపాటు ముఖ్య నేతలు పాలాభిషేకం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాను లేకుండా పార్టీకి విధేయత చాటుకున్నారా అంటూ కొండా సురేఖకు కోపం వచ్చింది 

ఎమ్మెల్యేలపై అలిగిన మంత్రి కొండా సురేఖ
మంత్రి కొండా సురేఖ లేని సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం ఆమెకు కోపం తెప్పించింది. తాను స్టాల్స్ ప్రారంభించడం కోసం సభ ప్రాంగణంలో వేచి ఉంటే మీరు అభిషేకాలు చేస్తున్నారు, నేను ఉండవద్దా అని ఎమ్మెల్యేలపై కొండ సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు చేసిన పనికి మంత్రిగారు అలిగారు. దీంతో కొండా సురేఖ, సిటీలోని ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య సమన్వయ లోపం ఏర్పడి ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వరంగల్ కాంగ్రెస్ నేతల పరిస్థితి తయారైంది.

Also Read: Ghost News: 2 నెలల్లో 30 మంది మృతి, గ్రామానికి దెయ్యం పట్టిందని వణికిపోతున్న ప్రజలు - వీడిన మిస్టరీ


Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు

కావాలనే కొండా సురేఖను పక్కన పెట్టారా..!
సభ ప్రాంగణంలో స్టాల్స్ ప్రారంభం మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో ఫిక్స్ చేసినదే. అదే సమయంలో రేవంత్ రెడ్డి చిత్ర పటానికి ఎయిర్ పార్ట్ ప్రాంగణాల్లో పాలాభిషేకం చేశారు. అయితే పాలాభిషేకం అనుకోకుండా చేశారా, లేక మంత్రి కొండా సురేఖ ను కావాలనే ఈ పాలభిషేకానికి దూరంగా ఉంచేలా ఎంపీ, ఎమ్మెల్యేలు ఏకమయ్యారా అని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ పాలాభిషేకంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు అందరూ కొండా ఫ్యామిలీ అంటే గిట్టనివారే నని వినిపిస్తోంది. కనుక కావాలనే ఆమెను పాలాభిషేకానికి దూరంగా ఉంచారా, ఈ విషయాన్ని కొండా సురేఖ ఎలా తీసుకుంటారో అనేది త్వరలో తేలనుంది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు వరంగల్ కాంగ్రెస్ నేతల్లో గ్రూపు రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Telangana Latest News: సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget