అన్వేషించండి

Ghost News: 2 నెలల్లో 30 మంది మృతి, గ్రామానికి దెయ్యం పట్టిందని వణికిపోతున్న ప్రజలు - వీడిన మిస్టరీ

Ghost in Mulugu District : ములుగు జిల్లాలోని ఓ గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. దాంతో గ్రామానికి దెయ్యం పట్టిందని ప్రజలు వణికిపోతున్నారు. అక్కడికి వెళ్లిన అధికారులు మిస్టరీని ఛేదించారు.

Ghost Fear In Jangalapalli Village In Mulugu District | ములుగు జిల్లాలోని జంగాలపల్లి గ్రామాన్ని దెయ్యం, మూఢ నమ్మకాలు వెంటాడుతున్నాయి. గత రెండు నెలల నుంచి గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తుండటంతో గ్రామానికి కీడు సోకిందని వణికిపోతున్నారు. గ్రామానికి పట్టిన కీడుతోనే అనారోగ్యం బారిన పడి చనిపోయారనే భయంతో ఆందోళన చెందుతున్నారు.
  
గ్రామానికి కీడు సోకింది... దెయ్యం తిరుగుతోంది..
ములుగు జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదానికి అనుకొని ఉన్న జంగాలపల్లి గ్రామాల్లో రెండు, మూడు నెలలుగా 30 మంది పలు ఆనారోగ్య కారణాలతో చనిపోయారు. అయితే గ్రామంలో ఒకరి దశదిన కర్మ ముగియకముందే మరొకరు చనిపోవడంతో గ్రామస్తుల్లో భయం మొదలైంది. దీంతో కొద్ది రోజులుగా గ్రామంలోని ప్రతి ఇంటిని కీడు లేదా దెయ్యం పట్టిందని గ్రామస్తులు బిక్కుబిక్కు మంటూ భయంతో రోజులు వెల్లదీస్తున్నారు. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడంటే చాలు గ్రామస్తులు ఇళ్లలో నుండి బయటకు రావడం లేదు. గ్రామాల్లో ఎవరు కలిసినా, పనులకు వెళ్లినా ఊరికి పట్టిన శని, వరుస మరణాలపై మాట్లాడుకుంటున్నారు.


Ghost News: 2 నెలల్లో 30 మంది మృతి, గ్రామానికి దెయ్యం పట్టిందని వణికిపోతున్న ప్రజలు - వీడిన మిస్టరీ

బొడ్రాయి ప్రతిష్టాపన భయం
గ్రామస్తులను ప్రధానంగా బొడ్రాయి భయం వెంటాడుతుంది. గ్రామానికి కీడు, దయ్యాలు, ఆత్మలు రాకుండా కాపాడే బొడ్రాయిని పునః ప్రతిష్టించకపోవడంతో కీడు సోకి వరుస మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు గట్టిగా నమ్ముతున్నారు. బొడ్రాయి ఏర్పాటు చేసి చాలా ఏళ్లు కావడంతో దుష్ట శక్తుల ప్రభావం పెరిగి.. దెయ్యాల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు భావిస్తున్నారు.


Ghost News: 2 నెలల్లో 30 మంది మృతి, గ్రామానికి దెయ్యం పట్టిందని వణికిపోతున్న ప్రజలు - వీడిన మిస్టరీ

దెయ్యం లేదు... భూతం లేదు....
రెండు, మూడు నెలల్లోనే జంగాలపల్లి లో 30 మంది వరకు మరణించారు. కీడు జరిగి, గ్రామంలో మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. జంగాలపల్లికి దెయ్యం పట్టిందని పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో ములుగు జిల్లా వైద్య అధికారులు రంగంలోకి దిగి మరణాలపై నిగ్గు తేల్చారు. పలు అనారోగ్య కారణాలతో రెండు నెలల్లో 30 మంది  మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్ రావు ఏబీపీ దేశంతో చెప్పారు. 

10 మంది అరవై ఏళ్లు దాటినవారు, వృద్ధాప్య సమస్యలతో, 10 మంది బీపీ, షుగర్ సమస్యలతో చనిపోయారని వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్ రావు తెలిపారు. ఒకరు క్యాన్సర్ తో, ఒకరు ఆల్కహాలు ఎక్కువ తీసుకోవడంతో ఒకరు చనిపోగా, కిడ్నీ వ్యాధితో నలుగురు, బ్రెయిన్ స్ట్రోక్ తో నలుగురు మృతి చెందినట్లు డీఎం అండ్ హెచ్ వో తెలిపారు. కొద్ది రోజుల క్రితం గ్రామంలోని ఓ వ్యక్తి అనారోగ్యంతో నాటు వైద్యం తీసుకుని పసరు మందు తాగి చనిపోవడంతో వారిలో మూఢనమ్మకం భయం మరింత ఎక్కువైందని ఆయన చెప్పారు.


Ghost News: 2 నెలల్లో 30 మంది మృతి, గ్రామానికి దెయ్యం పట్టిందని వణికిపోతున్న ప్రజలు - వీడిన మిస్టరీ

గ్రామాల్లో మెగా హెల్త్ క్యాంప్...
గ్రామంలో భయాన్ని తొలగించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. 15 మంది డాక్టర్లు, ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్ల తో 10 టీం లను ఏర్పాటు చేసి మెగా వైద్య శిబిరం నిర్వహించారు. దెయ్యాలు, భూతాలు లేవని గ్రామస్తుల్లో అవగాహన కల్పిస్తున్నామని డీ ఎం అండ్ హెచ్ వో తెలిపారు. అంతే కాకుండా ఆంటీ లార్వా, వాటర్ శాంపిల్స్ సేకరిస్తున్నామని ఆయన తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget