అన్వేషించండి

Ghost News: 2 నెలల్లో 30 మంది మృతి, గ్రామానికి దెయ్యం పట్టిందని వణికిపోతున్న ప్రజలు - వీడిన మిస్టరీ

Ghost in Mulugu District : ములుగు జిల్లాలోని ఓ గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. దాంతో గ్రామానికి దెయ్యం పట్టిందని ప్రజలు వణికిపోతున్నారు. అక్కడికి వెళ్లిన అధికారులు మిస్టరీని ఛేదించారు.

Ghost Fear In Jangalapalli Village In Mulugu District | ములుగు జిల్లాలోని జంగాలపల్లి గ్రామాన్ని దెయ్యం, మూఢ నమ్మకాలు వెంటాడుతున్నాయి. గత రెండు నెలల నుంచి గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తుండటంతో గ్రామానికి కీడు సోకిందని వణికిపోతున్నారు. గ్రామానికి పట్టిన కీడుతోనే అనారోగ్యం బారిన పడి చనిపోయారనే భయంతో ఆందోళన చెందుతున్నారు.
  
గ్రామానికి కీడు సోకింది... దెయ్యం తిరుగుతోంది..
ములుగు జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదానికి అనుకొని ఉన్న జంగాలపల్లి గ్రామాల్లో రెండు, మూడు నెలలుగా 30 మంది పలు ఆనారోగ్య కారణాలతో చనిపోయారు. అయితే గ్రామంలో ఒకరి దశదిన కర్మ ముగియకముందే మరొకరు చనిపోవడంతో గ్రామస్తుల్లో భయం మొదలైంది. దీంతో కొద్ది రోజులుగా గ్రామంలోని ప్రతి ఇంటిని కీడు లేదా దెయ్యం పట్టిందని గ్రామస్తులు బిక్కుబిక్కు మంటూ భయంతో రోజులు వెల్లదీస్తున్నారు. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడంటే చాలు గ్రామస్తులు ఇళ్లలో నుండి బయటకు రావడం లేదు. గ్రామాల్లో ఎవరు కలిసినా, పనులకు వెళ్లినా ఊరికి పట్టిన శని, వరుస మరణాలపై మాట్లాడుకుంటున్నారు.


Ghost News: 2 నెలల్లో 30 మంది మృతి, గ్రామానికి దెయ్యం పట్టిందని వణికిపోతున్న ప్రజలు - వీడిన మిస్టరీ

బొడ్రాయి ప్రతిష్టాపన భయం
గ్రామస్తులను ప్రధానంగా బొడ్రాయి భయం వెంటాడుతుంది. గ్రామానికి కీడు, దయ్యాలు, ఆత్మలు రాకుండా కాపాడే బొడ్రాయిని పునః ప్రతిష్టించకపోవడంతో కీడు సోకి వరుస మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు గట్టిగా నమ్ముతున్నారు. బొడ్రాయి ఏర్పాటు చేసి చాలా ఏళ్లు కావడంతో దుష్ట శక్తుల ప్రభావం పెరిగి.. దెయ్యాల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు భావిస్తున్నారు.


Ghost News: 2 నెలల్లో 30 మంది మృతి, గ్రామానికి దెయ్యం పట్టిందని వణికిపోతున్న ప్రజలు - వీడిన మిస్టరీ

దెయ్యం లేదు... భూతం లేదు....
రెండు, మూడు నెలల్లోనే జంగాలపల్లి లో 30 మంది వరకు మరణించారు. కీడు జరిగి, గ్రామంలో మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. జంగాలపల్లికి దెయ్యం పట్టిందని పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో ములుగు జిల్లా వైద్య అధికారులు రంగంలోకి దిగి మరణాలపై నిగ్గు తేల్చారు. పలు అనారోగ్య కారణాలతో రెండు నెలల్లో 30 మంది  మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్ రావు ఏబీపీ దేశంతో చెప్పారు. 

10 మంది అరవై ఏళ్లు దాటినవారు, వృద్ధాప్య సమస్యలతో, 10 మంది బీపీ, షుగర్ సమస్యలతో చనిపోయారని వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్ రావు తెలిపారు. ఒకరు క్యాన్సర్ తో, ఒకరు ఆల్కహాలు ఎక్కువ తీసుకోవడంతో ఒకరు చనిపోగా, కిడ్నీ వ్యాధితో నలుగురు, బ్రెయిన్ స్ట్రోక్ తో నలుగురు మృతి చెందినట్లు డీఎం అండ్ హెచ్ వో తెలిపారు. కొద్ది రోజుల క్రితం గ్రామంలోని ఓ వ్యక్తి అనారోగ్యంతో నాటు వైద్యం తీసుకుని పసరు మందు తాగి చనిపోవడంతో వారిలో మూఢనమ్మకం భయం మరింత ఎక్కువైందని ఆయన చెప్పారు.


Ghost News: 2 నెలల్లో 30 మంది మృతి, గ్రామానికి దెయ్యం పట్టిందని వణికిపోతున్న ప్రజలు - వీడిన మిస్టరీ

గ్రామాల్లో మెగా హెల్త్ క్యాంప్...
గ్రామంలో భయాన్ని తొలగించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. 15 మంది డాక్టర్లు, ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్ల తో 10 టీం లను ఏర్పాటు చేసి మెగా వైద్య శిబిరం నిర్వహించారు. దెయ్యాలు, భూతాలు లేవని గ్రామస్తుల్లో అవగాహన కల్పిస్తున్నామని డీ ఎం అండ్ హెచ్ వో తెలిపారు. అంతే కాకుండా ఆంటీ లార్వా, వాటర్ శాంపిల్స్ సేకరిస్తున్నామని ఆయన తెలిపారు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kashmir Terror Attack: కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKRSai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kashmir Terror Attack: కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Musical horn: భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
Mahesh Babu: మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Embed widget