అన్వేషించండి

Guvvala Balaraju: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టర్లు, పొలిమేర వరకు తరిమికొడదాం అంటూ రాతలు

Guvvala Balaraju: అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అచ్చంపేట ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారని, పొలిమేర వరకు తరిమికొడదాం అంటూ పోస్టర్లలో రాశారు.

Guvvala Balaraju: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా.. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు మాత్రం జోరుగా సాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఉన్న టీఆర్ఎస్ నేత అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సహా మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంకా బయటకు రావడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా అచ్చంపేట నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. "అచ్చంపేట ఆత్మగౌరవాన్ని రూ. 100 కోట్లకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అమ్ముకున్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్లారా, యువకుల్లారా, మేధావుల్లారా, విద్యావంతుల్లారా ఒక్కసారి ఆలోచించండి. ఎటుపోతుంది మన అచ్చంపేట ఆత్మగౌరవం. ఎమ్మెల్యే బాలరాజును అచ్చంపేట పొలిమేర దాటే వరకు తరిమికొడదాం.. మన అచ్చంపేట ఆత్మగారవాన్ని కాపాడుకుందాం" అంటూ పోస్టర్లలో రాశారు. 

వివిధ ఘటనలు ఫోటోలతో పోస్టర్లు

నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో ఈ పోస్టర్లు కనిపించాయి. ఈ పోస్టర్లలో.. నియోజకవర్గంలో పలు సందర్భాల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన ఫోటోలను పొందుపరిచారు. వికలాంగుడు శ్రీనుపై దాడి, గిరిజన సర్పంచ్ పై దాడి, ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించిన కార్యకర్తలపై రాళ్ల దాడి ఘటనలకు సంబంధించిన ఫోటోలను ఉంచారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

ప్రత్యర్థుల కుట్ర అంటున్న టీఆర్ఎస్

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలా పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారని స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఈ పోస్టర్లు ప్రత్యర్థుల కుట్ర అని అంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగు చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ నలుగురు ఎమ్మెల్యేలకు భద్రత పెంచింది. వారికి ఎలాంటి హానీ జరగకుండా 24 గంటలు భద్రత కల్పిస్తోంది. 4+4 గన్ మెన్ లు నిత్యం రక్షణ కల్పిస్తున్నారు. 

ఎమ్మెల్యేలను ప్రశ్నించేదెప్పుడు?

ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు ముందుకు సాగుతోంది. ముగ్గురు నిందితుల రెండు రోజుల కస్టడీ కూడా పూర్తయింది. రెండు రోజుల్లో తెలుసుకోగలిగినంత సమాచారం తెలుసుకున్నారు. కానీై వాట్ నెక్ట్స్ అన్నది మాత్రం ఇప్పటికీ అస్పష్టతగానే ఉంది. కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. 23 మంది ముఠా ఉందని అందరికీ తెలిసింది. వీళ్లెవరు ? ఎక్కడెక్కడ ఉంటారు ? వారందర్నీ ఎలా పట్టుకొస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ కేసులో ముందుగానే విడుదల చేసిన సాక్ష్యాలు ఎంత వరకూ చెల్లుబాటనే సందేహం ఉండనే ఉంది. ఈ క్రమంలో అన్నీ వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ఆ నలుగురు ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తారా లేదా అన్న చర్చ నడుస్తోంది.

ఫామ్‌హౌస్ డీల్‌ బయటపడినప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. అంతకు ముందే తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే ట్రాప్ చేశారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ.. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి.. ఆడియో, వీడియోల్లో ఉన్న మాటల మర్మాన్ని తెలుసుకోవడానికి పోలీసులు నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు ప్రశ్నించడం లేదనేది ఎక్కువగా విపక్షాలు సంధిస్తున్న ప్రశ్న. ఆ నలుగురు ఫిర్యాదు దారులైనా సరే వారి దగ్గర్నుంచి వాంగ్మూలం తీుకోవాలి కదా అని అడుగుతున్నారు. కానీ పోలీసులు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. నిందితులను రెండు రోజుల కస్టడీకి తీసుకుని వాయిస్ శాంపిల్స్ తీసుకుని.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి మళ్లీ రిమాండ్‌కు పంపేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Siddhu Jonnalagadda Tillu Square Pre Release: ఈవెంట్ కు అనుపమ  ఎందుకు రాలేదో చెప్పిన సిద్ధుMalla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp DesamNaveen Polishetty Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం బారినపడ్డ నవీన్ పోలిశెట్టి.. ఎంత సీరియస్..?Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Embed widget