అన్వేషించండి

Warangal News: 2017లో కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభం, కానీ మోక్షం ఎప్పుడో ?

Telangana News: హైదరాబాద్, హనుమకొండ రోడ్డు మార్గంలో కాజీపేట రైల్వే లైన్ పై బ్రిడ్జి నిర్మాణం 2017లో మొదలుపెట్టినా, పనులు ఇంకా పూర్తి కాలేదు. దాంతో వాహనదారుల సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

Kazipet Railway Over Bridge works not yet completed- హనుమకొండ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి, ఏడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పనులు ఇంకా నత్త నడకన కొనసాగుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రూ.78 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పనులు 
ప్రజల రాకపోకలు దృష్ట్యా 1972 లో హైదరాబాద్, హనుమకొండ రోడ్డు మార్గంలో కాజీపేట రైల్వే లైన్ పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. పెరిగిన రద్దీకి ఇప్పుడు రాకపోకలు సాగిస్తున్న బ్రిడ్జి  సరిపోక ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాత బ్రిడ్జికి సమాంతరంగా నూతన బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2017 సంవత్సరంలో రూ.78 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఏడు సంవత్సరాలు గడిచినా పనులు నత్తనడకన సాగుతున్నాయి.

Warangal News: 2017లో కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభం, కానీ మోక్షం ఎప్పుడో ?

1972లో బ్రిడ్జి నిర్మాణం.. 
ట్రై సిటీస్‌గా పేరున్న  వరంగల్ నగరంలో కాజీపేట ఒకటి. హైదరాబాద్‌కు వెళ్లాలంటే ప్రధాన రోడ్డు మార్గమైన కాజీపేట మీదుగా వెళ్లాలి. అయితే హైదరాబాద్ కు వెళ్లే రోడ్డు మార్గంలో కాజీపేట రైల్వే లైన్ ఉండడంతో 1972లో ప్రజల అవసరాలు, వాహనదారుల రాకపోకల దృష్ట్యా రైల్వే లైన్ పై ఓవర్ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. అయితే అప్పటి రద్దీకి అనుగుణంగా బ్రిడ్జి నిర్మాణం జరిగింది. సిటీ విస్తరించటం హైదరాబాద్ కు రాకపోకలు పెరగడంతో అప్పటి బ్రిడ్జి ఇరుకుగా మారడంతో, తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. చిన్న ప్రమాదం జరిగినా, భారీ వాహనాలు సాంకేతిక లోపంతో బ్రిడ్జిపై నిలిచిన గంటల తరబడి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. అంతే కాకుండా పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడం, భారీ వాహనాలు వెళ్లినప్పుడు బ్రిడ్జి ధ్వసం అవుతుండడంతో ప్రమాదాన్ని గమనించిన అప్పటి ప్రభుత్వం పాత బ్రిడ్జికి సమాంతరంగా నూతన బ్రిడ్జి నిర్మాణానికి 78 కోట్ల నిధులు మంజూరు చేసింది.

Warangal News: 2017లో కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభం, కానీ మోక్షం ఎప్పుడో ?

2017 సంవత్సరంలో ప్రారంభమైనా, ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రైల్వే లైన్ కు ఇరువైపులా 80 శాతం పనులు పూర్తయిన రైల్వే లైన్ పై చేపట్టాల్సిన పనులు నిలిచిపోయాయి. అయితే రైల్వే లైన్ పై బ్రిడ్జి పనులు పూర్తి చేయడానికి ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు వాహనదారులు. రైల్వే లైన్ పై బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలంటే రైల్వే జీఎం నుంచి అనుమతులు రావడం, రైల్వే నిబంధనల ప్రకారం వారి అధికారుల సమక్షంలో పనులు చేయాల్సి ఉంటుంది. అయితే రైల్వే అధికారుల నుండి అనుమతులు రాకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 

చొరవ చూపకపోవడంతో పూర్తికాని బ్రిడ్జి 
రైల్వే లైన్‌పై నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపెట్టకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని విమర్శలున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ రెండు సార్లు ఎన్నికల్లో గెలిచి దాదాపు 10 ఏళ్లు అధికారంలో కొనాసగింది. గత ప్రభుత్వంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలైనా, దాదాపు ఏడేళ్లు పూర్తయినా పనులు పూర్తి కాదేలు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో బ్రిడ్జి పనులు ఇప్పటికైనా పూర్తి అవుతాయా.. లేక పాత లెక్కలు పరిశీలించడంతో మరింత ఆలస్యం జరిగే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ప్రజా ప్రతినిధులు, రైల్వే అధికారులు చొరవ చూపి రైల్వే ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేయాలని వాహనదారులతో పాటు నగర ప్రజలు కోరుకుంటున్నారు.

నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో మొదట్నుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. సమాంతర బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి ల్యాండ్ సేకరించడంతో పాటు బ్రిడ్జి నిర్మాణ పనుల టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం అప్పటి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని స్థానికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Telangana Latest News: సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget