అన్వేషించండి

Bhupalpally: BRSలో భగ్గుమన్న విభేదాలు - ఎమ్మెల్సీ కవిత, మంత్రి ఎదుటే తోపులాటలు

జిల్లాకు చెందిన మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణా రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కీలక నేతల ఎదుటే బయటపడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారత్ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకుల్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఏకంగా ఎమ్మెల్సీ కవిత, ఇతర మంత్రుల ఎదుటే వారి మధ్య ఉన్న గొడవలు బట్టబయలు అయ్యాయి. జిల్లాకు చెందిన మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణా రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కీలక నేతల ఎదుటే బయటపడడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా తాజా పరిణామం చోటు చేసుకుంది. 

జనవరి 22 (ఆదివారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక సంఘం భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే, అదే సమయంలో జిల్లాకు చెందిన నేతలు మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణా రెడ్డి బలప్రదర్శనలకు దిగారు. ఈ క్రమంలో శిలాఫలకం మీద మధుసూదనాచారి పేరు లేదని ఆయన వర్గీయులు అక్కడికక్కడే అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ లోపు గండ్ర వెంకటరమణా రెడ్డి అనుచరులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలకు దిగాయి. ఆ తర్వాత తోపులాటలు సైతం జరిగాయి. దీంతో పోలీసులు, ఇతర నేతలు కలగజేసుకొని పరిస్థితి సరిదిద్దారు.

ములుగు జిల్లాలోనూ పర్యటన

నేడు కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లాలోనూ పర్యటించారు. ములుగు జిల్లాలో రాతితో నిర్మించిన రామప్ప ఆలయాన్ని కవిత సందర్శించారు. ఆదివారం ఉదయం కవిత ఆలయాన్ని సందర్శించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగానే కాకుండా చారిత్రాత్మక, మహిమాన్వితమైన పురాతన ఆలయంగా గుర్తింపు కలిగి ఉందన్నారు. అద్భుతమైన చరిత్రను, సంప్రదాయలను వినడానికి ఇలాంటి ప్రదేశాల్ని చూడటం తనకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుందన్నారు. రుద్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యునెస్కో గుర్తింపు పొందిన ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు కవిత. భవిష్యత్‌లో రామప్ప దేవాలయాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడం రామప్ప ఆలయాన్ని కూడా వారు సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శిల్పి పేరుతో రామప్ప ఆలయాన్ని నిర్మించి కాకతీయులు ఈ ప్రాంతానికి వన్నె తెచ్చారని, యునెస్కో గుర్తింపు లభించేలా కృషి చేసి కేసీఆర్ రామప్ప ఖ్యాతి విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. రామప్ప దేవాలయం మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తోందని అన్నారు.

సింగరేణి అంటే కేవలం బొగ్గు తీయడమే కాదని, విద్యుత్ ఉత్పత్తి కూడా ఆ సంస్థే చేయొచ్చు అని నిరూపిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో సింగరేణిని కాపాడుకుంటామని చెప్పారు. తెలంగాణలో సింగరేణి కార్మికులకు వస్తున్న బెనిఫిట్స్ దేశవ్యాప్తంగా ఎందుకు రావడం లేదని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న సింగరేణి కార్మికులను సోషల్ మీడియా ద్వారా చైతన్యం చేయాలని ఆమె అన్నారు. వారసత్వ ఉద్యోగాలు పొందిన 18 వేల మంది యువకులు బాధ్యతగా భావించాలని ఆమె సూచించారు. బీజేపీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget