అన్వేషించండి

Bhupalpally: BRSలో భగ్గుమన్న విభేదాలు - ఎమ్మెల్సీ కవిత, మంత్రి ఎదుటే తోపులాటలు

జిల్లాకు చెందిన మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణా రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కీలక నేతల ఎదుటే బయటపడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారత్ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకుల్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఏకంగా ఎమ్మెల్సీ కవిత, ఇతర మంత్రుల ఎదుటే వారి మధ్య ఉన్న గొడవలు బట్టబయలు అయ్యాయి. జిల్లాకు చెందిన మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణా రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కీలక నేతల ఎదుటే బయటపడడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా తాజా పరిణామం చోటు చేసుకుంది. 

జనవరి 22 (ఆదివారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక సంఘం భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే, అదే సమయంలో జిల్లాకు చెందిన నేతలు మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణా రెడ్డి బలప్రదర్శనలకు దిగారు. ఈ క్రమంలో శిలాఫలకం మీద మధుసూదనాచారి పేరు లేదని ఆయన వర్గీయులు అక్కడికక్కడే అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ లోపు గండ్ర వెంకటరమణా రెడ్డి అనుచరులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలకు దిగాయి. ఆ తర్వాత తోపులాటలు సైతం జరిగాయి. దీంతో పోలీసులు, ఇతర నేతలు కలగజేసుకొని పరిస్థితి సరిదిద్దారు.

ములుగు జిల్లాలోనూ పర్యటన

నేడు కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లాలోనూ పర్యటించారు. ములుగు జిల్లాలో రాతితో నిర్మించిన రామప్ప ఆలయాన్ని కవిత సందర్శించారు. ఆదివారం ఉదయం కవిత ఆలయాన్ని సందర్శించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగానే కాకుండా చారిత్రాత్మక, మహిమాన్వితమైన పురాతన ఆలయంగా గుర్తింపు కలిగి ఉందన్నారు. అద్భుతమైన చరిత్రను, సంప్రదాయలను వినడానికి ఇలాంటి ప్రదేశాల్ని చూడటం తనకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుందన్నారు. రుద్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యునెస్కో గుర్తింపు పొందిన ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు కవిత. భవిష్యత్‌లో రామప్ప దేవాలయాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడం రామప్ప ఆలయాన్ని కూడా వారు సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శిల్పి పేరుతో రామప్ప ఆలయాన్ని నిర్మించి కాకతీయులు ఈ ప్రాంతానికి వన్నె తెచ్చారని, యునెస్కో గుర్తింపు లభించేలా కృషి చేసి కేసీఆర్ రామప్ప ఖ్యాతి విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. రామప్ప దేవాలయం మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తోందని అన్నారు.

సింగరేణి అంటే కేవలం బొగ్గు తీయడమే కాదని, విద్యుత్ ఉత్పత్తి కూడా ఆ సంస్థే చేయొచ్చు అని నిరూపిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో సింగరేణిని కాపాడుకుంటామని చెప్పారు. తెలంగాణలో సింగరేణి కార్మికులకు వస్తున్న బెనిఫిట్స్ దేశవ్యాప్తంగా ఎందుకు రావడం లేదని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న సింగరేణి కార్మికులను సోషల్ మీడియా ద్వారా చైతన్యం చేయాలని ఆమె అన్నారు. వారసత్వ ఉద్యోగాలు పొందిన 18 వేల మంది యువకులు బాధ్యతగా భావించాలని ఆమె సూచించారు. బీజేపీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Telangana Latest News: సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Embed widget