అన్వేషించండి

Warangal News : ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం, మృతదేహాల తారుమారు!

Warangal News : వరంగల్ ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యంతో మృతదేహాలు తారుమారు అయ్యాయి.

Warangal News : వరంగల్ ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఒకరి మృతదేహం బదులు వేరే మృతదేహాన్ని ఇచ్చారు పోస్ట్ మార్టం సిబ్బంది. కొద్ది దూరం వెళ్లాక గుర్తించిన బంధువులు మళ్లీ ఎంజీఎంకి వచ్చి తన బంధువు మృతదేహం తీసుకెళ్లారు. వరంగల్ నగరంలోని కాకతీయ వైద్య కళాశాలకు సంబంధించిన మార్చరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్ పల్లకి చెందిన రాగుల రమేష్ భార్యతో గొడవపడి నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పరమేశ్వర్ గాయంతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. ఇవాళ వారిని పోస్టుమార్టం చేసిన సిబ్బంది పరమేశ్వర్ మృతదేహానికి బదులు రమేష్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కొద్ది దూరం వెళ్లాక మృతదేహాన్ని చూడడంతో తమకు సంబంధించిన మృతదేహం కాదని తిరిగి ఎంజీఎం మార్చడానికి వచ్చి పరమేశ్వర్ మృతదేహాన్ని తీసుకెళ్లారు. దీంతో కొద్దిసేపు రమేష్ బంధువులు ఎంజీఎం వద్ద ఆందోళన చేశారు. ఇక పోస్టుమార్టం సిబ్బంది తమకు సంబంధం లేదన్నారు. మద్యం మత్తులో బంధువులే ఒకరి మృతదేహానికి బదులు ఇంకో మృతదేహాన్ని తీసుకెళ్లారని మళ్లీ తమది కాదని తీసుకొచ్చారని మార్చురీ సిబ్బంది సమాధానం చెబుతున్నారు.  

మార్చురీలో నయా దందా 

వరంగల్‌ లోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆస్పత్రిలోని మార్చురీలో ఇటీవల ఓ దందా వెలుగుచూసింది. పేషెంట్స్, వారి బంధువుల కన్నీరు ఆస్పత్రిలోని కొందరు సిబ్బందికి ఆదాయ వనరవుతోంది. కాసులు చేతికిరానిదే పోస్ట్ మార్టం చేయలేని పరిస్థితులు ఉన్నాయని గతంలో పలుమార్లు విమర్శలు వచ్చాయి. మృతదేహాలను బయటకు తీసుకురావడానికీ సమర్పించాల్సి వస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలో దీనిపై నాలుగేళ్ల కిందట చర్చ జరిగింది. ఓ డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించడానికి రూ.5 వేలు డిమాండ్ చేసిన వీడియో ఇటీవల వైరల్ కావడంతో అప్పట్లో రాష్ట్ర స్థాయి అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు స్పందించారు. అంతా తెలిసినా అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. వైద్య సేవలందించాల్సిన వారే దళారులుగా మారడంతో పేషెంట్ల కుటుంబాలు ఎవరికి చెప్పాలో తెలియని అయోమయంలో ఉన్నారు.

వరంగల్ ఎంజీఎం మార్చరీలో ప్రతిరోజూ ఐదు నుంచి పది వరకు శవాలకు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. అయితే పోస్టుమార్టానికి వెళ్తున్న శవాలపై డబ్బులు డిమాండ్ చేస్తూ మరోసారి దందాకు తెరలేపారు సిబ్బంది. ఈ ఏడాది జనవరిలో పస్తం శ్రీను అనే వ్యక్తి వరంగల్ - కాజీపేట మధ్య వందేబారత్ ట్రైన్ ఢీ కొని మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చరీకి తరలించారు జీఆర్పీ పోలీసులు. అసలు సమస్య అక్కడే మొదలైంది. ఐదు రోజుల పాటు డెడ్ బాడీ ఎంజీఎం మార్చరీలోనే ఉంది. అయితే రూ.15000 డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. వరంగల్ ఎంజీఎం మార్చరీలో సిబ్బందితో పాటు పంచానామా రాసే కానిస్టేబుల్ సైతం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించే డాక్టర్ కు రూ.3500, ఫోటోగ్రాఫర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ కోసం రూ. 3500, పోలీస్ కానిస్టేబుల్‌కు రూ. 3500, అంబులెన్స్ పేరుతో రూ.3500 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఘటన ఏబీపీ దేశం కథనాలు ప్రసారం చేసింది.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Kiara Advani: సివంగిలా మారా... డెలివరీ తర్వాత జీవితంలో వచ్చిన మార్పులపై కియారా అద్వానీ
సివంగిలా మారా... డెలివరీ తర్వాత జీవితంలో వచ్చిన మార్పులపై కియారా అద్వానీ
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: విరాట్ ముద్దు... అనుష్క సిగ్గు... ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వైరల్ వీడియో చూశారా?
విరాట్ ముద్దు... అనుష్క సిగ్గు... ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వైరల్ వీడియో చూశారా?
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
TVK Election Manifesto 2026: జాబ్ క్యాలెండర్, 20 లక్షల పూచీకత్తు లేని రుణాలు.. టీవీకే పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోపై విజయ్
జాబ్ క్యాలెండర్, 20 లక్షల పూచీకత్తు లేని రుణాలు.. టీవీకే పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోపై విజయ్
Embed widget