అన్వేషించండి

Telangana Elections 2023: తెలంగాణ వ్యాప్తంగా 5వేలకుపైగా నామినేషన్లు, ఏ జిల్లాలో ఎంత మంది అంటే!

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ప్రక్రియకు తెరపడింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు భారీ సంఖ్యలో స్వతంత్రులు నామినేషన్లు వేశారు.

Telangana Assembly Election 2023 Nominations List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ప్రక్రియకు తెరపడింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు భారీ సంఖ్యలో స్వతంత్రులు నామినేషన్లు వేశారు. కొందరు అభ్యర్థులు భారీ ర్యాలీలతో ఆర్‌ఓల కార్యాలయాలకు వెళ్లారు. మరికొందరు నిరాడంబరంగా నామినేషన్‌ వేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి సీట్లు దక్కని వారు రెబల్స్‌గా పోటీ చేస్తున్నారు. కడపటి సమాచారం అందే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 5,170 మంది నామినేషన్లు వేశారు. తుది ప్రకటన వచ్చాక వీటి సంఖ్య మారే అవకాశం ఉంది

  • ఖమ్మం జిల్లాలో 147 మంది అభ్యర్థులు 215 నామినేషన్లు వేయగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 136 మంది అభ్యర్థులు.. 211 నామినేషన్లు దాఖలు చేశారు.
  • ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 236 మంది అభ్యర్థులు 410 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజైన శుక్రవారం నిజామాబాద్‌లో గణేశ్‌ గుప్తా, ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి, మద్నూర్‌లో హన్మంత్‌ షిండే, ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్‌ నామినేషన్లను సమర్పించారు. 
  • కామారెడ్డి జిల్లాలోని మూడు(కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌) నియోజకవర్గాల్లో మొత్తం 132 మంది అభ్యర్థులు 195 సెట్ల నామినేషన్లు వేశారు. 
  • ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 237మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు ఏకంగా 156 నామినేషన్లు దాఖలు చేశారు. అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ గద్వాల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ ర్యాలీలతో నామినేషన్లు దాఖలు చేశారు. 
  • నామినేషన్‌ చివరి రోజైన శుక్రవారం మెదక్ జిల్లాలో జోరుగా నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. మెదక్‌ అసెంబ్లీ స్థానానికి 13 మంది అభ్యర్థులు 14 సెట్లు, నర్సాపూర్‌లో 11 మంది అభ్యర్థులు, 15సెట్ల నామినేషన్లు సమర్పించారు. మెదక్‌లో అత్యధికంగా స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయడం గమనార్హం. 
  • మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గానికి వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు 24 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 12 మంది అభ్యర్థులు మొదటిసారిగా నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి వాడాల రాములుకు అందజేశారు. చెన్నూరు అసెంబ్లీ స్థానానికి 29 మంది అభ్యర్థులు 54 నామపత్రాలు దాఖలు చేశారు. బెల్లంపల్లిలో చివరి రోజు 20 మంది అభ్యర్థులు 26 నామపత్రాలు దాఖలు చేశారు. మొత్తం 25 మంది అభ్యర్థులు 46 నామినేషన్లు వేశారు.
  • జనగామలో ఈ నెల 9వ తేదీ వరకు 13 మంది 22 నామినేషన్లను సమర్పించగా, చివరి రోజు 19 మంది 35 సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. ప్రధాన, ఇతర పార్టీలు, స్వతంత్రులు మొత్తం 32 మంది పోటీకి ముందుకొచ్చారు. ఆఖరి నిమిషం వరకు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు పరుగులు తీశారు.
  • వికారాబాద్ జిల్లాలో చివరి రోజు మొత్తం 146 నామినేషన్లు పత్రాలు దాఖలయ్యాయి. అధికంగా గతంలో దాఖలు చేసిన అభ్యర్థులే మరో సెట్టు సమర్పించారు.
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచేందుకు మొత్తం 307 మంది అభ్యర్థులు 568 సెట్లను దాఖలు చేశారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీల తరపున అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామపత్రాల్ని ఎన్నికల అధికారికి అందజేశారు. గుర్తింపు పొందిన పార్టీల తరఫున కొందరు, స్వతంత్రులు నామినేషన్లు వేశారు. గురువారం వరకు 187 మంది నామినేషన్లు వేయగా.. చివరి రోజున ఏకంగా 119 మంది కొత్తగా పత్రాలను సమర్పించారు.
  • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 428 మంది నామినేషన్‌ వేశారు. జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో మొత్తం 154 మంది అభ్యర్థులు 265 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో గుర్తింపు పొందిన పార్టీల నుంచి 72 మంది, స్వతంత్ర అభ్యర్థులుగా 82 మంది నామపత్రాలు సమర్పించారు. స్వతంత్ర అభ్యర్థుల నుంచి అధికంగా నామినేషన్లు వచ్చాయి. 

ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. సరిగా లేనివాటిని అధికారులు తిరస్కరిస్తారు. ఉపసంహరణకు ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉంది. ఆ తర్వాత మిగిలిన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Ganesh immersion arrangements: గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం - ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికీ కీలక డీటైల్స్
గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం - ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికీ కీలక డీటైల్స్
AP helicopter issue: ఏపీ ప్రభుత్వ హెలికాఫ్టర్‌పై ఫేక్ ప్రచారం - కేసులు పెట్టడం ఖాయమని ప్రభుత్వం హెచ్చరిక
ఏపీ ప్రభుత్వ హెలికాఫ్టర్‌పై ఫేక్ ప్రచారం - కేసులు పెట్టడం ఖాయమని ప్రభుత్వం హెచ్చరిక
Madharaasi OTT: ఆ ఓటీటీలోకే శివకార్తికేయన్ 'మదరాసి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకే శివకార్తికేయన్ 'మదరాసి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Fertilizer shortage in Telangana: తెలంగాణలో ఎరువుల కొరత తీవ్రం - సహనం కోల్పోతున్న రైతులు - ప్రభుత్వ తీరుపై విమర్శలు
తెలంగాణలో ఎరువుల కొరత తీవ్రం - సహనం కోల్పోతున్న రైతులు - ప్రభుత్వ తీరుపై విమర్శలు
Advertisement

వీడియోలు

Allu Arjun Attended SIIMA 2025 | దుబాయ్ గ్రాండ్ గా మొదలైన సైమా వేడుకలు | ABP Desam
Ghaati Movie Review Telugu | Anushka Shetty తో కూడా తలనొప్పి తెప్పించొచ్చా.? | ABP Desam
Asia Cup 2025 | కంగారు పెట్టిస్తున్న టీం ఇండియా గణాంకాలు
Irfan Pathan Comments on MS Dhoni | ధోనీపై ట్రోల్స్.. స్పందించిన ఇర్ఫాన్ పఠాన్
Yograj Singh Slams Dhoni Over Hookah Controversy | ధోనీపై విరుచుకుపడ్డ యువరాజ్ తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Ganesh immersion arrangements: గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం - ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికీ కీలక డీటైల్స్
గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం - ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికీ కీలక డీటైల్స్
AP helicopter issue: ఏపీ ప్రభుత్వ హెలికాఫ్టర్‌పై ఫేక్ ప్రచారం - కేసులు పెట్టడం ఖాయమని ప్రభుత్వం హెచ్చరిక
ఏపీ ప్రభుత్వ హెలికాఫ్టర్‌పై ఫేక్ ప్రచారం - కేసులు పెట్టడం ఖాయమని ప్రభుత్వం హెచ్చరిక
Madharaasi OTT: ఆ ఓటీటీలోకే శివకార్తికేయన్ 'మదరాసి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకే శివకార్తికేయన్ 'మదరాసి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Fertilizer shortage in Telangana: తెలంగాణలో ఎరువుల కొరత తీవ్రం - సహనం కోల్పోతున్న రైతులు - ప్రభుత్వ తీరుపై విమర్శలు
తెలంగాణలో ఎరువుల కొరత తీవ్రం - సహనం కోల్పోతున్న రైతులు - ప్రభుత్వ తీరుపై విమర్శలు
Bakasura Restaurant OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'బకాసుర రెస్టారెంట్' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'బకాసుర రెస్టారెంట్' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
జీఎస్టీ తగ్గింపు తర్వాత Tata Punch రేటు ఎంత తగ్గుతుంది, కస్టమర్‌కు ఎంత మిగులుతుంది? - కొత్త ధర తెలుసుకోండి
జీఎస్టీ తగ్గింపుతో Tata Punch సూపర్ చీప్‌, కొత్త ధర చూసి షాక్ అవ్వాల్సిందే!
Harish Rao Comments On KCR: బీఆర్ఎస్ పార్టీకి కేసీఆరే బిగ్ బాస్, కవిత ఆరోపణల తరువాత తొలిసారి స్పందించిన హరీష్ రావు
బీఆర్ఎస్ పార్టీకి కేసీఆరే బిగ్ బాస్, కవిత ఆరోపణల తరువాత తొలిసారి స్పందించిన హరీష్ రావు
Ganesh Nimajjanam 2025: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం కోసం జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు, నిరంతరం పర్యవేక్షణ
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం కోసం జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు, నిరంతరం పర్యవేక్షణ
Embed widget