అన్వేషించండి

Telangana News: కోటి ఎకరాలు దాటిన పంటల సాగు - 41.73 లక్షల ఎకరాల్లో వరి

Telangana News: తెలంగాణలో వానాకాలం సీజన్ లో పంటల సాగు కోటి ఎకరాలు దాటింది. ప్రస్తుత సీజన్ లో కోటి 24 లక్షల 28 వేల 723 ఎకరాలకు గాను కోటి లక్షా 72 వేల 283 ఎకరాల్లో పంటలు వేసినట్లు తెలుస్తోంది.  

Telangana News: తెలంగాణలో వానాకాలం సీజన్ లో పంటల సాగు మరోసారి కోటి ఎకరాలు దాటింది. ప్రస్తుత సీజన్ లో 1,24,28,723 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను బుధవారం వరకు 1,01,72,383 ఎకరాల్లో పంటలు వేశారని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదించింది. గతేడాది ఇదే సమయానికి 94 లక్షల 93 వేల 27 ఎకరాల్లో సాగు కాగా ఈ ఏడాది అంతకంటే అదనంగా దాదాపు ఏడు లక్షల ఎకరాల్లో పంటల సాగు మొదలైనట్లు పేర్కొంది. అత్యధికంగా 41,73,997 ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. గతేడాది ఇదే సమయానికి 30,81,517 ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ినరుటి కంటే ఈసారి దాదాపు పది లక్షల ఎకరాల్లో అధికంగా నాట్లు పడ్డాయి. వచ్చే నెల మొదటి వారం వరకు వరినాట్లు కొనసాగనున్నందువల్ల సాధారణ సాగు లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. కాగా నిరుడు మొత్తం 1.24 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. 

వర్షాకాలం సీజన్ ఆరంభంలో వర్షాలు కురవడం ఆలస్యం కావడంతో.. ఈ ఏడాది పంటల సాగు సగటును చేరుకుంటుందో లేదో అన్న అనుమానాలు రేకెత్తాయి. కానీ జులైలో భారీగా వానలు కురవడంతో పరిస్థితి కొంత మెరుగైంది. ఈనెలలో ఇప్పటి వరకు వర్షపాతం తక్కువగా నమోదు అయినప్పటికీ... ఇంకా పక్షం రోజుల సమయం ఉంది. దీంతో సగటు వర్షాపాతాన్ని దాటుతుందని.. పంటల సాగు పెరుగుతుందని వ్యవసాయశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటి వరకు సగటు వర్షపాతం 475.9 మిల్లీ మీటర్లు కాగా బుధవారం వరకు 583.7 మిల్లీ మీటర్లు నమోదు అయింది. 

జిల్లాల వారీగా చూస్తే.. మెదక్ లో 221.29 శాతం, అదిలాబాద్ లో 104.17 శాతం, కుమురం భీం ఆసిఫాబాద్ లో 1043.53 శాతం, నిజామాబాద్ లో 103.68 శాతం సాగు చేశారు. ఈ జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణం కంటే అధికంగా పంటలు సాగు అవుతున్నాయి. నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, జనగామ, వికారాబాద్, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో 76 నుంచి 100 శాతం మేరకు పంటలు వేశారు. మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, సూర్యాపేట జిల్లాల్లో 75 శాతం మేరకు పంటలు సాగు అవుతున్నాయి. ములుగు 36.86 శాతం, వనపర్తి 25.96 శాతం జల్లాల్లో 50 శాతం కంటే తక్కువ పంటలు వేశారు. 

ఇందులో వరి 49,86,634 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 71,73,997 (83.70 శాతం ) సాగు చేస్తున్నారు. అలాగే పత్తి 50,59,225 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 44,57,396 (88.10 శాతం ) సాగు చేస్తున్నారు. మొక్కజొన్న 7,13,474 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 5,06,066 (71.04 శాతం ) సాగు చేస్తున్నారు. కందులు 7,69,753 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 4,56,066 (59.25 శాతం ) సాగు చేస్తున్నారు. సోయాబీన్ 4,13,064 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 4,43,471 (107.36 శాతం ) సాగు చేస్తున్నారు. పెసలు 1,23,830 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 49,532 (40.00 శాతం ) సాగు చేస్తున్నారు. జొన్నలు 81,389 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 22,069 (27.11 శాతం ) సాగు చేస్తున్నారు. చెరుకు 63,841 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 41,142 (64.44 శాతం ) సాగు చేస్తున్నారు. మినుములు 45,259 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 19,19 (42.41 శాతం ) సాగు చేస్తున్నారు. వేరు సెనగ 30,191 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 6,439 (21.33 శాతం) సాగు చేస్తున్నారు. నువ్వులు 29,151 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 2,599 (8.91 శాతం) సాగు చేస్తున్నారు. 

అలాగే తెలంగాణలో పత్తి, సోయాబీన్, జొన్న, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, పప్పు దినుసులు, వేరు సెనగ పంటలు వేయడం పూర్తయింది. వరినాట్లు వచ్చే నెల మొదటి వారం వరకు కొనసాగుతాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఈసారి పంటల సాగులో వరి అగ్ర స్థానంలో నిలవబోతుంది. నిరుడు వానాకాలం సీజన్ లో 62.12 లక్షల ఎకరాల్లో వరి పండించారు. ఈసారి ఇప్పటికే 41 లక్షల ఎకరాలు దాటగా.. వచ్చే నెల మొదటి వారం వరకు సాధారణ సాగు విస్తీర్ణాన్ని చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. నిరుడు పత్తి 49.58 లక్షల ఎకరాల్లో సాగు అయింది. ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల 44.57 లక్షల ఎకరాలకు తగ్గింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Abhishek Manu Singhvi assets: కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీ - లాయర్‌గానే వందల కోట్ల ఆర్జన -వేల కోట్ల ఆస్తులు !
కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీ - లాయర్‌గానే వందల కోట్ల ఆర్జన -వేల కోట్ల ఆస్తులు !
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget