అన్వేషించండి

Telangana News: కోటి ఎకరాలు దాటిన పంటల సాగు - 41.73 లక్షల ఎకరాల్లో వరి

Telangana News: తెలంగాణలో వానాకాలం సీజన్ లో పంటల సాగు కోటి ఎకరాలు దాటింది. ప్రస్తుత సీజన్ లో కోటి 24 లక్షల 28 వేల 723 ఎకరాలకు గాను కోటి లక్షా 72 వేల 283 ఎకరాల్లో పంటలు వేసినట్లు తెలుస్తోంది.  

Telangana News: తెలంగాణలో వానాకాలం సీజన్ లో పంటల సాగు మరోసారి కోటి ఎకరాలు దాటింది. ప్రస్తుత సీజన్ లో 1,24,28,723 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను బుధవారం వరకు 1,01,72,383 ఎకరాల్లో పంటలు వేశారని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదించింది. గతేడాది ఇదే సమయానికి 94 లక్షల 93 వేల 27 ఎకరాల్లో సాగు కాగా ఈ ఏడాది అంతకంటే అదనంగా దాదాపు ఏడు లక్షల ఎకరాల్లో పంటల సాగు మొదలైనట్లు పేర్కొంది. అత్యధికంగా 41,73,997 ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. గతేడాది ఇదే సమయానికి 30,81,517 ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ినరుటి కంటే ఈసారి దాదాపు పది లక్షల ఎకరాల్లో అధికంగా నాట్లు పడ్డాయి. వచ్చే నెల మొదటి వారం వరకు వరినాట్లు కొనసాగనున్నందువల్ల సాధారణ సాగు లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. కాగా నిరుడు మొత్తం 1.24 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. 

వర్షాకాలం సీజన్ ఆరంభంలో వర్షాలు కురవడం ఆలస్యం కావడంతో.. ఈ ఏడాది పంటల సాగు సగటును చేరుకుంటుందో లేదో అన్న అనుమానాలు రేకెత్తాయి. కానీ జులైలో భారీగా వానలు కురవడంతో పరిస్థితి కొంత మెరుగైంది. ఈనెలలో ఇప్పటి వరకు వర్షపాతం తక్కువగా నమోదు అయినప్పటికీ... ఇంకా పక్షం రోజుల సమయం ఉంది. దీంతో సగటు వర్షాపాతాన్ని దాటుతుందని.. పంటల సాగు పెరుగుతుందని వ్యవసాయశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటి వరకు సగటు వర్షపాతం 475.9 మిల్లీ మీటర్లు కాగా బుధవారం వరకు 583.7 మిల్లీ మీటర్లు నమోదు అయింది. 

జిల్లాల వారీగా చూస్తే.. మెదక్ లో 221.29 శాతం, అదిలాబాద్ లో 104.17 శాతం, కుమురం భీం ఆసిఫాబాద్ లో 1043.53 శాతం, నిజామాబాద్ లో 103.68 శాతం సాగు చేశారు. ఈ జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణం కంటే అధికంగా పంటలు సాగు అవుతున్నాయి. నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, జనగామ, వికారాబాద్, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో 76 నుంచి 100 శాతం మేరకు పంటలు వేశారు. మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, సూర్యాపేట జిల్లాల్లో 75 శాతం మేరకు పంటలు సాగు అవుతున్నాయి. ములుగు 36.86 శాతం, వనపర్తి 25.96 శాతం జల్లాల్లో 50 శాతం కంటే తక్కువ పంటలు వేశారు. 

ఇందులో వరి 49,86,634 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 71,73,997 (83.70 శాతం ) సాగు చేస్తున్నారు. అలాగే పత్తి 50,59,225 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 44,57,396 (88.10 శాతం ) సాగు చేస్తున్నారు. మొక్కజొన్న 7,13,474 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 5,06,066 (71.04 శాతం ) సాగు చేస్తున్నారు. కందులు 7,69,753 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 4,56,066 (59.25 శాతం ) సాగు చేస్తున్నారు. సోయాబీన్ 4,13,064 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 4,43,471 (107.36 శాతం ) సాగు చేస్తున్నారు. పెసలు 1,23,830 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 49,532 (40.00 శాతం ) సాగు చేస్తున్నారు. జొన్నలు 81,389 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 22,069 (27.11 శాతం ) సాగు చేస్తున్నారు. చెరుకు 63,841 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 41,142 (64.44 శాతం ) సాగు చేస్తున్నారు. మినుములు 45,259 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 19,19 (42.41 శాతం ) సాగు చేస్తున్నారు. వేరు సెనగ 30,191 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 6,439 (21.33 శాతం) సాగు చేస్తున్నారు. నువ్వులు 29,151 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 2,599 (8.91 శాతం) సాగు చేస్తున్నారు. 

అలాగే తెలంగాణలో పత్తి, సోయాబీన్, జొన్న, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, పప్పు దినుసులు, వేరు సెనగ పంటలు వేయడం పూర్తయింది. వరినాట్లు వచ్చే నెల మొదటి వారం వరకు కొనసాగుతాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఈసారి పంటల సాగులో వరి అగ్ర స్థానంలో నిలవబోతుంది. నిరుడు వానాకాలం సీజన్ లో 62.12 లక్షల ఎకరాల్లో వరి పండించారు. ఈసారి ఇప్పటికే 41 లక్షల ఎకరాలు దాటగా.. వచ్చే నెల మొదటి వారం వరకు సాధారణ సాగు విస్తీర్ణాన్ని చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. నిరుడు పత్తి 49.58 లక్షల ఎకరాల్లో సాగు అయింది. ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల 44.57 లక్షల ఎకరాలకు తగ్గింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: పినరయి విజయన్‌‌ను గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్న మోదీ.. కేరళలో మార్పు తప్పదు- రేవంత్ రెడ్డి
పినరయి విజయన్‌‌ను గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్న మోదీ.. కేరళలో మార్పు తప్పదు- రేవంత్ రెడ్డి
Hyderabad News: గోల్కొండలో బాలికపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న యువకుడు.. పిలిచి సత్కరించిన సీపీ సజ్జనార్
గోల్కొండలో బాలికపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న యువకుడు.. పిలిచి సత్కరించిన సీపీ సజ్జనార్
First Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
Five villages: ఖమ్మం ఐదు గ్రామాల సమస్యకు పరిష్కారం ఏమిటి? రాజకీయంతోనే సరిపెడతారా?
ఖమ్మం ఐదు గ్రామాల సమస్యకు పరిష్కారం ఏమిటి? రాజకీయంతోనే సరిపెడతారా?

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sayali Surve: సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
Revanth Reddy Soft Hindutva: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
Monsoon in India 2026: ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
First Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
Embed widget