అన్వేషించండి

Telangana Omicron: హయత్ నగర్ లో ఒమిక్రాన్ కేసు... తెలంగాణలో 25కు చేరిన కొత్త వేరియంట్ కేసులు

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ లో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25కు చేరింది.

తెలంగాణలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఇటీవల సూడాన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో అతడ్ని గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 25కి చేరింది. హయత్‌నగర్‌లో ఒమిక్రాన్‌ కేసు నమోదు అవ్వడంతో వైద్య, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తం అయ్యారు. బాధితుడు నివసిస్తున్న ప్రాంతంలో కోవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తి వ్యాక్సిన్‌ తీసుకోలేదని వైద్యాధికారిణి వెల్లడించారు. హయత్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో మొదటి ఒమిక్రాన్‌ కేసు నమోదు అయ్యిందని కార్పొరేటర్‌ కళ్లెం నవజీవన్‌రెడ్డి తెలిపారు. సూడాన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఒమిక్రాన్‌ సోకిందని వెల్లడించారు. ముందుజాగ్రత్తగా కాలనీ వాసులందరికీ కోవిడ్ ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

Telangana Omicron: హయత్ నగర్ లో ఒమిక్రాన్ కేసు... తెలంగాణలో 25కు చేరిన కొత్త వేరియంట్ కేసులు  

Also Read: ఈ ఏడాది డ్రంకన్ డ్రైవ్ కేసులే అత్యధికం... డ్రంకన్ డ్రైవ్ లో రూ.10.49 కోట్ల ఫైన్ వసూలు... నేరాల వివరాలు వెల్లడించిన సీపీ అంజనీ కుమార్

గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్

తెలంగాణలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు తగ్గక ముందే కొత్త వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 24 కేసులుంటే హయత్ నగర్ కేసుతో ఆ సంఖ్య 25కు చేరింది. తెలంగాణలో ఒమిక్రాన్ వైరస్ సోకిన వారిని టిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం అధిస్తున్నారు. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు ఏర్పాటు చేస్తుంది. గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్‌ జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వస్తే రోజుకు 48శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. 

Also Read: పీయూష్ గోయల్ వ్యాఖ్యలు దుర్మార్గం, క్షమాపణ చెప్పాల్సిందే.. మంత్రి హరీశ్ డిమాండ్

Also Read: కో అంటే కోట్లు.. కోకాపేట భూముల వేలానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

Also Read: Piyush Goyal: ఆ ధాన్యం ఇస్తే ఎంతైనా కొంటాం, గతంలోనే ఒప్పందం.. మాపై విమర్శలు సరికాదు: పీయూష్ గోయల్ 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
Revanth Master Plan: ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Diet for Weight Loss : ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
Embed widget