అన్వేషించండి

Harish Rao: పీయూష్ గోయల్ వ్యాఖ్యలు దుర్మార్గం, క్షమాపణ చెప్పాల్సిందే.. మంత్రి హరీశ్ డిమాండ్

తెలంగాణ ప్రజలకు పీయూష్ గోయల్ క్షమాప‌ణ చెప్పాల‌ని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తమ మంత్రుల‌ను అవ‌మానించే హ‌క్కు మీకు ఎక్కడిద‌ని ప్రశ్నించారు.

తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం కొనసాగుతోంది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై నేడు (డిసెంబరు 22) మంత్రి హరీశ్ రావు స్పందించారు. పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్యల‌పై మంత్రి హ‌రీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొంటారా లేదా అని సూటిగా అడుగుతుంటే.. డొంకతిరుగుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు.

తెలంగాణ ప్రజలకు పీయూష్ గోయల్ క్షమాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తమ మంత్రుల‌ను అవ‌మానించే హ‌క్కు మీకు ఎక్కడిద‌ని ప్రశ్నించారు. మంత్రుల‌ను క‌ల‌వ‌కుండా బీజేపీ నేత‌ల‌తో మాట్లాడ‌తారా అని నిలదీశారు. పీయూష్ వ్యాఖ్యలు రైతుల‌ను అవ‌మాన ప‌ర్చడ‌మేన‌ని అన్నారు. 

70 ల‌క్షల మంది రైతుల త‌ర‌పున మంత్రులు ఢిల్లీ వ‌చ్చార‌ని వారిని.. వారిని ఉద్దేశిస్తూ పని లేక వచ్చారని ఎద్దేవా చేస్తూ మాట్లాడడం సరికాదని అన్నారు. త‌న వ్యాఖ్యల‌ను పీయూష్ గోయ‌ల్ వెన‌క్కి తీసుకోవాల‌న్నారు. ఆయ‌న వ్యాఖ్యల‌పై బీజేపీ నేత‌లు ఏం చెప్తార‌ని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ రైతుల తరపున ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనాలని అడగడం తప్పా? మమ్మల్ని ఎద్దేవా చేస్తూ మాట్లాడతారా? ధాన్యం కొనాలనే ఉద్దేశం ఉంటే.. కొంటామని చెప్పాలి. చేతకాకపోతే కుదరదని చెప్పాలి. ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు. అంతేకానీ, మంత్రులను కించపరుస్తూ మాట్లాడడం ఏంటి?’’ అని హరీశ్ రావు వ్యాఖ్యలు చేశారు.

ఇంత దుర్మార్గమా..
ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే రాజకీయం చేస్తోందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడే హక్కు పీయూష్ గోయల్‌కు ఎక్కడిదని హరీశ్ రావు నిలదీశారు. ‘మీకు రాజకీయాలు ముఖ్యం కావొచ్చు.. కానీ మాకు మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమ’ని హరీష్ రావు తేల్చి చెప్పారు. తమ మంత్రులను కలవడానికి సమయం ఉండదు, కానీ బీజేపీ నేతలకు మాత్రం వెంటనే సమయం ఇస్తారా? అని నిలదీశారు. రాష్ట్రం నుండి అధికారుల బృందం వస్తే కలవకుండా రాజకీయం చేసింది మీరు కాదా అని పీయూష్ గోయల్ ను నిలదీశారు హరీష్ రావు.ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీకి వస్తారో అర్ధం చేసుకోవాలన్నారు.

Also Read: Piyush Goyal: ఆ ధాన్యం ఇస్తే ఎంతైనా కొంటాం, గతంలోనే ఒప్పందం.. మాపై విమర్శలు సరికాదు: పీయూష్ గోయల్ 

Also Read: TSRTC: తెలంగాణ ఆర్టీసీ గ్రేట్ ఆఫర్.. వంద టికెట్‌పై రూ.20 డిస్కౌంట్, వీరికి మాత్రమే..

Also Read: Consumer Court: సరకులు కొంటే క్యారీ బ్యాగ్ ఫ్రీ ఇవ్వాల్సిందే.. ఆ డీమార్ట్ లో మీ డబ్బులు తిరిగిచ్చేస్తారు వెళ్లండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget