అన్వేషించండి

Telangana Assembly: 'కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడం లేదు' - జల దోపిడీ అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ ప్రకటన

Telangana Assembly Session 2024: కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో సోమవారం తీర్మానం ప్రవేశపెట్టింది.

Telangana Assembly Session on KRMB Issue: కృష్ణా నదీ ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. కృష్ణా నదీ జలాల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదని జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 'గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో విఫలమైంది. కృష్ణా జలాలు తెలంగాణకు ప్రధాన ఆధారం. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు. ఉమ్మడి రాష్ట్రం కంటే ప్రత్యేక రాష్ట్రంలోనే ఎక్కువ అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో 1200 టీఎంసీలు డైవర్ట్ అయ్యాయి. ఇన్ ఫ్లో తగ్గి డైవర్షన్ పెరిగింది. కృష్ణా జలాలను అదనంగా ఏపీ ప్రభుత్వం తరలిస్తున్నా మౌనంగా ఉన్నారు. పాలమూరు - రంగారెడ్డికి రూ.27,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదు. 811 టీఎంసీల్లో కేవలం 299 టీఎంసీలే క్లెయిమ్ చేశారు. ఇప్పుడు 50 శాతం కావాలని అడుగుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ వైఎస్ హయాంలో 44 వేల క్యూసెక్కులను 2020లో ఏపీ సీఎం జగన్ 90 వేలకు పెంచారు. అయినా అప్పటి కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు.' అంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించారు. 

అంతకుముందు 'కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు' పేరుతో ప్రభుత్వం నోట్ విడుదల చేసింది. గతంలో కేసీఆర్ పాలనలో తప్పుడు విధానాలే.. ఇప్పుడు తెలంగాణ శాపాలయ్యాయని పేర్కొంది. గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జల దోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. 'ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ పైకి పోలీసులను పంపింది. రోజుకు 3 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయింది. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు. రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగేలా కొందరు మాట్లాడుతున్నారు.' అని విమర్శించారు.

'కేసీఆర్ ను జగన్ పొగిడారు'

నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ పాలకులది అసమర్థతో.. అవగాహన లోపమో అర్థం కావడం లేదని మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు గత ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఢిల్లీ వెళ్లి 512.299 టీఎసీలకు ఒప్పుకొన్నారు. ఆ కేటాయింపును ఏపీ ప్రభుత్వం శాశ్వతం చేస్తోంది. కృష్ణా జలాల్లో 70 శాతం హక్కులు పొందేందుకు తెలంగాణకు అర్హత ఉంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదు. ఏపీ సీఎం జగన్, కేసీఆర్ గంటల తరబడి మాట్లాడుకున్నారు. కలిసి బిర్యానీలు తిన్నారు. కేసీఆర్ గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారు. తెలంగాణ జలాలను సైతం ఇస్తున్నారు. 2020 మే 5న ఏపీ ప్రభుత్వం 203 జీవో ఇచ్చి రోజుకు 3 టీఎంసీల నీరు తరలించాలని నిర్ణయించింది. 797 అడుగుల వద్ద నీటి తరలింపు జీవో ఇచ్చింది. రాయలసీమ లిఫ్ట్ పూర్తైతే రోజుకు 8 టీఎంసీల నీటిని ఏపీ తరలిస్తోంది. ఆ లిఫ్ట్ టెండర్లు పూర్తయ్యాకే కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసి పరోక్షంగా సహకరించారు. కావాలనే ఆయన అపెక్స్ కౌన్సిల్ భేటీకి హాజరు కాలేదు. అప్పుడు సమావేశానికి వెళ్లి అభ్యంతరం తెలిపితే రాయలసీమ లిఫ్ట్ ఆగేది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 2013లోనే ప్రాజెక్ట్ పనులు మొదలైనా ఇప్పటికీ పూర్తి చేయలేదు. ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్, కేసీఆర్ క్షమాపణ చెప్పాలి' అని ఉత్తమ్ అన్నారు.

Also Read: KTR Tweet: బీఆర్ఎస్ ఒత్తిడితోనే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ తీర్మానం - ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తొలి విజయమంటూ కేటీఆర్ ట్వీట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress PCC chief controversy: జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న కోమటిరెడ్డి - తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం - మంత్రి క్లారిటీ
జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న కోమటిరెడ్డి - తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం - మంత్రి క్లారిటీ
Telangana Ugadi Gifts: ఉగాది కానుకలుగా మట్టి వంట పాత్రల కిట్ గిఫ్ట్ - మంత్రి పొన్నం వినూత్న ఆలోచన వైరల్
ఉగాది కానుకలుగా మట్టి వంట పాత్రల కిట్ గిఫ్ట్ - మంత్రి పొన్నం వినూత్న ఆలోచన వైరల్
Revanth Chit Chat: అందుకే పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ - ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
అందుకే పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ - ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Drug Racket: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్‌వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్‌వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress PCC chief controversy: జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న కోమటిరెడ్డి - తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం - మంత్రి క్లారిటీ
జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న కోమటిరెడ్డి - తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం - మంత్రి క్లారిటీ
Nara Rohith : పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
Iran War Updates: ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
Divyang Shakti Scheme: దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే దివ్యాంగశక్తి - ఉచిత బస్సు పథకం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే దివ్యాంగశక్తి - ఉచిత బస్సు పథకం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Sara Ali Khan Kedarnath : కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
Sreeleela : ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే? - రంగస్థలం మహేష్‌పై సీరియస్ లుక్... శ్రీలీల రియాక్షన్
ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే? - రంగస్థలం మహేష్‌పై సీరియస్ లుక్... శ్రీలీల రియాక్షన్
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
Top Petrol Scooters in India : ఎలక్ట్రిక్ యుగంలో పెట్రోల్‌ స్కూటర్లకు తగ్గని క్రేజ్‌- ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మోడల్స్ ఎన్ని? మీకు ఏ వాహనం సరిపోతుందో చూద్దాం!
ఎలక్ట్రిక్ యుగంలో పెట్రోల్‌ స్కూటర్లకు తగ్గని క్రేజ్‌- ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మోడల్స్ ఎన్ని? మీకు ఏ వాహనం సరిపోతుందో చూద్దాం!
Embed widget