అన్వేషించండి

Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana News: ఆదివారం అర్ధరాత్రి దాటాక రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 కొత్త పథకాలను ప్రారంభించారు.

Telangana CM Revanth Reddy Launched Four New Welfare Schemes: రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. నారాయణపూర్ జిల్లా (Narayanpur District) కోస్గి మండలం చంద్రవంచలో జరిగిన కార్యక్రమంలో కొత్త పథకాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ, ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభిస్తూ.. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మొత్తం 734 మందికి రైతు భరోసా చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ.11.80 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.

'అర్ధరాత్రి దాటాక డబ్బులు జమ'

సాగు ఖర్చులు పెరిగాయని.. రైతు భరోసా (Rythu Bharosa) నిధులు పెంచామని సీఎం రేవంత్ తెలిపారు. ఏడాదికి ఎకరాకు రూ.12 వేల చొప్పున ఇస్తున్నామని.. ఇవాళ ఆదివారం కాబట్టి, రైతు భరోసా డబ్బులు జమ కావని చెప్పారు. అర్ధరాత్రి 12 దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. 'అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్క సంతకంతో దేశమంతా రుణమాఫీ చేశారు. ఇప్పుడు ఒకే విడతలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం. ఇలా రుణమాఫీ చేసిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. దాదాపు 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లు వేశాం. భూమి లేని వారిని కూడా ఆదుకోవాలని గతంలో కూలీలు అడిగారు. భూమి లేని వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకువచ్చాం. ఈ పథకం కింద రూ.12 వేలు ఇస్తున్నాం.' అని వివరించారు.

'ప్రజల వద్దకు ప్రభుత్వం'

గతంలో ఏదైనా కావాలంటే, ఎవరైనా ఫామ్‌హౌస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు ప్రజల దగ్గరకే ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 'గ్రామాల్లో ప్రజల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటోంది. గడిచిన పదేళ్లలో పేదలకు ప్రభుత్వం ఇళ్లు రాలేదు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాం. పేదలు ఇల్లు నిర్మించుకుంటే రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నాం. రేషన్ కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తాం. గ్రామసభల ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాం. అధికారులను గ్రామాలకు పంపిస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది.' అని రేవంత్ పేర్కొన్నారు.

'మాటిస్తే వెనక్కి తగ్గం'

కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే.. ఎప్పటికీ వెనక్కి తగ్గదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 'పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలింది. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే.. ప్రజలను రెచ్చగొడుతున్నారు. మన ప్రజలకు ఉపాధి కోసం పరిశ్రమలు తేవాలని భావించాను. మాయమాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి పరిశ్రమలు అడ్డుకుంటున్నారు.' అని రేవంత్ పేర్కొన్నారు.

Also Read: Viral News: మహిళ ఇంటి ముందు బ్యాంక్ అధికారుల వినూత్న నిరసన, వంటావార్పుతో అంతా షాక్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

New Governor of Telangana: కొత్త గవర్నర్ అజర్ మంత్రిపదవి కాపాడతారా?
కొత్త గవర్నర్ అజర్ మంత్రిపదవి కాపాడతారా?
Minister Azharuddin : కొత్త గవర్నర్‌పైనే ఆధారపడి ఉన్న అజహర్ మంత్రి పదవి - ఎమ్మెల్సీ ఫైల్ క్లియర్ చేయకపోతే రాజీనామానే !
కొత్త గవర్నర్‌పైనే ఆధారపడి ఉన్న అజహర్ మంత్రి పదవి - ఎమ్మెల్సీ ఫైల్ క్లియర్ చేయకపోతే రాజీనామానే !
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Revanth Reddy Super Power: తెలంగాణ కాంగ్రెస్‌లో సూపర్ పవర్ రేవంత్ రెడ్డి - ఇక అసంతృప్త నేతలంతా దారికి రావాల్సిందేనా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సూపర్ పవర్ రేవంత్ రెడ్డి - ఇక అసంతృప్త నేతలంతా దారికి రావాల్సిందేనా?

వీడియోలు

Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Azharuddin : కొత్త గవర్నర్‌పైనే ఆధారపడి ఉన్న అజహర్ మంత్రి పదవి - ఎమ్మెల్సీ ఫైల్ క్లియర్ చేయకపోతే రాజీనామానే !
కొత్త గవర్నర్‌పైనే ఆధారపడి ఉన్న అజహర్ మంత్రి పదవి - ఎమ్మెల్సీ ఫైల్ క్లియర్ చేయకపోతే రాజీనామానే !
Tiger Rampachodavaram Agency: రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
Tamil Nadu Assembly Elections 2026 : ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Dhurandhar 2 Trailer : ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
Sampradayini Suppini Suddapoosani Review - 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
TTD News: ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం, రామతీర్థం గుట్టల్లో 3 వేల చెట్లు నాటేందుకు ప్రణాళిక!
ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం, రామతీర్థం గుట్టల్లో 3 వేల చెట్లు నాటేందుకు ప్రణాళిక!
Embed widget