అన్వేషించండి

CM Revanth Reddy: 'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్

Telangana News: రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దని యువతకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మంచిర్యాల జిల్లా సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులతో ఆయన సోమవారం ముచ్చటించారు.

CM Revanth Reddy Chit Chat With Students: రాష్ట్రంలో గత పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని.. ప్రజా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ప్రభుత్వ వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ (Prem Sagar) ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నివాసానికి తరలి వచ్చిన విద్యార్థులతో రేవంత్ ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సొంత హాస్టల్ భవనం నిర్మించాలని విద్యార్థులు కోరగా.. స్థల సేకరణ చేయించిన అనంతరం సొంత హాస్టల్ భవనం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 'ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం. త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. యువజన సంఘాలు బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించేలా చొరవ చూపాలి. స్కూల్స్, కాలేజీల్లో డ్రాపవుట్స్ తగ్గించాలి.' అని సీఎం పేర్కొన్నారు.

'వ్యసనాల బారిన పడొద్దు'

యువత విద్యను నిర్లక్ష్యం చేయొద్దని సీఎం రేవంత్ సూచించారు. గంజాయి, డ్రగ్స్ అన్నింటికంటే పెద్ద ప్రమాదకరమని.. అలాంటి వ్యసనాల బారిన పడొద్దని అన్నారు. 'విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కండి. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు. విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమే. చదువుకున్న వారు ప్రయోజకులవుతారు. పాఠశాలల్లో విద్యతో పాటు సామాజిక అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేయాలి. ఉన్నత చదువులు చదువుకుని.. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలి. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా కార్పొరేట్ విద్యను తలదన్నే రీతిలో విద్యను అందిస్తూ సౌకర్యాలు కల్పిస్తాం.' అని పేర్కొన్నారు.

కలెక్టర్లకు కీలక ఆదేశాలు

ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను జిల్లా కలెక్టర్లు వారానికోసారి సందర్శించి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలు వెలుగులోకి వస్తాయన్నారు. విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు సకాలంలోనే పంపిణీ చేశామని చెప్పారు. యూనిఫామ్స్ కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించి కుట్టు కూలీ పెంచినట్లు వెల్లడించారు. విద్యార్థులను స్వయంగా కలుసుకుని సమస్యలు ఆలకించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ప్రయోజకులై తెలంగాణ పురోగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును ఈ సందర్భంగా సీఎం రేవంత్ అభినందించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా దండేపల్లి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు మద్యం సేవించమని ప్రతిజ్ఞ చేశారు. పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్తూ.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ నడిచేలా వ్యవహరిస్తామని చెప్పారు. వీటన్నింటినీ అనుసరిస్తూ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ తన అనుచరులను మంచిమార్గంలో నడిపిస్తున్నందుకు సీఎం ఎమ్మెల్యేను అభినందించారు.

Also Read: TGSRTC Charges Hike: టికెట్ చార్జీల పెంపుపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు - టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Nandamuri Balakrishna: అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
Revanth Reddy Kishan Reddy Meet Ashwini Vaishnaw: అశ్విని వైష్ణవ్‌తో రేవంత్ , కిషన్ రెడ్డి భేటీ - మంగళవారం ఖట్టర్‌తో సమావేశం తర్వాత మెట్రోపై క్లారిటీ!
అశ్విని వైష్ణవ్‌తో రేవంత్ , కిషన్ రెడ్డి భేటీ - మంగళవారం ఖట్టర్‌తో సమావేశం తర్వాత మెట్రోపై క్లారిటీ!
Breaking News: ఢిల్లీలో కిషన్ రెడ్డితో పాటు వెళ్లి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీలో కిషన్ రెడ్డితో పాటు వెళ్లి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
Tungabhadra Dam New Gates Inauguration 2026: తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandamuri Balakrishna: అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
Tungabhadra Dam New Gates Inauguration 2026: తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
Duvvada Madhuri Kotturu Police Station: దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?
దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?
Revanth Reddy Delhi Tour: రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
AP Weather Update Rains: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
Keir Starmer Resigns UK PM 2026: బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
JD Vance: అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
Sreeleela : శ్రీలీలకు అవమానం జరిగిందా? - అసలు నిజం ఏంటో తెలుసా?
శ్రీలీలకు అవమానం జరిగిందా? - అసలు నిజం ఏంటో తెలుసా?
Embed widget