అన్వేషించండి

TGSRTC Charges Hike: టికెట్ చార్జీల పెంపుపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు - టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

TSRTC Charges Hike: దీపావళి పండుగ సమయంలో ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపుపై దుష్ప్రచారం జరుగుతోందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు.

TSRTC News | టీజీఎస్ఆర్టీసీ బ‌స్సు టికెట్ ధ‌ర‌లను పెంచింద‌ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ ప్ర‌చారంలో వాస్త‌వం లేదన్నారు. రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌లకు సాధార‌ణ చార్జీలే అమ‌ల్లో ఉన్నాయని, దీపావ‌ళి (Diwali 2024) సమయంలో తిరుగు ప్ర‌యాణ ర‌ద్దీలో ఏర్పాటు చేసిన స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్రమే ఛార్జీలు సవరించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అది కూడా రాష్ట్ర ప్ర‌భుత్వ జీవో ప్ర‌కారం పండుగ వేళ చార్జీల‌ను సంస్థ స‌వ‌రించినట్లు స్పష్టం చేశారు.

ప్ర‌ధాన పండుగులు, ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో ప్రజలకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఆర్టీసీ యాజ‌మాన్యం స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను నడుపుతోంది. తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఉండ‌క‌పోవ‌డంతో ఆ స్పెషల్ బ‌స్సులు (Special Buses) ఖాళీగా వెళ్తుంటాయి. ఆ స్పెష‌ల్ బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకోవాలని 2003లో జీవో నంబర్ 16న ప్ర‌భుత్వం జారీ చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పండుగ‌లు, ఇతర ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో ఆర్టీసీ న‌డిపే స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే 1.50 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల‌ను స‌వ‌రించుకునే వెసులుబాటు ఆర్టీసీకి ఇచ్చారు. గ‌త 21 ఏళ్లుగా అన‌వాయితీగా వ‌స్తోన్న ప్ర‌క్రియను తాజాగా దీపావళికి కొనసాగించిట్లు చెప్పారు.

దీపావ‌ళి స‌మ‌యంలో రెగ్యుల‌ర్ స‌ర్వీసుల ద్వారా ప్ర‌యాణికుల‌ను సొంతూళ్ల‌కు చేర్చ‌ాం. కానీ తిరుగు ప్ర‌యాణంలో క‌రీంన‌గ‌ర్, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ త‌దిత‌ర ప్రాంతాల నుంచి హైద‌రాబాద్‌ (Hyderabad)కి ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంది. ఈ క్రమంలో ఆది, సోమ‌వారాల్లో ప్రయాణికుల ర‌ద్దీకి అనుగుణంగా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌నుంచి హైద‌రాబాద్‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డిపాం. ఆదివారం నాడు క‌రీంన‌గ‌ర్ రీజియ‌న్ నుంచి 127, రంగారెడ్డి నుంచి 105, ఆదిలాబాద్ నుంచి 16, వ‌రంగ‌ల్ నుంచి 66 మొత్తంగా 360 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను హైద‌రాబాద్‌కు న‌డిపినట్లు ఆర్టీసీ తెలిపింది. సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు ఆయా ప్రాంతాల‌నుంచి మ‌రో 147 స‌ర్వీసుల‌ను ఏర్పాటు చేశామన్నారు.

Also Read: TGSRTC Special Buses: కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా

జీవో ప్రకారం ఛార్జీల సవరణ

ఈ స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే జీవో ప్ర‌కారం చార్జీల‌ను స‌వ‌రించాం. ఈ స్పెషల్ బ‌స్సులు మిన‌హా మిగ‌తా బ‌స్సుల్లో సాధార‌ణ చార్జీలే అమ‌ల్లో ఉన్నాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. స్పెష‌ల్ స‌ర్వీసుల్లో ప్ర‌భుత్వ జీవో ప్ర‌కారం టికెట్ ధ‌ర‌లను సవరించినట్లు ఆర్టీసీ యాజ‌మాన్యం మరోసారి స్ప‌ష్టం చేస్తుంది. సాధార‌ణ రోజుల్లో య‌థావిధిగా సాధారణ టికెట్ ధ‌ర‌లే ఉండగా.. స్పెష‌ల్ బస్సు స‌ర్వీసుల‌కు టికెట్ ధ‌ర‌లను సవరించడం ఆర్టీసీలో అనవాయితీగా వస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Telangana Mass Killing: పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
Telangana Mass Killing News: రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Embed widget