అన్వేషించండి

Telangana Politics: రైతు సంక్షేమంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు- ప్రెస్ క్లబ్ వద్దా ? అసెంబ్లీకే ఫిక్స్!

తు సంక్షేమంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చ సాగుతోంది. రైతు సంక్షేమంపై రెండు పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి.

రైతు సంక్షేమంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చ సాగుతోంది. రైతు సంక్షేమంపై రెండు పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. తమ ప్రభుత్వమే రైతుల బాగు కోసం పని చేసిందని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంటే, గత ప్రభుత్వం రైతులను వంచించిందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే, ఇవాళ చర్చకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌కు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌కు కేటీఆర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అసెంబ్లీలో చర్చకు రండంటూ సీఎల్పీ కార్యాలయానికి వెళ్లేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రైతు సంక్షేమం విషయంలో విప్లవాత్మక పంధా మాది - కేటీఆర్

తమ తొమ్మిదేళ్ల పాలనలో రైతుల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెబుతున్నారు. రైతు బంధు కింద ప్రతీ సీజన్‌లో రూ. 5 వేల పెట్టుబడి సాయం అందించిన చరిత్ర తమదే అన్నారు. రైతు బీమా కింద రూ. 5 లక్షల బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అందించడం, కోటి ఎకరాలకు కాళేశ్వరం ద్వారా సాగు నీరు కల్పన, మిషన్ కాకతీయ పథకాలు రైతుల కోసం పెట్టామని కేటీఆర్ కాంగ్రెస్ విమర్శలు తిప్పికొట్టేందుకు చెబుతున్నారు. తద్వారా తెలంగాణలో పంటల ఉత్పత్తి పెరిగిందని, రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నది బీఆర్ఎస్ నేతల వాదన. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టిందని ఆరోపిస్తున్నారు. రుణ మాఫీ హామీ నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా రైతు బంధు అందరికీ అందడం లేదని (గులాబీ పార్టీ) చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదన్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ చేస్తోంది.

రైతుల పేరుతో బీఆర్ఎస్ ప్రజా ధనం వృధా చేసిందంటున్న కాంగ్రెస్

రైతుల సంక్షేమం కోసం అంటూ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన బీఆర్ఎస్, అనవసర ఖర్చులు, అవినీతితో ప్రజాధనం వృధా చేశారన్నది కాంగ్రెస్ నేతల ప్రధాన ఆరోపణ. బీఆర్ఎస్ ఇచ్చిన రుణమాఫీని గులాబీ నేతలు ఘనంగా చెప్పుకుంటున్నా, చాలా మందికి రుణమాఫీ జరగలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన రైతు బంధు బడా భూస్వాములకే లబ్ధి చేకూర్చిందని, పేద రైతులకు ఉపయోగం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ధాన్యం కొనుగోలు జాప్యం, రైతు వ్యతిరేక పంధా వల్ల తెలంగాణలో మళ్లీ రైతుల ఆత్మహత్యలు పెరిగాయని కాంగ్రెస్ బీఆర్ఎస్ పై మాటల తూటాలు పేల్చుతోంది. తమ ప్రభుత్వం వచ్చాకే రైతులకు రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందుతోందని, పంటలకు మద్దతు ధర లభిస్తోందని, రైతు రుణాలు మాఫీ అయ్యాయని కాంగ్రెస్ చెప్పుకొస్తోంది.

ఈ క్రమంలోనే రైతు సంక్షేమంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది. దీనికి పరాకాష్ఠగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చకు రమ్మని సవాల్ విసిరితే, చర్చ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో పెట్టుకుందాం రండి అంటూ కేటీఆర్ ప్రతిసవాల్ విసిరారు. దీంతో రెండు పార్టీల మధ్య చర్చ తీవ్రస్థాయికి చేరింది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ప్లాన్ ప్రకారం అయోధ్య విరాళాల చోరీ
సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ప్లాన్ ప్రకారం అయోధ్య విరాళాల చోరీ
MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: 2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
Palnadu Road Accident: 2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం
WhatsApp Hacks:వాట్సాప్‌లో పంపిన ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? క్వాలిటీ పెంచే చిట్కాలు ఇవే! 
వాట్సాప్‌లో పంపిన ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? క్వాలిటీ పెంచే చిట్కాలు ఇవే! 
TDP Blacklisted MLAs List 2026: దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
Donald Trump Order: ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
Embed widget