అన్వేషించండి

KTR vs Revanth Reddy:ఎవరొస్తారో రండి తేల్చుకుందాం! భారీ కాన్వాయ్‌తో ప్రెస్ క్లబ్ వద్దకు కేటీఆర్, మరి కాంగ్రెస్ ?

Telangana News | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలపై చర్చించేందుకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

హైదరాబాద్: రైతుల సమస్యలపై బహిరంగ చర్చకు రావాలని  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్ నేపథ్యంలో బహిరంగ చర్చకు బయలుదేరేందుకు కేటీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. అటు నుంచి బీఆర్ఎస్ నేతలతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వెళ్లనున్నారు. బహిరంగ చర్చ కోసం కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొందరు 11గంటలకు ప్రెస్ క్లబ్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి పరస్పరం ఛాలెంజ్ ల దృష్ట్యా సోమాజీగూడ ప్లెస్ క్లబ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అసెంబ్లీలో చర్చకు రావాలన్న రేవంత్ రెడ్డి
రైతులకు తమ ప్రభుత్వం ఎంతో చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అంటున్నారు. రైతు భరోసా నగదు రైతుల ఖాతాల్లో వేసి వారికి పంట సాయం చేశామన్నారు. ఏడాది కాలంలోనే రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదే నని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ కాదు కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రావాలని.. ఏ విషయం అయినా చర్చకు సిద్ధమేనని మంత్రులు స్పష్టం చేశారు. అసెంబ్లీకి వస్తే ప్రత్యేక చర్చకు తాము సిద్ధమేనని, ఏ అంశంపై అయినా బదులిస్తామని కాంగ్రెస్ అంటోంది.


KTR vs Revanth Reddy:ఎవరొస్తారో రండి తేల్చుకుందాం! భారీ కాన్వాయ్‌తో ప్రెస్ క్లబ్ వద్దకు కేటీఆర్, మరి కాంగ్రెస్ ?

రేవంత్ రెడ్డి పారిపోయిండా..

సీఎం రేవంత్ రెడ్డి చర్చకు వచ్చే అవకాశం లేదని మీడియా చెప్పగా.. అంతే అంటారా పారిపోయిండా ఏంటి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికీ నాలుగైదుసార్లు బహిరంగంగా చర్చకు సిద్ధం అన్నారు. మైక్ కట్ చేయకుండా అసెంబ్లీలో మా వాయిస్ వినిపిస్తామని చెబితే చర్చ పెట్టరు. ఒకవేళ చర్చ మొదలుపెడితే నాలుగు సెకన్లు కూడా మైక్ ఇవ్వరు. కేసీఆర్ వస్తరా, కేటీఆర్ వస్తారా.. రైతు సంక్షేమంపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. రేవంత్ సవాల్ ను అదేరోజు స్వీకరించాను. నీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు. నేను చాలు అని చెప్పారు. అసెంబ్లీలో అయినా, ప్రెస్ క్లబ్, సెక్రటేరియట్, జూబ్లీహిల్స్ లో ఇంటికి రమ్మంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పాం. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పి మాట తప్పిన నేత రేవంత్ రెడ్డి. సొంత నియోజకవర్గంలో ఓటమి తరువాత వెంటనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి మాట తప్పిన వ్యక్తి. అందుకే మేం ప్రెస్ క్లబ్ లో హాల్ బుక్ చేసి పెట్టాం చర్చకు రమ్మని చెప్పాం. 

రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఛాలెంజ్ చేశారు కనుక చర్చకు వస్తారని భావించాం. రేవంత్ లేని పక్షంలో వ్యవసాయశాఖ పై మాట్లాడేందుకు బాధ్యత తీసుకుని ఏ మంత్రి వస్తారో రండి. రైతులకు బీఆర్ఎస్ ఏం చేసిందో, కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై లెక్కలతో సహా వివరిస్తాం. అసెంబ్లీలో చర్చకు ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే.. బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారు. అందుకే ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశాం’ అని కేటీఆర్ అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget