అన్వేషించండి

Nizamabad News: ఎల్లారెడ్డిలో ఆధిపత్య పోరు- కాంగ్రెస్ టికెట్‌ కోసం ముగ్గురు పోటీ

తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో జిల్లా పార్టీలోనూ అలాంటి సమస్యలే కనిపిస్తున్నాయి. నేతల మధ్య సఖ్యత లేని కారణంగా మరిన్ని ఇబ్బందుల్లోకి వెళ్లిపోతోంది.

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో వర్గ పోరు తీవ్రమైంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంపై కన్నేసిన మదన్ మోహన్ రావు, సుభాష్ రెడ్డి ఒకరితో మరొకరికి పొసగడం లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభతో వీరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఈ సభ వీళ్లిద్దరి బలప్రదర్శనకు వేదికగా మారింది.

కామారెడ్డి జిల్లా 4 అసెంబ్లీ నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. 2019వ సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మదన్ మోహన్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో స్పల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్న నాయకులు తన ఓటమికి కారణమని మదన్ మోహన్ రావులో అసంతృప్తి మొదలైంది. ఇంకొవైపు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన జాజుల సురేంధర్ టిఆర్ఏస్ లో చేరారు. దీంతో ఎంపీగా ఓటమిపాలైన మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు.

మదన్ మోహన్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు కావడంతో ఎర్రబెల్లి ఆశీస్సులు కూడా ఉన్నాయి. ప్రస్తుత టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్రెడ్డితో ఎర్రబెల్లితో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే బరిలో ఉండేందుకు మదన్ మోహన్ రావు ప్రిపేర్ అవుతున్నారు.

ఎల్లారెడ్డి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఆరు నెలలుగా ఈ ఇద్దరు నేతలు పోటాపోటీ కార్యక్రమాలు చేస్తుండటంతో వర్గపోరు స్టార్ట్ అయ్యింది.

ఫ్లెక్సీల రగడ 

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ సభ నాయకుల ఫ్లెక్సీల రగడ తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు సభ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీంతో ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకుడు సుభాష్‌రెడ్డి వర్గీయులు తొలగించారని మదన్ మోహన్ రావు వర్గీయులు ఆరోపించారు. ఇరువర్గాల కార్యకర్తలను టిపిసిసి నేత షబ్బీర్ అలీ సముదాయించారు. సభ అనంతరం మీటింగ్ లో ఫ్లెక్సీ వివాదాన్ని పరిష్కరిస్తామని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నాయకుల మధ్య తాత్కాలికంగా బ్రేక్ పడింది.

మాజీ ఎమ్మెల్యే సభకు దూరం 

మాజీ ఎంపీ బాలాగౌడ్ బంధువు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత బి. జనార్ధన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సభకు దూరంగా ఉన్నారు. వలస వచ్చిన నేతలతో కాంగ్రెస్ పార్టీ వర్గపోరుతో బజారున పడిందని మాజీ ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో బి.జనార్ధన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999,2009లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినా.... ప్రజాదరణ ఉన్న నేతగా ఆయన గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో మంచిపేరుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. టిడిపి నుంచి వచ్చిన సుభాష్ రెడ్డి, టిడిపి మాజీ మంత్రి అల్లుడు మదన్మోహన్ రావులు పార్టీలో చేరడంతో వర్గపోరు తారాస్థాయికి చేరిందని అభిప్రాయంతో దూరమవుతున్నారు. 2018లో పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ఆయన కృషి చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎల్లారెడ్డి టికెట్ ఆశించడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Asifabad News: ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
TRS Chief Kavitha Reaction : కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget