అన్వేషించండి

Basar IIIT: గవర్నర్‌ వద్దకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, సమస్యలపై ఫిర్యాదు

ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జూలైలో విద్యార్థులు ఏడు రోజులపాటు శాంతియుత నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పంచాయితీ గవర్నర్ తమిళసై వద్దకు వెళ్లింది. బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విద్యార్థులు గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వం దృష్టికి ఎన్ని సార్లు తమ సమస్యలను తీసుకెళ్లినా పెడచెవిన పెడుతోందని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ కు వివరించారు.

ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జూలైలో విద్యార్థులు ఏడు రోజులపాటు శాంతియుత నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఐటీలో కనీస మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి ఉంది. మరుగుదొడ్లు, మెస్, బెడ్స్ లేకపోవటం, ఫ్యాన్స్ కూడా లేని పరిస్థితి, శాశ్వత వీసీ నియామకం లేకపోవటం ఇలా 12 డిమాండ్లపై ట్రిపుల్ ఐటీ విద్యార్థులు 7 రోజుల పాటు నిద్రహారాలు మాని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో విద్యార్థి లోకం నిరసనలు చేపట్టింది. వీరికి విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు మద్దతు కూడా తెలిపారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులు పెట్టిన 12 డిమాండ్లను ఒప్పుకుని విడతల వారిగా అన్ని పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు. మంత్రి హామీ ఇచ్చినా ట్రిపుల్ ఐటీలో సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవలే బాసర ట్రిపుల్ ఐటీలో దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి ఆస్పత్రుల పాలయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మంత్రి వచ్చి వెళ్లినా ఏ మాత్రం మార్పు రాలేదని ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ తో ప్రాణాపాయ స్థితి నుంచి స్టూడెంట్స్ తప్పించుకున్నారు. అయినా మెస్ లో ఏ మాత్రం మార్పు రావటం లేదని విద్యార్థులు అంటున్నారు. ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి కూడా చనిపోయారన్న వార్తలు విద్యార్థి లోకాన్ని మరింత కలిచివేసింది. ఫుడ్ పాయిజన్ అయినా గాని మెస్ లలో అదే పరిస్థితి కొనసాగిస్తున్నారని.. తిరిగి కుళ్లిపోయిన పదార్థాలే పెడుతున్నారని విద్యార్థులు మరో దఫా ఆందోళనకు దిగారు.

రాత్రి భోజనం చేయకుండా తిరిగి ఉదయం అల్పహారం చేయకుండా మధ్యాహ్నం వరకూ విద్యార్థులు మరోసారి నిరసనకు దిగారు. అయితే అధికారులు విద్యార్థులను బెదిరింపులకు గురిచేశారన్న వార్తలు వచ్చాయి. నిరసనలో పాల్గొనే విద్యార్థులను డిస్మిస్ చేస్తామని అధికారులు ఒత్తిడి కూడా తెచ్చారని తెలుస్తోంది. విద్యార్థులు తల్లిదండ్రులు సైతం హైదరాబాద్ లో సబిత ఇంద్రారెడ్డి ఇంటి వద్ద కూడా బాసర ట్రిపుల్ ఐటీ లో నెలకొన్న సమస్యలపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వం హామీలను నెరవేరుస్తామని చెప్పినా ఆచరణలో లేవని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా పట్టించుికోవటం లేదని చివరికి రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలిసేందుకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు డిసైడ్ అయ్యారు. బుధవారం ట్రిపుల్ ఐటీకి చెందిన పది మంది విద్యార్థుల బృందం గవర్నర్ వద్దకు వెళ్లారు. ప్రభుత్వం ఎలాగూ తమ సమస్యలు పట్టించుకోవటం లేదు కనీసం ఛాన్సలర్ వద్దకైనా వెళ్లి తమగోడు వెళ్లబోసుకుందామని డిసైడ్ అయ్యారు స్టూడెంట్స్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News:తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
Andhra Pradesh Latest News: మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
Bhu Bharathi Portal Telangana: భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
Layoff Threat: 40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్-  మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్- మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Axar Patel Kuldeep Yadav vs RR | IPL 2025 లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షర్, కుల్దీప్DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RRMitchell Starc vs Yashasvi Jaiswal | IPL 2025 లో కొనసాగుతున్న స్టార్క్ వర్సెస్ జైశ్వాల్DC vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై సూపర్ ఓవర్ లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News:తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
Andhra Pradesh Latest News: మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
Bhu Bharathi Portal Telangana: భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
Layoff Threat: 40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్-  మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్- మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు  ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
DC vs RR Super Over: ఐపీఎల్‌ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయి? ఎక్కువ ఎవరు ఆడారు?
ఐపీఎల్‌ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయి? ఎక్కువ ఎవరు ఆడారు?
Murshidabad Violence: ముర్షిదాబాద్‌లో ఏం జరుగుతోంది? వక్ఫ్ ఘర్షణలపై మమత రియాక్షన్ ఏంటీ?
ముర్షిదాబాద్‌లో ఏం జరుగుతోంది? వక్ఫ్ ఘర్షణలపై మమత రియాక్షన్ ఏంటీ?
Citadel Season 2 Web Series: సమంత ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ - 'సిటడెల్: హనీ - బన్నీ' సిరీస్ సీజన్ 2 రద్దు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో
సమంత ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ - 'సిటడెల్: హనీ - బన్నీ' సిరీస్ సీజన్ 2 రద్దు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో
Embed widget