అన్వేషించండి

Basar IIIT: గవర్నర్‌ వద్దకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, సమస్యలపై ఫిర్యాదు

ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జూలైలో విద్యార్థులు ఏడు రోజులపాటు శాంతియుత నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పంచాయితీ గవర్నర్ తమిళసై వద్దకు వెళ్లింది. బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విద్యార్థులు గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వం దృష్టికి ఎన్ని సార్లు తమ సమస్యలను తీసుకెళ్లినా పెడచెవిన పెడుతోందని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ కు వివరించారు.

ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జూలైలో విద్యార్థులు ఏడు రోజులపాటు శాంతియుత నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఐటీలో కనీస మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి ఉంది. మరుగుదొడ్లు, మెస్, బెడ్స్ లేకపోవటం, ఫ్యాన్స్ కూడా లేని పరిస్థితి, శాశ్వత వీసీ నియామకం లేకపోవటం ఇలా 12 డిమాండ్లపై ట్రిపుల్ ఐటీ విద్యార్థులు 7 రోజుల పాటు నిద్రహారాలు మాని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో విద్యార్థి లోకం నిరసనలు చేపట్టింది. వీరికి విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు మద్దతు కూడా తెలిపారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులు పెట్టిన 12 డిమాండ్లను ఒప్పుకుని విడతల వారిగా అన్ని పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు. మంత్రి హామీ ఇచ్చినా ట్రిపుల్ ఐటీలో సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవలే బాసర ట్రిపుల్ ఐటీలో దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి ఆస్పత్రుల పాలయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మంత్రి వచ్చి వెళ్లినా ఏ మాత్రం మార్పు రాలేదని ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ తో ప్రాణాపాయ స్థితి నుంచి స్టూడెంట్స్ తప్పించుకున్నారు. అయినా మెస్ లో ఏ మాత్రం మార్పు రావటం లేదని విద్యార్థులు అంటున్నారు. ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి కూడా చనిపోయారన్న వార్తలు విద్యార్థి లోకాన్ని మరింత కలిచివేసింది. ఫుడ్ పాయిజన్ అయినా గాని మెస్ లలో అదే పరిస్థితి కొనసాగిస్తున్నారని.. తిరిగి కుళ్లిపోయిన పదార్థాలే పెడుతున్నారని విద్యార్థులు మరో దఫా ఆందోళనకు దిగారు.

రాత్రి భోజనం చేయకుండా తిరిగి ఉదయం అల్పహారం చేయకుండా మధ్యాహ్నం వరకూ విద్యార్థులు మరోసారి నిరసనకు దిగారు. అయితే అధికారులు విద్యార్థులను బెదిరింపులకు గురిచేశారన్న వార్తలు వచ్చాయి. నిరసనలో పాల్గొనే విద్యార్థులను డిస్మిస్ చేస్తామని అధికారులు ఒత్తిడి కూడా తెచ్చారని తెలుస్తోంది. విద్యార్థులు తల్లిదండ్రులు సైతం హైదరాబాద్ లో సబిత ఇంద్రారెడ్డి ఇంటి వద్ద కూడా బాసర ట్రిపుల్ ఐటీ లో నెలకొన్న సమస్యలపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వం హామీలను నెరవేరుస్తామని చెప్పినా ఆచరణలో లేవని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా పట్టించుికోవటం లేదని చివరికి రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలిసేందుకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు డిసైడ్ అయ్యారు. బుధవారం ట్రిపుల్ ఐటీకి చెందిన పది మంది విద్యార్థుల బృందం గవర్నర్ వద్దకు వెళ్లారు. ప్రభుత్వం ఎలాగూ తమ సమస్యలు పట్టించుకోవటం లేదు కనీసం ఛాన్సలర్ వద్దకైనా వెళ్లి తమగోడు వెళ్లబోసుకుందామని డిసైడ్ అయ్యారు స్టూడెంట్స్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
The Raja Saab Release Trailer : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
Embed widget