అన్వేషించండి

Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ ఇష్యూలో గవర్నర్ ఎంట్రీ, రేపు విద్యార్థులతో భేటీ!

Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ ఇష్యూ గవర్నర్ వద్దకు చేరింది. ఇటీవల గవర్నర్ ను కలిసిన విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు. దీంతో గవర్నర్ తమిళి సై ట్రిపుల్ ఐటీలో పర్యటించేందుకు నిర్ణయించుకున్నారు.

Basara IIIT : నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ వరస వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ట్రిపుల్ ఐటీలో సౌకర్యాలు సరిగ్గా లేవని విద్యార్థులు ఆందోళనతో మొదలైన తంతు నేటికీ ఏదో రూపంలో నడుస్తోంది. ఇటీవల మెస్ లలో ఫుడ్ పాయిజన్ అయి 300 పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మెస్ నిర్వాహకుల తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చివరకి మంత్రి కలుగజేసుకున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యా్ర్థుల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకునేందుకు గవర్నర్ తమిళి సై ట్రిపుల్ ఐటీలో పర్యటించనున్నారు. 

ట్రిపుల్ ఐటీకి గవర్నర్ 

ప్రభుత్వం తమ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అందుకోసం వారంపాటు ఆందోళనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో భేటీ కానున్నారు. గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్ శనివారం రాత్రి రైలులో బాసర బయలుదేరనున్నారు. బాసర చేరుకున్న తర్వాత ముందుగా సరస్వతీ దేవీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం గవర్నర్ తమిళి సై బాసర ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌కు వెళ్తారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో గవర్నర్ భేటీ అవుతారు. విద్యార్థుల సమస్యలను  స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. గవర్నర్‌ తమిళి సై రేపు రాత్రి బాసరలోనే బస చేయనున్నారు. 

గవర్నర్ వద్దకు విద్యార్థులు 

బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలకు నిలయంగా మారింది. కుళ్లిన గుడ్లు, పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెస్ నిర్వాహకులను మార్చాలని కోరుతున్నారు. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ తమిళి సై ను కలిశారు. బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తమ సమస్యలను తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ కు వివరించారు. దీంతో విద్యార్థుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు గవర్నర్ బాసర ట్రిపుల్ ఐటీలో పర్యటించున్నారు. 

వివాదాల సుడిగుండంలో బాసర ట్రిపుల్ ఐటీ

బాసర ట్రిపుల్ ఐటీలో రోజుకో వివాదం వెలుగు చూస్తోంది. ఏదో వివాదంతో నిత్యం వార్తల్లోకి ఉండటం బాసర ట్రిపుల్ ఐటీకీ కామన్ అయిపోయింది. తాజాగా ట్రిపుల్ ఐటీ మెస్‌లోని సిబ్బంది అక్కడే స్నానం చేస్తున్న తీరును విద్యార్థులు వెలుగులోకి తెచ్చారు. ఓవైపు వంట చేస్తుండగా మరోవైపు సిబ్బంది స్నానం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను విద్యార్థులు సెల్‌ఫోన్‌లో షూట్ చేశారు. వంట పక్కనే ఇంత నిర్లక్ష్యంగా స్నానాలు చేస్తుండటాన్ని విద్యార్థులు తప్పుబట్టారు. కనీస శుభ్రత పాటించటం లేదని వాపోతున్నారు. ఇటీవలి కాలంలో ఫుడ్ పాయిజన్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నిన్నటికి నిన్న విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా సిబ్బంది మెస్‌లోనే ఇలా స్నానాలు చేయటంపై విద్యార్ఖులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పైకి చెబుతునారే తప్ప లోపల మరోలా ఉందని విద్యార్థులు మండిపడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య- మృతదేహం రికవరీ చేసుకున్న పోలీసులు 
ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య- మృతదేహం రికవరీ చేసుకున్న పోలీసులు 
TG TET 2026 Results: తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
Supreme Court: పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
Special Intensive Revision Voters Telangana: పాతబస్తీలో ఓట్ల గల్లంతు గండం - SIRతో ఓవైసీ ఆందోళన - సగం ఓటర్లు తగ్గిపోతారా?
పాతబస్తీలో ఓట్ల గల్లంతు గండం - SIRతో ఓవైసీ ఆందోళన - సగం ఓటర్లు తగ్గిపోతారా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ ఆరోపణలు
187km రేంజ్‌తో కొత్త Vida VX2 Plus లాంచ్‌ - ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే!
సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 190km జర్నీ- భారీ బ్యాటరీతో Vida VX2 Plus లాంచ్‌, తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Embed widget