అన్వేషించండి

Revant Reddy : టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాల వల్లే తెలంగాణకు నష్టం .. ప్రజల కోసం ఎంత వరకైనా పోరాడతామన్న రేవంత్ రెడ్డి !

టీఆర్ఎస్, బీజేపీ కుట్ర రాజకీయాల వల్లే ప్రజలకు కష్టాలు వచ్చాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. కలిసి పరిష్కరించే అవకాశం ఉన్నా.. కావాలనే సమస్యలు సాగదీస్తున్నారని విమర్శించారు.


రైతుల సమస్యల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్య పరిష్కారం చేయకపోగా ఒకరికొకరు రాజకీయ ప్రయోజనం కోసం కొనుగోలు సమస్య ను పక్కదారి పట్టించారని రైతులను గాలికొదిలేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతుల ను పరమర్శించలేదని..ఆ కుటుంబలను ఆదు కోవడానికి కేంద్ర ప్రభుత్వం నుండి  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని గతంలో ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చిందని..126 జీవో ద్వార ఉద్యోగాల భర్తీ ,బదిలీలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో ను తెచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. బండి ,గుండు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ జీవో రద్దు చేయవచ్చు..కానీ మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ జీవో రద్దు చేస్తామని రాజకీయ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ చర్యల వెనుక మోదీ, కేసీఆర్ ఉన్నారని.. ఈ సమస్యలు అన్ని పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. 

Also Read: Anvesh Reddy: పసుపు రైతులకు మద్దతు ధర రావటం లేదు.. పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఎన్నికల్లో అరవింద్ గెలిచాడు

జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నుండి దాదాపు 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం పై సంపూర్ణ విశ్వాసం తో పార్టీలో చేరారన్నారు. పార్టీలో చేరిన వారంతా గతంలో  ఎర్రబెల్లి విజయం కోసం పని చేశారని.. గెలిచిన తర్వాత అభివృద్ధి పై ఏ మాత్రం దృష్టి సారించకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్ ల పై మంత్రి ఎర్రబెల్లి కేసీఆర్ పై ఒత్తిడి తేకపోవడం వల్ల విసిగిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి 

Also Read: Dasari Arun Kumar: దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదు... మద్యం మత్తులో కారుతో బీభత్సం


పంచ భూతాలను దోచుకుంటున్న అణచివేతలకు పాల్పడుతున్న కేసీఆర్ పాలనపై సామాజిక న్యాయం కోసం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉధృతమైన పోరాటం చేస్తున్నామని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సీనియర్ అధికార ప్రతినిధులు బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ లు అన్నారు.  కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సామాజిక న్యాయం కోసం ఇప్పటికే తెలంగాణ లో దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమాలను చేపట్టామని దళిత, గిరిజనుల్లో ఆత్మ గౌరవాన్ని పెంపొందించేందుకు కాంగ్రెస్ కృషి చేసిందని అన్నారు. అభివృద్ధి పేరిట నీళ్లు, భూమి, విద్యుత్ తదితర అంశాలలో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారని అడ్డగోలుగా లక్షల కోట్లు దోచుకున్న నిధులతో తీవ్రమైన అణచివేతలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

Also Read: Jagityala Crime: జగిత్యాలలో దారుణం... మంత్రాల నెపంతో ముగ్గురి దారుణ హత్య..!

పోలీసులను ప్రజల శాంతి భద్రతల కోసం కాకుండా ప్రజా పోరాటాలు చేసే సంస్థలపైన, ప్రతిపక్ష రాజకీయ పార్టీలపైన ఉపయోగించి రాజకీయ అరచకానికి పాల్పడుతున్నారని అన్నారు.దోపిడి, అణచివేతలపై కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని,  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ వచ్చిన తెలంగాణ లో సామాజిక న్యాయాన్ని సాధించి, ప్రజా తెలంగాణ నిర్మాణం అయ్యే వరకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోరాటం సాగిస్తున్నామని ప్రకటించారు. అంబేద్కర్ విగ్రహం విషయంలో కేసీఆర్ తీరును విమర్శిస్తూ మాజీ ఎంపీ వీహెచ్ లేఖ రాశారు. 

Also Read: Home Isolation Medicines: హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు వాడాల్సిన మందుల లిస్టు ఇదే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

టాప్ హెడ్ లైన్స్

22A Land Declaration: 222A నిషేధిత భూమిగా ఎలా ప్రకటిస్తారు.. నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
22A నిషేధిత భూమిగా ఎలా ప్రకటిస్తారు.. నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
Enquiry On Erravalli Farmhouse: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. 30 రోజులు డెడ్‌లైన్
కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. 30 రోజులు డెడ్‌లైన్
CM Revanth Reddy: ధరణి పేరుతో బీఆర్ఎస్ భారీ కుట్ర.. విదేశాల్లోని మాఫియా చేతికి భూముల వివరాలు: సీఎం రేవంత్
ధరణి పేరుతో బీఆర్ఎస్ భారీ కుట్ర.. విదేశాల్లోని మాఫియా చేతికి భూముల వివరాలు: సీఎం రేవంత్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget