అన్వేషించండి

Revanth Reddy: 2029లో మళ్లీ తొక్కకపోతే చూడు! అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి సవాల్!

గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నెత్తిన కాలు పెట్టి తొక్కి అధికారంలోకి వచ్చానని 2029లో కూడా మళ్లూ చూసుకుందామని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మళ్లీ తొక్కకపోతే చూడండి అంటూ బీఆర్‌ఎస్‌కు వార్నింగ్ ఇచ్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Revanth Reddy: తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ సమరశంఖం పూరించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు. 2029 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని రాజకీయంగా తొక్కబోతున్నానని సవాల్ చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి రాజకీయ హెచ్చరికలు, అభివృద్ధి విజన్, గత ప్రభుత్వ వైఫల్యాల చిట్టాను సభ ముందు ఉంచారు. 

నెత్తిపై కాలు పెట్టి తొక్కే వచ్చాను, 2029లో తొక్కబోతున్నాను: రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పొలిటికల్ హిస్టరీని గుర్తు చేసుకున్నారు. తాను వారసత్వంగానో లేదా ఎవరో పెట్టిన భిక్షతోనే ముఖ్యమంత్రి స్థాయికి రాలేదని అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నెత్తిన కాలు పెట్టి తొక్కి అధికారంలోకి వచ్చానని 2029లో కూడా మళ్లూ చూసుకుందామని సవాల్ చేశారు. మళ్లీ తొక్కకపోతే చూడండి అంటూ బీఆర్‌ఎస్‌కు సవాల్ చేశారు. 

"సభకు రాకపోవడంపై చర్చ జరగాలి"

ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గత 15 నెలలుగా సభకు రాకుండానే కేసీఆర్ రూ. 1.06 కోట్ల జీతభత్యాలు తీసుకున్నారని, దీనిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. "తండ్రి బతికి ఉండగానే తద్దినం పెట్టడం అంటే కేటీఆర్, హరీష్ రావుల తీరును చూస్తే అర్థమవుతోంది" ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికి  వీళ్లే ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికైనా కేసీఆర్ సభకు వచ్చి సలహాలు ఇవ్వాలని కోరారు. 

ముఖ్యమంత్రి విజన్ ఇదే 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. రాష్ట్ర భవిష్యత్తుపై ఉన్న స్పష్టమైన విజన్‌ను సభకు వివరించారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్లు,  2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే పాలన సాగిస్తున్నట్టు వెల్లడించారు. అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగం అక్షరాలు కావని అది తెలంగాణ అభివృద్ధికి దిక్సూచి అని కొనియాడారు. 

పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన 2014లో కేవలం రూ. 69 వేల కోట్లు అప్పులు ఉండేవని తాము అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ నాటికి రూ. 6,71,757 కోట్లకు చేరిందని గుర్తు చేశారు. మిగతా బకాయిలు కలుపుకుంటే ఆ మొత్తం రూ. 8.11 లక్షల కోట్లు అయ్యిందని, ఆ భారాన్ని తమ ప్రభుత్వం మోస్తోందని వివరించారు

అప్పులపై వివరణ 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చన తర్వాత కేవలం 17 వేల కోట్ల రూపాయల నికర అప్పు మాత్రమే చేశామని వెల్లడించారు. గత అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ఎక్కువ ఖర్చు అవుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హెల్ప్‌తో వడ్డీ భారాన్ని తగ్గించుకున్నామని పేర్కొన్నారు. దీనికి కేంద్రానికి కూడా రేవంత్ రెడ్డి థాంక్స్ చెప్పారు.  

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేశామని రేవంత్ వివరించారు. ఎలాంటి లీకేజీలు, ఇతర ఇబ్బందులు లేకుండా 80 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. గత పాలకులు లీకేజీలతో ప్రభుత్వ వ్యవస్థలపైనే అపనమ్మకాన్ని కలిగించారని మండిపడ్డారు.  

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత , మూసీ పునరుజ్జీవనంపై ప్రతిపక్షాల విమర్శలను రేవంత్ రెడ్డి డైరెక్ట్‌గా ఎటాక్ చేశారు. హైదరాబాద్‌లో ఉన్న అక్రమ కట్టడాలు కూల్చి వేయాలని గతంలో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడిన వీడియోలను సభలో చూపించారు. వాళ్లు చేస్తే సక్రమం తాము చేస్తే అక్రమమా అని ప్రశ్నించారు. మూసీ కాలుష్యం కంటే కొందరి కడుపుల్లోనే విషయం ఎక్కువ ఉందని ఎద్దేవా చేశారు. సబర్మతీ నదీ ప్రక్షాళనను పరిశీలించడానికి ఎమ్మెల్యేలతో నిజనిర్దారణ కమిటీ వేస్తామని రేవంత్ ప్రకటించారు.  

హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో శంషాబాద్ విమానాశ్రయం దగ్గర్లో 500-600 ఎకరాల్లో బుల్లెట్ రైలు హబ్ ఏర్పాటు చేయబోతున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది ఏర్పాటు అయితే బెంగళూరు, చెన్నై, పుణె వంటి నగరాలకు 2-3 గంటల్లోనే చేరుకోవచ్చని చెప్పారు. రూ. 25 వేల కోట్ల మెట్రో విస్తరణ పనులను రూ. 15 వేల కోట్లకే పూర్తి చేసేలా ప్లాన్‌ రెడీ చేసినట్టు తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి ఏప్రిల్ తర్వాత అనుమతులు వస్తాయన్నారు. కొంగరకలాన్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టడానికి నిర్ణయించినట్లు వెల్లడించారు.

Frequently Asked Questions

2029 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు?

2029 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని రాజకీయంగా తొక్కబోతున్నానని, గతంలో నెత్తిన కాలు పెట్టి తొక్కి అధికారంలోకి వచ్చానని సవాల్ చేశారు.

ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై ముఖ్యమంత్రి ఏమన్నారు?

గత 15 నెలలుగా సభకు రాకుండానే కేసీఆర్ రూ. 1.06 కోట్ల జీతభత్యాలు తీసుకున్నారని, దీనిపై చర్చ జరగాలని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్ర భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ ఏమిటి?

2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీసిందని ముఖ్యమంత్రి ఆరోపించారు?

2014లో రూ. 69 వేల కోట్లు ఉన్న అప్పులు, 2023 డిసెంబర్ నాటికి రూ. 6,71,757 కోట్లకు పెరిగాయని, ఇది ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు.

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతపై ముఖ్యమంత్రి ఏమన్నారు?

గతంలో కేసీఆర్, కేటీఆర్ కూడా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని మాట్లాడిన వీడియోలను చూపించి, వారు చేస్తే సక్రమం తాము చేస్తే అక్రమమా అని ప్రశ్నించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
Advertisement

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Embed widget