Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు - త్వరలోనే మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం
Chiranjeevi New Porject : మెగాస్టార్ చిరంజీవి మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉగాది సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన భవిష్యత్ ప్రణాళిక వివరించారు.

Chiranjeevi Plans Free Education To Poor Kids : మెగాస్టార్ చిరంజీవి... కేవలం నటుడిగా మాత్రమే కాకుండా సామాజిక సేవలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు. చిరంజీవి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్తో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా మరో కొత్త సేవా కార్యక్రమం కోసం ప్లాన్ చేస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ సూర్య స్ఫూర్తితో...
ఉగాది పండుగ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మెగాస్టార్... భవిష్యత్తులో నిరుపేద పిల్లలకు ఉచిత విద్య అందించడమే తన లక్ష్యమని వెల్లడించారు. 'తమిళనాడులో హీరో సూర్య నన్ను స్ఫూర్తిగా తీసుకుని అగరం ఫౌండేషన్ స్థాపించినట్లు ఎన్నోసార్లు చెప్పారు. ఆ సంస్థ ద్వారా ఎంతో మందికి ఉచిత విద్య అందించారు. ఇలా ఆయన చేస్తున్న విద్యా దానం నన్ను మోటివేట్ చేసింది. ఒకప్పుడు ఆయన నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు.
కానీ ఇప్పుడు నేను ఆయన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నా. నిరుపేద చిన్నారులకు ఉచిత విద్య అందించడమే నా భవిష్యత్ ప్రణాళిక. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందితే ఆ కుటుంబమే బాగుపడుతుంది. ఆ దిశగా ఆలోచన చేస్తున్నా. సమయానికి రక్తం దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసి ఆనాడు బ్లడ్ బ్యాంక్ స్థాపించా. అక్కడితో ఆగిపోకుండా ఇంకా సేవ చేయాలనుంది. ఇప్పుడు విద్యను అందిచడమే లక్ష్యంగా పెట్టుకున్నా.' అని చెప్పారు.
Also Read : ఓటీటీలోకి సుప్రీత హారర్ థ్రిల్లర్ అమరావతికి అహ్వానం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఫ్యాన్స్ ప్రశంసలు
చిరంజీవి నిర్ణయంపై మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ముందుంటారని... పేద పిల్లలకు ఉచిత విద్య అందించడం ద్వారా మరింత మందికి ఉన్నత విద్య చేరువవుతుందని అంటున్నారు. ఆయన ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.
























