అన్వేషించండి

Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి, నాన్ లోకల్స్ నియోజకవర్గంలో ఉంటే చర్యలు- సీఈవో వికాస్ రాజ్

Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు.

Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నికపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. రేపు(మంగళవారం) సాయంత్రం ఆరు గంటల తరువాత నాన్ లోకల్స్ ఎవరు నియోజకవర్గంలో ఉండకూడదని తెలిపారు. మునుగోడులో  అణువణువూ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. నాన్ లోకల్ వాళ్లు మునుగోడులో ఎవరు ఉన్న చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించామని, ఎవరైనా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ కు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు మునుగోడు లో ప్రచారం ముగుస్తోందని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. 

298 పోలింగ్ కేంద్రాలు 

"మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. కొత్త డిజైన్ తో కూడిన ఓటర్ ఐడీ ఇచ్చాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేశాం. ఫ్లైయింగ్ స్కాడ్ తో కలిసి మొత్తంగా యాభై టీంలు ఉన్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
3366 పోలింగ్ సిబ్బందిని , 15 బలగాల సిబ్బంది మునుగోడులో వినియోగిస్తున్నాం. ఎక్కువగా డబ్బు పట్టుబడటంతో ఇన్ కం ట్యాక్స్ అధికారులను ఆదేశించాం. 111 బెల్ట్ షాపులను సీజ్ చేశాం. 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం."- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ 

రూ.6.80 కోట్ల నగదు స్వాధీనం 

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో 185 కేసులు, 6.80 కోట్ల నగదు, 4500 లీటర్ల లిక్కర్ పట్టుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి వివరణ కాసేపటి క్రితమే అందిందన్నారు. దీనిపై ఈసీ నివేదిక పంపామని తెలిపారు. రిటర్నింగ్ అధికారిపై సీఈఓ కార్యాలయం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఓటర్ల స్లిప్పులు కూడా అందరికీ పంపించామని తెలిపారు. ఒకటి రెండు శాతమే పెండింగ్ లో ఉన్నాయన్న ఎన్నికల ప్రధాన అధికారి... ఓటర్ స్లిప్పులను ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు అన్నారు. 100 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఉందన్నారు. పోలింగ్ నిర్వహించే వారికి ట్రైనింగ్ ఇచ్చాం. మొద్దం 1190 పోలింగ్ సిబ్బంది రిక్వైర్మెంట్ ఉందన్నారు. మరో మూడు వందల మందిని రిజర్వ్ లో పెట్టామన్నారు. 

ఓటర్ ఐడీ తప్పనిసరి 

"ప్రచారానికి బయటి నుంచి వచ్చిన వాళ్లు ఎవరైనా రేపు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఉండకూడదు. ఎవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం. కల్యాణ మండపాలు, హోటళ్లు, ఇతర ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించమని చెప్పాం. నియోజకవర్గ వ్యాప్తంగా చెక్ పోస్టులు పెట్టాం. అనవసరమైన మూవ్మెంట్ ఉండకూడదు. ఎవరైనా నియోజకవర్గంలో ప్రయాణించాలంటే ఓటర్ ఐడీ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ కు ఆదేశాలు ఇచ్చాం. ఎన్నికల ప్రచారం కోసం ఎలాంటి సందేశాలు పంపవద్దని చెప్పాం. మొత్తం 479 ఫిర్యాదులు అందాయి. దాని మీద యాక్షన్ తీసుకున్నాం. ప్రశాంతం ఉపఎన్నిక జరగాలని కోరుతున్నాం."- వికాస్ రాజ్ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మే 28న జరగాల్సిన CUET యూజీ ఎగ్జామ్ వాయిదా
మే 28న జరగాల్సిన CUET యూజీ ఎగ్జామ్ వాయిదా
Hyderabad Crime News: హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
Rice Procurement Centres Telangana Delay: తెలంగాణలో వరి యుద్ధం- అన్నదాతల కన్నీళ్లు తుడుస్తారా? లేక రాజకీయాలే మిగులుతాయా?
తెలంగాణలో వరి యుద్ధం- అన్నదాతల కన్నీళ్లు తుడుస్తారా? లేక రాజకీయాలే మిగులుతాయా?
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!

వీడియోలు

RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Will Jacks Fielding in RR vs MI IPL 2026 | గాల్లో తేలుతూ విల్ జాక్స్ ఫీల్డింగ్
David Warner Blocked by SRH ? | డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన SRH?
IPL 2026 RCB vs GT Qualifier | SRH ఫ్యాన్స్ ను భయపడుతున్న ప్లేఆఫ్స్ సెంటిమెంట్
Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IDFC First Bank Case: రూ. 504 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా.. CBI తొలి ఛార్జిషీటు దాఖలు, 15 మంది పేర్లు ప్రస్తావన
రూ. 504 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా.. CBI తొలి ఛార్జిషీటు దాఖలు, 15 మంది పేర్లు ప్రస్తావన
Union Cabinet Expansion 2026: కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
Hyderabad Crime News: హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
This Week Theatrical Releases : మంత్ ఎండ్ థియేటర్లలో చిన్న సినిమాలు - పెద్ది ముందు పెద్ద సాహసమే...
మంత్ ఎండ్ థియేటర్లలో చిన్న సినిమాలు - పెద్ది ముందు పెద్ద సాహసమే...
Period Delay Pills : పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అమ్మాయిలు జాగ్రత్త, వైద్యుల హెచ్చరికలు ఇవే
పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అమ్మాయిలు జాగ్రత్త, వైద్యుల హెచ్చరికలు ఇవే
Pawan Kalyan Politics: జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Maa Inti Bangaram Trailer: సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
Embed widget