అన్వేషించండి

Rohit Reddy Meets KCR : కేసీఆర్ ను కలిసిన రోహిత్ రెడ్డి - డ్రగ్స్ కేసులో తన పేరుంటే నిరూపించాలని బండి సంజయ్‌కు సవాల్ !

సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్‌లో కలిశారు. తనకు వచ్చిన ఈడీ నోటీసులపై చర్చించారు.

Rohit Reddy Meets KCR : తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్‌లో  తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి...ట్రాప్ చేసి బీజేపీని ఇరుకున పెట్టిన పైలట్ రోహిత్ రెడ్డికి రెండు రోజుల కిందట ఈడీ నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. తనకు వచ్చిన ఈడీ నోటీసుల విషయాన్ని రోహిత్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.   సీఎం కేసీఆర్ కూడా రోహిత్ రెడ్డికి ఇచ్చిన ఈడీ నోటీసులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.  శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన శనివారం పైలట్ రోహిత్ రెడ్డికి సమయం ఇచ్చారు.   ప్రగతి భవన్ నుంచే ఆ నోటీసుల విషయంలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈడీ ఎదుట హాజరు కావాలా..  చట్టవిరుద్ధంగా నోటీసులు ఉన్నాయన్న కారణంగా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాలా అన్న అంశంపై ప్రస్తుతం రోహిత్ రెడ్డి.. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. 

తడి బట్టలతో  ప్రమాణానికి బండి సంజయ్ రావాలని రోహిత్ రెడ్డి సవాల్ 

పైలట్ రోహిత్ రెడ్డి అంతకు ముందు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని.. తనపై ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ పై మండిపడ్డారు. బండి సంజయ్ తడి బట్టలతో రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంకు రావాలని సవాల్ చేశారు. తనకు  డ్రగ్స్ కేసులో నొటీసులు వచ్చినట్లు నిరూపించాలన్నారు. బండి సంజయ్ కు తంబాకు వల్ల నోరు తిరుగతలేదని..  మాకు ఈడీ నోటీసులు వస్తాయని బీజేపికి ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు. బీజేపీ కి అబద్దాలు చెప్పడం కామన్ గా మారిందని విమర్శించారు.  భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందన్నారు.

కర్ణాటక డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి నోటీసులూ రాలేదన్న రోహిత్ రెడ్డి 

కర్ణాటక డ్రగ్స్ కేసులోనూ పైలట్ రోహిత్ రెడ్డి పేరు ఉందని.. అప్పట్లోనే ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని పైలట్ రోహిత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తనకు  కర్ణాటక పోలీసుల నుంచి నోటీసులు వస్తే అమ్మవారి సాక్షిగా బీజేపీ చూపించాలన్నారు. అయ్యప్ప దీక్ష వేసుకొని నేను ప్రమాణం చేస్తున్నానని.. తనకు  కర్ణాటక నుంచి ఎటువంటి నోటీసు రాలేదని స్పష్టం చేశారు.  డ్రగ్స్ కేసుల్లో ఎఫ్ఐఆర్ లో ఎక్కడా తన పేరు లేదని పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.  బండి సంజయ్ నిజంగా హిందు వాది అయితే రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంకు ఆదారలతో రావాలని సవాల్ చేశారు.  

బయోడేటా కోసమే ఈడీ నోటీసులు ఇచ్చిందన్న ఎమ్మెల్యే 

సోమవారం  ఈడీ ఆఫీస్ కు రావాలని ఈడీ నోటీస్ ఇచ్చారని..  అయితే అందులో బయోడేటా కావాలని మాత్రమే అడిగారని రోహిత్ రెడ్డి చెబుతున్నారు. ఆదివారం  బండి సంజయ్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంకు రాకపోతే మొన్నటి దొంగస్వాములకు ఆయనకూ తేడా ఉండదన్నారు.  ఎమ్మెల్సీ కవిత  సైతం నోటీసులు వస్తాయని బీజేపీ ముందే ఎలా చెప్పిందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం తరహాలో అందరూ కొట్లాడి.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సి ఉందని రోహిత్ రెడ్డి అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Nuclear ash over the Himalayas: హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
Cheapest Cars in India: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
Embed widget