అన్వేషించండి

Minister Indrakaran Reddy: వరదలపై రాద్దాంతం వద్దంటున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..!

Minister Indra karan Reddy: వరద ప్రభావాలు పూర్తిగా తగ్గకముందే.. పంటలను కోల్పోయిన రైతులకు ప్రభుత్వం సాయం చేస్తుందని.. విపక్షాలు వీటిపై అనవసర రాద్దాంతం చేయొద్దని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తెలిపారు. 

Minister Indrakaran Reddy: గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం తడిసి ముద్దయింది. జిల్లా వ్యాప్త్గంగా ఉన్న వాగులు, వంకలన్నీ పూర్తిగా నిండిపోయాయి. కొన్ని చోట్ల అయితే ఇంకా వరద ప్రభావం కూడా పూర్తిగా తగ్గలేదు. ఈ భారీ వర్షానికి అన్నదాలతు విపరీతంగా నష్టపోయారు. ముందుగా పంటలు వేసిన పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అప్పో సొప్పో చేసిన వేసిన పంట.. పూర్తిగా నీటి పాలైంది. చాలా మంది నిరుపేదలు ఇళ్లు లేని వారిగా మారిపోయారు. మరెంతో మందికి జీవనాధారమైన పశువులను పోగొట్టుకొని నరకం చూస్తున్నారు.

అన్నదాతలను ఆదుకుంటాం.. ఆందోళన వద్దు.. 

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలతో పాటు రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తెలిపారు. అలాగే విపక్షాలు ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేయొద్దని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో భారీ వర్షాలు వరదలకు సంబంధించి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి, జిల్లా ఉన్నతధికారులు, తదితరులు ఉన్నారు. 

నీటమునిగిన వేల ఎకరాల పంట..

భారీ వర్షాలతో వేల ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా నాశనమయ్యాయమని, అనేక ప్రాంతాల్లో రహదారులు కోతకు గురై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే దీన్నే అనువుగా వాడుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఇది సరైన పద్ధతి కాదని.. వీలైతే మీరు కూడా వరద బాధితులను ఆదుకోండని చెప్పారు. ఆఫదలో ఉన్న వారికి సాయం చేయాలే తప్ప.. వారి అవసరాలను అదునుగా చేస్కొని రాజకీయం చేయకూడదని హితబోధ చేశారు. 

కేంద్ర ప్రభుత్వమూ సాయం చేయాలి..

 అలాగే మంచిర్యాల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో వందలాది ఎకరాల్లో పంట ముంపునకు గురైందని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. వానలు, వరదలు ఉన్నన్ని రోజులు సీఎం కేసీఈర్ ప్రగతి భవన్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ... అధికారులు సలహాలు, సూచనలిచ్చారని... కనీసం రోజుకు 16 గంటలు ఇదే పనిలో ఉన్నారని మంత్రి తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు క్షేత్ర స్థాయిలో.. ముఖ్యంగా సమస్యలు ఉన్న చోటే ఉండి పరిష్కరించాలని చెప్పారని వివరించారు. ఇదే తమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget