అన్వేషించండి

ఎమ్మెల్యేల కొనుగోళ్లకు డీల్- కరీంనగర్ నేతల్లో టెన్షన్ !

ఎమ్మెల్యే ల కొనుగోళ్ల వ్యవహారంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు కూడా టార్గెట్ అయినట్లు తెలుస్తోంది. మరి జిల్లాలో ఏం జరుగుతుందో ఓసారి చూసేద్దామా..!

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ స్కెచ్ విఫలమైందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎక్కడ ఓడిపోతామో అనే భయంతోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు నాటకం ఆడుతుందని బీజెపీ కామెంట్లు చేస్తోంది. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ సాగుతుంది. రెండు పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఇతర పార్టీలకు చెందిన వారిని ప్రలోభాలతో లోబర్చుకొని అనైతికంగా పార్టీ మార్పిడులకు ప్రోత్సహిస్తున్నారని భావన అంతటా వ్యక్తం అవుతుంది. అయితే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై సెటైర్లు విసరడం తెలిసిందే. ఈ వ్యవహారంలో  ఎంత వరకు నిజమున్నా ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు నిజమే కావచ్చునని అభిప్రాయమే రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.

 15 మందిలో కరీంనగర్ కు చెందిన వాళ్లే ఇద్దరు.. 

పార్టీ మారనున్నారని చెబుతున్న 15 మంది ఎమ్మెల్యేల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని ఇద్దరు ఉన్నారని, ఈ డీల్ సందర్భంగా కూడా వారి పేర్లు చర్చకు వచ్చాయని జిల్లాలో చర్చించుకుంటున్నారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ రాజేందర్ కు ఇక్కడ ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు ఉండడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఈ జిల్లా వారి కావడంతో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలపై ప్రధానంగా దృష్టి సారించారని అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి కీలక సందర్భంలో కేసీఆర్ వెంట ఉంటూ వస్తున్న కరీంనగర్ జిల్లా కేసీఆర్ కు సెంటిమెంట్ జిల్లా కావడంతో ఇక్కడ నుంచి ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టాలని బీజేపీ అగ్ర నేతలు భావించినట్లు సమాచారం. ఇక్కడి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా టీఆర్ఎస్ కంచుకోటగా పేర్కొనే కరీంనగర్ లోని ఆ పార్టీకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఈటెల, బండి పట్టుదలతో ఉన్నారని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. 

టీఆర్ఎస్ కు షాకిచ్చేందుకు బీజేపీ స్కెచ్..

జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు మరో ఇద్దరు ప్రముఖ నాయకులతో ఈ విషయమై పలు దఫాలుగా చర్చలు జరిపాలని తెలిసింది. టీఆర్ఎస్ లో ఈసారి 30 నుంచి 40 మందికి టికెట్లు రావు అని ప్రచారం జరగడమే కాకుండా పార్టీ అధినేత కూడా అలాంటి హెచ్చరికలు చేయడంతో అనుమానాలు ఉన్న కొందరు బీజేపీతో టచ్ లోకి వెళ్లారని సమాచారం. పరిస్థితి ఏర్పడినప్పుడు సమీక్షించుకుంటూ పార్టీలో వస్తున్న మార్పులను గమనిస్తూ ఆయా ఎమ్మెల్యేలు, నాయకులు బీజేపీతో టచ్ లోనే ఉన్నా అవునని కానీ కాదని కానీ స్పష్టమైన సంకేతాలు ఏమీ ఇవ్వలేదని సమాచారం. బీజేపీ నుంచి స్వామి గౌడ్, భిక్షమయ్యగౌడ్, దాసోజు శ్రావణ్ టీఆర్ఎస్ లో చేరడంతో దానికి ప్రతిగా టిఆర్ఎస్ కు తిరుగులేని షాక్ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేల పార్టీ మార్పిడికి స్కెచ్ వేసిందని అనుకుంటున్నారు. 

అందులో భాగంగానే కరీంనగర్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా సంప్రదించారని అయితే వారు అందుకు తిరస్కరించారని చెబుతున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కేసీఆర్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలందరికీ మళ్లీ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన రోజే పార్టీ మారే ఆలోచనను విరమించుకొని నియోజకవర్గంలో చురుకుగా తిరుగుతున్నారని తెలుస్తోంది. కానీ ఇద్దరు మాత్రం అసంతృప్తితో ఉండగా బీజేపీ వారికి వల వేసిందని తెలిసింది. ఆ ఇద్దరు కూడా బీజేపీలో చేరడానికి నో చెప్పడంతో జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరూ టిఆర్స్ ను వీడలేదని తేలిపోయింది. గతంలోనూ ఒకసారి ఉమ్మడి జిల్లా నేతలు ఉన్నట్టుగా వచ్చిన ప్రచారం ఈసారి కూడా నిజమేనా అనే చర్చ ఇక్కడ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour Schedule: ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Khalid Rahman Ashraf Hamza: గంజాయి కేసులో సినీ డైరెక్టర్ల అరెస్ట్ - బెయిల్‌పై రిలీజ్
గంజాయి కేసులో సినీ డైరెక్టర్ల అరెస్ట్ - బెయిల్‌పై రిలీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs LSG Match Preview IPL 2025 | వాంఖడేలో ముంబైని ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamMS Dhoni on CSK Performances | సీఎస్కే వైఫల్యాలపై తొలిసారి మాట్లాడిన ధోనీ | ABP DesamThala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలుCSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSK

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour Schedule: ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Khalid Rahman Ashraf Hamza: గంజాయి కేసులో సినీ డైరెక్టర్ల అరెస్ట్ - బెయిల్‌పై రిలీజ్
గంజాయి కేసులో సినీ డైరెక్టర్ల అరెస్ట్ - బెయిల్‌పై రిలీజ్
Pahalgam Terrorist Attack: పాక్ ఆర్మీతో కలిసి పోరాడతాం, భారత్‌లోకి చొచ్చుకొస్తాం! ప్రాణాలు అర్పించేందుకు రెడీ: జేయూఈఐ నేత వార్నింగ్
పాక్ ఆర్మీతో కలిసి పోరాడతాం, భారత్‌లోకి చొచ్చుకొస్తాం! ప్రాణాలు అర్పించేందుకు రెడీ: జేయూఈఐ నేత వార్నింగ్
Latest OTT Releases: కామెడీ నుంచి యాక్షన్ వరకూ.. - ఈ వీకెండ్‌లో ఓటీటీల్లో మూవీస్, సిరీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి!
కామెడీ నుంచి యాక్షన్ వరకూ.. - ఈ వీకెండ్‌లో ఓటీటీల్లో మూవీస్, సిరీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి!
Vitamins For Women : ప్రతి మహిళ కచ్చితంగా తీసుకోవాల్సిన విటమిన్స్ ఇవే.. ఆ సమస్యలు దూరమవడంతో పాటు ఎన్నో లాభాలు
ప్రతి మహిళ కచ్చితంగా తీసుకోవాల్సిన విటమిన్స్ ఇవే.. ఆ సమస్యలు దూరమవడంతో పాటు ఎన్నో లాభాలు
Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్, నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ !
గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్, నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ !
Embed widget