అన్వేషించండి

ఎమ్మెల్యేల కొనుగోళ్లకు డీల్- కరీంనగర్ నేతల్లో టెన్షన్ !

ఎమ్మెల్యే ల కొనుగోళ్ల వ్యవహారంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు కూడా టార్గెట్ అయినట్లు తెలుస్తోంది. మరి జిల్లాలో ఏం జరుగుతుందో ఓసారి చూసేద్దామా..!

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ స్కెచ్ విఫలమైందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎక్కడ ఓడిపోతామో అనే భయంతోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు నాటకం ఆడుతుందని బీజెపీ కామెంట్లు చేస్తోంది. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ సాగుతుంది. రెండు పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఇతర పార్టీలకు చెందిన వారిని ప్రలోభాలతో లోబర్చుకొని అనైతికంగా పార్టీ మార్పిడులకు ప్రోత్సహిస్తున్నారని భావన అంతటా వ్యక్తం అవుతుంది. అయితే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై సెటైర్లు విసరడం తెలిసిందే. ఈ వ్యవహారంలో  ఎంత వరకు నిజమున్నా ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు నిజమే కావచ్చునని అభిప్రాయమే రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.

 15 మందిలో కరీంనగర్ కు చెందిన వాళ్లే ఇద్దరు.. 

పార్టీ మారనున్నారని చెబుతున్న 15 మంది ఎమ్మెల్యేల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని ఇద్దరు ఉన్నారని, ఈ డీల్ సందర్భంగా కూడా వారి పేర్లు చర్చకు వచ్చాయని జిల్లాలో చర్చించుకుంటున్నారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ రాజేందర్ కు ఇక్కడ ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు ఉండడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఈ జిల్లా వారి కావడంతో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలపై ప్రధానంగా దృష్టి సారించారని అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి కీలక సందర్భంలో కేసీఆర్ వెంట ఉంటూ వస్తున్న కరీంనగర్ జిల్లా కేసీఆర్ కు సెంటిమెంట్ జిల్లా కావడంతో ఇక్కడ నుంచి ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టాలని బీజేపీ అగ్ర నేతలు భావించినట్లు సమాచారం. ఇక్కడి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా టీఆర్ఎస్ కంచుకోటగా పేర్కొనే కరీంనగర్ లోని ఆ పార్టీకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఈటెల, బండి పట్టుదలతో ఉన్నారని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. 

టీఆర్ఎస్ కు షాకిచ్చేందుకు బీజేపీ స్కెచ్..

జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు మరో ఇద్దరు ప్రముఖ నాయకులతో ఈ విషయమై పలు దఫాలుగా చర్చలు జరిపాలని తెలిసింది. టీఆర్ఎస్ లో ఈసారి 30 నుంచి 40 మందికి టికెట్లు రావు అని ప్రచారం జరగడమే కాకుండా పార్టీ అధినేత కూడా అలాంటి హెచ్చరికలు చేయడంతో అనుమానాలు ఉన్న కొందరు బీజేపీతో టచ్ లోకి వెళ్లారని సమాచారం. పరిస్థితి ఏర్పడినప్పుడు సమీక్షించుకుంటూ పార్టీలో వస్తున్న మార్పులను గమనిస్తూ ఆయా ఎమ్మెల్యేలు, నాయకులు బీజేపీతో టచ్ లోనే ఉన్నా అవునని కానీ కాదని కానీ స్పష్టమైన సంకేతాలు ఏమీ ఇవ్వలేదని సమాచారం. బీజేపీ నుంచి స్వామి గౌడ్, భిక్షమయ్యగౌడ్, దాసోజు శ్రావణ్ టీఆర్ఎస్ లో చేరడంతో దానికి ప్రతిగా టిఆర్ఎస్ కు తిరుగులేని షాక్ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేల పార్టీ మార్పిడికి స్కెచ్ వేసిందని అనుకుంటున్నారు. 

అందులో భాగంగానే కరీంనగర్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా సంప్రదించారని అయితే వారు అందుకు తిరస్కరించారని చెబుతున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కేసీఆర్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలందరికీ మళ్లీ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన రోజే పార్టీ మారే ఆలోచనను విరమించుకొని నియోజకవర్గంలో చురుకుగా తిరుగుతున్నారని తెలుస్తోంది. కానీ ఇద్దరు మాత్రం అసంతృప్తితో ఉండగా బీజేపీ వారికి వల వేసిందని తెలిసింది. ఆ ఇద్దరు కూడా బీజేపీలో చేరడానికి నో చెప్పడంతో జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరూ టిఆర్స్ ను వీడలేదని తేలిపోయింది. గతంలోనూ ఒకసారి ఉమ్మడి జిల్లా నేతలు ఉన్నట్టుగా వచ్చిన ప్రచారం ఈసారి కూడా నిజమేనా అనే చర్చ ఇక్కడ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Paadi Kaushik Reddy Controversy: కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Revanth vs Vijayasanthi: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Chicken Shops: హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
Chandigarh Blast: చండీగఢ్‌ బీజేపీ కార్యాలయం ముందు భారీ పేలుడు - విద్రోహ చర్యేనా?
చండీగఢ్‌ బీజేపీ కార్యాలయం ముందు భారీ పేలుడు - విద్రోహ చర్యేనా?
Anirudh Reddy Controversies: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
Indian Stock Market Rally: భారత్‌ మార్కెట్‌ జోరు రేపు కొనసాగుతుందా? ఈ జోష్‌కు కారణమేంటీ? 
భారత్‌ మార్కెట్‌ జోరు రేపు కొనసాగుతుందా? ఈ జోష్‌కు కారణమేంటీ? 
 Drum Brakes vs Disc Brakes: డ్రమ్ బ్రేక్స్ Vs డిస్క్ బ్రేక్స్: మీ కారుకు ఏది బెస్ట్? సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకండి!
 డ్రమ్ బ్రేక్స్ Vs డిస్క్ బ్రేక్స్: మీ కారుకు ఏది బెస్ట్? సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకండి!
Fuel Price Hike:భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
Spain vs USA: అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
Embed widget