అన్వేషించండి

Minister Puvvada Ajay Kumar: వేకువజాము నుంచే ముంపు ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ పర్యటన.!

Minister Puvvada Ajay Kumar: వేకువజాము నుంచే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మోకాళ్ల లోతు నీటిలో తిరుగుతూ.. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులతో మాట్లాడుతున్నారు. 

Minister Puvvada Ajay Kumar: గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా తడిసి ముద్దయింది. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. వాగులు, వంకలన్నీ పొంగి పొర్లుతూ రోడ్లపై ప్రవహిస్తోంది. ప్రతిరోజూ ప్రజాప్రథినిధులు ప్రభుత్వ అధికారులను వెంటబెట్టుకొని మరీ వరద బాధిత ప్రాంతాలకు వెళ్తున్నారు. క్షేత్ర స్థాయిలో తిరుగుతూ.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే తీర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 24 గంటల్లూ ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

వేకువజాము నుంచే పర్యటన..

ఇందులో భాగంగానే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు వేకువజాము నుంచే ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ భోజనంతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు వివరిస్తున్నారు. అలాగే పడిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో అస్సలే ఉండకూడదని చెప్తున్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చిన వెంటనే స్థానిక అధికారులకు లేదా ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్తున్నారు.

ముందస్తు చర్యల్లో భాగంగానే..

గోదావరి వరద ఉద్ధృతి 68 అడుగులకు పెరిగిన దృష్ట్యా ముందుస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గోదావరి నదీ  పరివాహక ప్రాంత ప్రజలంతా తమకు సహకరించి వెంటనే ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే గోదావరి వరద ఉద్ధృతి ఇంకా పెరిగి 75 అడుగుల వరకు వస్తుందన్న సమాచారం మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా భద్రాచలం పట్టణం ఏఎంసీ కాలనీ, సుభాష్ నగర్, శాంతి నగర్, మిథిలా స్టేడియంలో వరుద నీరు చేరడంతో ఆయా ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు ఇళ్లకు రాకుండా ఉండాలని బాధితులకు వివరించారు. అప్పటి వరకు మీ బాధ్యత మొత్తం మాదేనంటూ భరోసా కల్పించారు.

మోకాళ్ల లోతు నీటిలోనే..

మోకాళ్ల లోతులో నీళ్లలో తిరుగుతూనే మంత్రి పువ్వాడ కుమార్ వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ముంపుకు గురైన వివిధ ప్రాంతాలలో ప్రజలను తక్షణమే తరలించాలని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్కడ వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్కోవాలని చెప్పారు. అలాగే భోజన వసతితో పాటు వైద్య శిబిరాలను కూడా అందుబాటులో ఉంచాలని వివరించారు. ప్రజలు కూడా వరద నీటికి అడ్డుగా వెళ్లడం, విద్యుత్ స్తంభాల వద్ద నిల్చోవడం వంటివి చేయకూడదని సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ రాకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని మంత్రి పువ్వాడ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వర్షాల కారణంగా ఏమైనా నష్టపోతే వారికి ప్రభుత్వం సాయంగా నిలుస్తుందని చెప్పారు. కాబట్టి ప్రజలెవరూ బాధపడకూడదని, భయ పడకూడదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గచ్చిబౌలిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఆరో అంతస్తు నుంచి దూకడంతో విషాదం
గచ్చిబౌలిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఆరో అంతస్తు నుంచి దూకడంతో విషాదం
TRS Chief Kavitha Reaction : కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Sai Krishna Case: సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Hindu Dharma: హిందూ ధర్మం -
హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Pragya Nagra : బంగారు కాంతుల్లో అందాల ప్రగ్యా - తమిళ బ్యూటీ క్యూట్ లుక్స్... వెయిటింగ్ ఫర్ టాలీవుడ్ ఛాన్సెస్
బంగారు కాంతుల్లో అందాల ప్రగ్యా - తమిళ బ్యూటీ క్యూట్ లుక్స్... వెయిటింగ్ ఫర్ టాలీవుడ్ ఛాన్సెస్
Embed widget