అన్వేషించండి

IMD Alert: సాయంత్రమైతే చలి చంపేస్తోంది.. ఇంకా పెరిగే అవకాశం.. ఈ జిల్లాల్లో గజ గజే

తెలుగు రాష్ట్రల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. అప్రమత్తంగా ఉండాలి అధికారులు సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెడుతోంది. సాయంత్రమైతే చాలు.. వణికిస్తోంది. మరోవైపు భాగ్యనగరంలోనూ చలి ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో విశాఖ మన్యంలోనూ చలి విపరీతంగా పెడుతుంది.

హైదరాబాద్ లో సాయంత్రమైతే.. ఇక దుప్పటి కప్పుకుని బయటకు వెళ్లాలా అనే రేంజ్ లో చలి ఉంది. శివారు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఒక్కోసారి ఆదిలాబాద్‌ తో పోల్చుకుంటే.. హైదరాబాద్‌లోనే రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

హైదరాబాద్​ లోని పలు ప్రాంతాల్లో శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప‌టాన్‌చెరు 8.4 డిగ్రీలు, రాజేంద్రన‌గ‌ర్‌ 9 డిగ్రీలు, హ‌య‌త్ న‌గ‌ర్ 10 డిగ్రీలు,  ఆదిలాబాద్ 10.6, మెద‌క్ 10.8, హనుమకొండ 13, హ‌కీంపేట 13.5, రామగుండం  13.4, నిజామాబాద్ 14.1, న‌ల్లొండ 15, భ‌ద్రాచ‌లం 15.4, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 17.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఆదిలాబాద్‌లో క‌నిష్ఠ ఉష్ణోగ్రత 10.4 డిగ్రీలు ఉంది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి శీత‌ల గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పొడి వాతావ‌ర‌ణం ఏర్పడి.. చ‌లి తీవ్రతం ఎక్కువగా ఉందని వెల్లడించింది. ఇంకా కొన్ని రోజులపాటు ఇలా ఉంటుందని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్, సిద్దిపేట‌, వ‌రంగ‌ల్ జిల్లాల‌కు ఐఎండీ ఆరెంజ్  హెచ్చరికలు జారీ చేసింది. 

మరోవైపు ఏపీలోను పలు జిల్లాల్లో చలి విపరీతంగా పెరిగింది. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా పడిపోతున్నాయి. చింతపల్లిలో 5.8, పాడేరులో 8 డిగ్రీలు, మినుములూరులో 7 డిగ్రీలు, లంబసింగిలో 4.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో ఉదయం, సాయంత్రం వెళ్లాలంటే.. రహదారులన్నీ పొగమంచుతో కప్పుకుని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉదయం తొమ్మిదైనా పొగమంచు కమ్ముకునే ఉంటుంది. సాయంత్రం మూడున్నర ప్రాంతంలో చలి మెుదలవుతుంది. వచ్చే రోజుల్లో చ‌లి మ‌రింత పెరిగే అవ‌కాశామున్నట్టు వాతావరణ అధికారులు వెల్లడించారు.

Also Read: Telangana Letter To KRMB: కల్వకుర్తి కింద కొత్త ఆయకట్టును పెంచలేదు

Also Read: Kishan Reddy: నేను నాగలి కడతా.. నువ్వు కడతావా కేసీఆర్, ఆ పౌరుషం చూపాల్సిందే.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

Also Read: Minister KTR: చేనేత, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు సరికాదు.... కేంద్రమంత్రికి కేటీఆర్ లేఖ... చేనేత రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Dil Raju Trolls Tamil Trollers | Family Star తమిళ్ ప్రమోషన్స్ లో దిల్ రాజు ఫన్ | ABP DesamCM Revanth Reddy on Phone Tapping | ఫోన్ ట్యాపింగు కేసులో KTR పై CM Revanth Reddy సంచలన వ్యాఖ్యలుKadiyam Srihari Joins Congress | కాంగ్రెస్ నేతలతో కడియం భేటీ..మరి పాతమాటల సంగతేంటీ.? | ABP DesamPrabhakar Chowdary Followers Angry | ప్రభాకర్ చౌదరికి టీడీపీ దక్కకపోవటంపై టీడీపీ నేతల ఫైర్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Embed widget