అన్వేషించండి

Ibrahimpatnam News : ఇబ్రహీంపట్నం కు.ని. ఘటనలో నిర్లక్ష్యం ఎవరిదీ? పరిహారం సమస్యకు పరిష్కారమా?

Ibrahimpatnam News : ఇబ్రహీంపట్నంలో కు.ని ఆపరేషన్ వికటించి నలుగురు మృతి చెందిన ఘటన సంచలం అయింది. అయితే ఈ ఘటనలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.

Ibrahimpatnam News : రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నాలుగురు మహిళలు మృతి చెందిన ఘటన సంచలనం అయింది. ఈ ఘటనకు నివారణ చర్యలు చేపట్టిన తెలంగాణ వైద్యశాఖ తప్పడగువేసిందా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విచారణకు ఆదేశించాం..మరో వారం రోజుల్లో విచారణ పూర్తవుతుందని చెప్పిన వైద్యశాఖ ఉన్నాతాధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకుంది. ఆయనపై శాశ్వతంగా అనర్హత వేటువేశారు. కొందరు డాక్టర్లను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించడంతోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించడం చేశారు. ఇదంతా చూస్తుంటే తప్పు జరిగిన మూలాలు గుర్తించి, మరోసారి అలాంటి విషాద ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం కంటే తప్పును పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాంపులతో  మాఫీ చేస్తున్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆసుపత్రి పేరు చెబితే హడల్ 

ఇబ్రహీపట్నం ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వెళ్లినప్పుడు అక్కడ వైద్యసిబ్బంది వ్యవహరించే తీరుపై రోగులకు చిర్కెత్తుకురావడం సర్వసాధారణం. ఆసుపత్రిలో కు.ని ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు అనే విషయం వెలుగుచూసిన తరువాత కూడా అక్కడ పరిస్థితిలో మార్పురాలేదు. పాముకాటుతో ఓ మహిళ అదే ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి వెళ్తే.. విషం శరీరంలోకి సోకకుండా వైద్యం అందించాల్సిన వైద్యులు, బాధిత మహిళను రెండు గంటల పాటు ఆసుపత్రిలోనే పడిగాపులు పడేలా వదిలేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చని బాధితులు అంటున్నారు. ఇలాంటి ఘటనలు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కోకొల్లలని ఆరోపిస్తున్నారు. తాజాగా కు.ని ఆపరేషన్ వికటించడంతో అక్కడి వైద్యుల అసలు రంగు బయటపడిందని బాధితులు అంటున్నారు.

ఒకే రోజు 34 మందికి ఆపరేషన్లు 

ఈనెల 25వ తేదీన రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. వారిలో ఆపరేషన్ జరిగిన మూడు రోజులకు ఓ మహిళ, తరువాత రోజు మరో మహిళా, తాజాగా ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ సూపరింటెండెంట్ పైనో, లేక మరోకరిపైనో వేటు వేయడంతో సమస్యకు పరిష్కారం దొరుకుంతుందా? లేదా? పరిహారమో లేక మరొకటి ఆశచూపి నిరసనలను ఆపినంత మాత్రాన క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలకు శాశ్వత మందు పడినట్లేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆయా వ్యవస్థలను ముందుండి నడిపిస్తున్న పాలకులు, వారి చేతల్లో ఉన్న అధికారులు ప్రశ్నించుకోవాల్సిన అసవరం వచ్చిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.  

నిర్లక్ష్యంపై దృష్టి పెట్టకుండా? 

ఉన్నత వైద్యం అందిస్తున్నాం.. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం ప్రభుత్వ లక్ష్యం అంటూ చెబుతున్న నాయకులు ఇలాంటి నిర్లక్ష్యంపై దృష్టి పెట్టాల్సి అవసరం ఎంతైనా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.  ఒకే రోజు 34 మందికి కు.ని. ఆపరేషన్ చేస్తే అందులో నలుగురు ప్రాణాలు కోల్పోయేంతలా నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో దానిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందనే భావన వ్యక్తమవుతోంది. తప్పు జరిగిందని ఒప్పుకున్నాక, చేసినవారిపై చర్యలు తీసుకున్నామని ప్రకటించే అధికారులు... సమస్యకు పరిష్కారం చూపకుండా దాటవేసే పరిస్థితి ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. మా తప్పులేదు.. ఆపరేషన్ విజయవంతం..కానీ పేషెంట్ మాత్రం.. అంటూ మరో వారం విచారణ పేరుతో ఎందుకు దాటవేస్తున్నారో అర్థం కాని ప్రశ్నగా మిగిలిందని బాధితులు అంటున్నారు.  ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్ వ్యూహాలపై దృష్టికన్నా విచారణ చేస్తున్నాం కాస్త ఆగమంటున్నట్లు వైద్యశాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నతీరుపై బాధితులు మండిపడుతున్నారు. ఏదేమైనా దెబ్బతగిలిన చోట మందు వేయడం కంటే చూసేవారికి దెబ్బకనబడకుండా చర్యలు తీసుకుందాం అన్నట్లుగా పాలకులు వ్యవహరిస్తున్నారనే విమర్మలు వినిపిస్తున్నాయి.

Also Read : కు.ని ఆపరేషన్ల విషాదంపై హెచ్‌ఆర్సీ సీరియస్ - నివేదిక ఇవ్వాలని ఆదేశం

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget