అన్వేషించండి

Food Poisoning: తెలంగాణలో మరో స్కూల్లో ఫుడ్ పాయిజన్, 21 మంది విద్యార్థులకు అస్వస్థత

Telangana News | నారాయణపేట జిల్లాలోని ఓ జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనం తిన్న తరువాత 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Food Poisoning at Maganoor Zilla Parishad School | మహబూబ్ నగర్: తెలంగాణలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. మూడు వారాల కిందట కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడిలోని ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కాగా, ఓ విద్యార్థిని సోమవారం నాడు చనిపోవడం విషాదాన్ని నింపింది. తాజాగా మరో స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. అయితే వారం రోజుల్లోనే మూడోసారి ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

నారాయణపేట జిల్లాలోని మాగనూరు జడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. మాగనూరు జడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తరువాత 20 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో విద్యార్థులను మాగనూరు, మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

మాగనూరు జడ్పీ స్కూల్లో మరోసారి ఫుడ్ పాయిజన్

నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ZP School)లో మరోసారి ఫుడ్ పాయిజన్‌ జరిగింది. నేడు మధ్యాహ్న భోజనం తిన్న తరువాత చాలా మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత పలువురు విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు.  కొందరు విపరీతమైన తలనొప్పి రావడంతో ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది విద్యార్థులను చికిత్స నిమిత్తం వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మాగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థులకు చికిత్స అందించారు. కొందరు విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కేవలం వారం రోజుల్లో మాగనూరులో ఫుడ్‌ పాయిజన్‌ జరగడం ఇది మూడోసారి అని దీనిపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్ వద్ద ఉన్న ఎస్సీ బాలిక కాలేజీ హాస్టల్‌లోనూ విద్యార్థులకు అన్నంలో పురుగులు వచ్చాయని సమాచారం. నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, కలుషిత ఆహారం పెట్టడం వల్ల అస్వస్థతకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ప్రతిరోజు ఇలానే భోజనంలో పురుగులు వస్తున్నాయని ఎస్ఎఫ్ఐ యూనియన్ కు విద్యార్థులు చెప్పారు.

Also Read: Asifabad News: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హౌస్ అరెస్ట్, విద్యార్థిని మృతితో పోలీసులు అలర్ట్ 

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అక్టోబర్ 30న ఫుడ్ పాయిజన్‌కు గురై కొందరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించి వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి చికిత్స అందించారు. ఇద్దరు కోలుకోవడంతో డాక్టర్లు వారిని డిశ్చార్జ్ చేశారు. నాలుగు వారాలుగా చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ (16) నవంబర్ 25న మృతి చెందడంతో విషాదం నెలకొంది. నవంబర్ 5న హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించి ముగ్గురికి చికిత్స అందించగా.. ఇద్దరు బాలికలు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. శైలజ అనే విద్యార్థిని శరీరం వైద్యానికి సహకరించకపోవడంతో చనిపోయింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందనంటూ కుటుంబసభ్యులు హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ వద్ద సోమవారం ఆందోళనకు దిగారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Revanth Reddy: ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
New Banking Rules: ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!
ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!
Pastor Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP DesamShashank Singh on Shreyas Iyer 97 Runs | GT vs PBKS మ్యాచ్ లో అయ్యర్ బ్యాటింగ్ పై శశాంక్ ప్రశంసలుShreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Revanth Reddy: ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
New Banking Rules: ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!
ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!
Pastor Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
RC16 First Look: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్... 'పెద్ది' ఫస్ట్‌ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్, ఎప్పుడో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్... 'పెద్ది' ఫస్ట్‌ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్, ఎప్పుడో తెలుసా?
Mohammed Shami Latest News:ఉపాధి హామీ పథకంలో కూలీ డబ్బులు తీసుకుంటున్న క్రికెటర్ షమీ సోదరి, బావ
ఉపాధి హామీ పథకంలో కూలీ డబ్బులు తీసుకుంటున్న క్రికెటర్ షమీ సోదరి, బావ
Telangana Cisco: తెలంగాణతోనూ సిస్కో ఒప్పందం - సీఎంతో భేటీ సమయంలో కనిపించని ఇప్పాల రవీంద్రారెడ్డి
తెలంగాణతోనూ సిస్కో ఒప్పందం - సీఎంతో భేటీ సమయంలో కనిపించని ఇప్పాల రవీంద్రారెడ్డి
Revanth Reddy On Betting App Cases: బెట్టింగ్స్‌ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటన
బెట్టింగ్స్‌ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటన
Embed widget