అన్వేషించండి

MLC Kavitha: మునుగోడు మాదే- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మాదే: కవిత

MLC Kavitha: నల్గొండ జిల్లా టీఆర్ఎస్‌కు కంచుకోట అని, మునుగోడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం టీఆర్ఎస్‌దేనని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ ఏం చేసినా గెలవలేరని అభిప్రాయపడ్డారు.

మునుగోడు మాదే... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే అంటున్నారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. నల్గొండ టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. మునుగోడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమదే విజయం ఖాయమంటున్నారు. హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హై స్కూల్ నిర్వహించిన స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన మహోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవితతోపాటు ముఠా గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

బీజేపీ తెరవెనుక రాజకీయాలు చేస్తోంది..

బిహార్ రాజకీయాలను యావత్ దేశం గమనిస్తోందన్నారు కవిత. బీజేపీ బ్యాక్ డోర్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదని సూచించారు. అక్కడ ఏకపక్ష నిర్ణయాలు, తెరవెనుక రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి వాటన్నింటికీ మునుగోడు ఉపఎన్నిక సమాధానం చెప్తుందని అభిప్రాయపడ్డారు.

 ఇప్పటి వరకు జరిగిన చాలా ఎన్నికల్లో టీఆర్ఎస్ హేమాహేమీలను ఓడించిందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. బీజేపీ కావాలనే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించిందని ఆరోపించారు. హైస్పీడ్‌లో అబద్ధాలు చెప్పడం ఒక్క బీజేపీ నేతలకు మాత్రమే సాధ్యం అవుతుందని కవిత సెటైర్లు వేశారు. అబద్ధాలు చెప్పి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిదంని ఆరోపించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు.

రాష్ట్రంలో, కేంద్రంలో అభివృద్ధిని ప్రజలు గమనించాలని కవిత కోరారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను యథేచ్ఛగా పెంచారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పేదల కోసం 250 సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఆమె వివరించారు. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం రాష్ట్ర ప్రభుత్వంగా తమ బాధ్యత అన్నారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలను ఉచితాలుగా అభివర్ణించే ధోరణి ఉందని ఆమె అన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ మూడేళ్ల కిందట పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. అర్వింద్ కు ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉందని పసుపు బోర్డు ఎప్పుడు తెస్తారని ప్రశ్నించారు. 

మునుగోడులో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదే..!

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు కవిత. కోమటిరెడ్డి  రాబోయే ఎన్నికల్లో గెలవననే విషయం అతడికి కూడా తెలుసని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తరచూ టీఆర్ఎస్‌ను తిట్టడం తప్ప మనుగోడు ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా తెరాస పార్టీ మునుగోడులో సంక్షేమ పథకాలను ఆపలేదని గుర్తు చేశారు. ఇటు పార్టీని నడపడంలోనూ, అటు ప్రభుత్వాన్ని నడపడంలోనూ సీఎం కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారని కవిత వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో మునుగోడు ఎన్నికల్లో విజయం సాధించేది తమ పార్టీయేనని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Professor Kodandaram: పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Pawan Kalyan Press Meet:రేవంత్ రెడ్డి గారూ, ఆ చెరువు పక్కన స్థలం తీసుకోండి! పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్!
రేవంత్ రెడ్డి గారూ, ఆ చెరువు పక్కన స్థలం తీసుకోండి! పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్!
Pawan Kalyan:
"గద్దర్‌కు మీరేం చేశారు? పాశం యాదగిరి కూడా విమర్శిస్తున్నారు" పవన్ కల్యాణ్‌ పంచ్‌లు 

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Embed widget