అన్వేషించండి

Revanth Reddy: పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jubilee Hills By Election | 2007లో పీజేఆర్ ఆకస్మికంగా చనిపోతే జూబ్లీహిల్స్ స్థానాన్ని ఏకగ్రీవం చేయకుండా ఎన్నికలకు అభ్యర్థిని నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.

 Revanth Reddy participates corner meeting at Erragadda | హైదరాబాద్: బీఆరెస్ పార్టీ సానుభూతితో ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎర్రగడ్డ డివిజన్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్ రేవంత్ రెడ్డి బీఆరెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల (Jubilee Hills By Election) సందర్భంగా నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆరెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని  ఆరోపించారు. అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆరెస్ పనిచేసింది. ఇప్పుడు బీజేపీ వాళ్లు బీఆరెస్ ను గెలిపించేందుకు పనిచేస్తున్నారు. కేంద్రంలో ప్రతీ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ మద్దతు పలికారని విమర్శలు గుప్పించారు.
 
కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు
గతంలో పాటించిన రాజకీయ సంప్రదాయాలను కేసీఆర్ తుంగలో తొక్కారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘సెంటిమెంట్ పేరుతో బీఆరెస్ నేతలు మీ ముందుకు వస్తున్నారు. అయితే, 2007లో పీజేఆర్ గారు ఆకస్మికంగా చనిపోతే, ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాల్సింది పోయి, అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్. ఆనాడు పీజేఆర్ కుటుంబాన్ని మూడు గంటలు బయట నిలబెట్టి కేసీఆర్ అవమానించాడు. పీజేఆర్ కుటుంబంపై పోటీ పెట్టి సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది కేసీఆర్. కారు షెడ్డుకు పోయిందని ఇప్పుడు బిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.

Revanth Reddy: పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
 
కేటీఆర్‌ను నిలదీసిన సీఎం:
పదేళ్ల అధికారంలో జూబ్లీహిల్స్ సమస్యల పరిష్కారానికి ఎందుకు కృషి చేయలేదని కేటీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో సమస్యలు పేరుకుపోవడానికి కారణం నువ్వు మీ అయ్య కాదా కేటీఆర్? పదేళ్లు అధికారంలో ఉన్న మీరు సమస్యలు పరిష్కరించి ఉంటే జూబ్లీహిల్స్ కు ఈ పరిస్థితి వచ్చేదా? పదేళ్లు అధికారంలో ఉన్న మీరు మైనారిటీ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సొంత కుటుంబ సభ్యురాలిని దూరం చేసుకున్న కేటీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి పంపిన కేటీఆర్... సునీతమ్మను మంచిగా చూసుకుంటాడా? సొంత చెల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మ కూతురికి బంగారు గాజులు పెడతారంటే నమ్ముతారా?" అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
 
కాంగ్రెస్ ప్రభుత్వం పనులేమిటి?
తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 70 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. ఈ బస్తీల్లో రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ కాదా?. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నది కాంగ్రెస్. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సన్నబియ్యం ఇస్తున్నది మేమే. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది నిజం కాదా అన్నారు.

 
అభివృద్ధికి నవీన్ యాదవ్, అండగా అజారుద్దీన్
కంటోన్మెంట్ ఉపఎన్నికలో గణేష్‌ను గెలిపించగానే ఆ నియోజకవర్గాన్ని 4 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డి జాగీర్ ఏమైనా పోతుందా? ఎందుకు అడ్డుకోవాలని చూశారని బీజేపీ నేతలనుద్దేశించి అన్నారు. పీజేఆర్ తరువాత జూబ్లీహిల్స్ కు నాయకుడు లేకుండాపోయారని, పీజేఆర్ వారసత్వాన్ని నవీన్ యాదవ్ కొనసాగిస్తారని, పేదలకు అండగా ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
 
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మైనారిటీలకు మేలు జరుగుతుందని, మీ బిడ్డ నవీన్ యాదవ్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యేగా నవీన్, మంత్రిగా అజారుద్దీన్ మీకు అండగా ఉంటారు. నవీన్‌ను 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Advertisement

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget