అన్వేషించండి

Balka Suman: దోస్తులకు దోచి పెట్టడమే మోదీ సర్కారు పని - MLA బాల్క సుమన్

Balka Suman: దేశాన్ని అర్థం చేసుకోవడంలో, దేశానికి మంచి చేయడంలో బీజేపీ పూర్తిగా విఫలం అయిందని ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. దోస్తులకు దోచిపెట్టడమే మోదీ సర్కారు పనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Balka Suman: దేశాన్ని, దేశ ప్రజలను అర్థం చేసుకోవడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో బీజేపీ పూర్తిగా విఫలం అయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. దోస్తులకు దోచి పెట్టేందుకు మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు పని చేస్తుందంటూ మండి పడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూర్చే పథకాలు తీసుకు వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు పర్యవసనాలపై శాసన సభలో లఘు చర్చను ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉండేదని నాటి పరిస్థితులను గుర్తుచేశారు. విద్యుత్తు సరిగ్గా లేక వ్యవసాయ దారులు, పారిశ్రామిక వేత్తలు తీవ్రంగా నష్టపోయారని బాల్క సుమన్ వివరించారు. 

24 గంటలూ ఉచిత విద్యుత్..  
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులను తెలంగాణ సీఎం కేసీఆర్ సరిదిద్దుతున్నారని అన్నారు. దేశంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైన రాష్ట్రం తెలంగాణ అని ఆయన వెల్లడించారు. వ్యవసాయంతో పాటు బలహీన వర్గాలకు ఉచిత కరెంటు ఇవ్వడం సీఎం కేసీఆర్ ఒక్కరికే సాధ్యమైందని తెలిపారు. ఉచిత, 24 గంటల కరెంటు వల్ల రైతుల మరణాలు, ఆత్మహత్యలు చాలా వరకు తగ్గాయని.. దిగుబడులు కూడా విపరీతంగా పెరిగాయని చెప్పుకొచ్చారు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవడమే తెలంగాణ సర్కారు ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా కృషి చేస్తున్నారని చెప్పారు. 

యూపీ, ఏపీలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. 
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారు కొద్ది మంది కోసమే విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నారని బాల్క సుమన్ విమర్శించారు. కేంద్రం కుట్రలు ప్రజలకు తెలియాలన్నారు. ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని చెప్పారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం మన రాష్ట్రానికే కాకుండా మహారాష్ట్ర రైతులకు కూడా సాయం చేసిన గొప్ప మానవతా వాది అని పేర్కొన్నారు. కేంద్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తుందంటూ బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
బీజేపీని కేవలం రాష్ట్రం నుంచే కాకుండా దేశం నుంచి కూడా తరిమికొట్టాలని బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వం వహించి మరీ బీజేపీని అధికారం నుంచి తొలగించాలని అన్నారు. అప్పుడే రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగు పడుతుందని చెప్పారు. 

గతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఫైర్.. 
తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. ఒక్క మంచిపనైనా తెలంగాణకు కేంద్రం నుంచి చేయించడం కిషన్ రెడ్డికి చేతకాలేక పోయిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కిషన్ రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డిని దిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో గుమస్తాలు కూడా గుర్తుపట్టరని ఎద్దేవా చేశారు. బీజేపీ ఒక దొంగలముఠా అని, ప్రజల కోసం పాటుపడే పార్టీ టీఆర్ఎస్ అని, తెలంగాణ ప్రభుత్వం అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget