అన్వేషించండి

Balka Suman: దోస్తులకు దోచి పెట్టడమే మోదీ సర్కారు పని - MLA బాల్క సుమన్

Balka Suman: దేశాన్ని అర్థం చేసుకోవడంలో, దేశానికి మంచి చేయడంలో బీజేపీ పూర్తిగా విఫలం అయిందని ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. దోస్తులకు దోచిపెట్టడమే మోదీ సర్కారు పనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Balka Suman: దేశాన్ని, దేశ ప్రజలను అర్థం చేసుకోవడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో బీజేపీ పూర్తిగా విఫలం అయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. దోస్తులకు దోచి పెట్టేందుకు మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు పని చేస్తుందంటూ మండి పడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూర్చే పథకాలు తీసుకు వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు పర్యవసనాలపై శాసన సభలో లఘు చర్చను ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉండేదని నాటి పరిస్థితులను గుర్తుచేశారు. విద్యుత్తు సరిగ్గా లేక వ్యవసాయ దారులు, పారిశ్రామిక వేత్తలు తీవ్రంగా నష్టపోయారని బాల్క సుమన్ వివరించారు. 

24 గంటలూ ఉచిత విద్యుత్..  
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులను తెలంగాణ సీఎం కేసీఆర్ సరిదిద్దుతున్నారని అన్నారు. దేశంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైన రాష్ట్రం తెలంగాణ అని ఆయన వెల్లడించారు. వ్యవసాయంతో పాటు బలహీన వర్గాలకు ఉచిత కరెంటు ఇవ్వడం సీఎం కేసీఆర్ ఒక్కరికే సాధ్యమైందని తెలిపారు. ఉచిత, 24 గంటల కరెంటు వల్ల రైతుల మరణాలు, ఆత్మహత్యలు చాలా వరకు తగ్గాయని.. దిగుబడులు కూడా విపరీతంగా పెరిగాయని చెప్పుకొచ్చారు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవడమే తెలంగాణ సర్కారు ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా కృషి చేస్తున్నారని చెప్పారు. 

యూపీ, ఏపీలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. 
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారు కొద్ది మంది కోసమే విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నారని బాల్క సుమన్ విమర్శించారు. కేంద్రం కుట్రలు ప్రజలకు తెలియాలన్నారు. ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని చెప్పారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం మన రాష్ట్రానికే కాకుండా మహారాష్ట్ర రైతులకు కూడా సాయం చేసిన గొప్ప మానవతా వాది అని పేర్కొన్నారు. కేంద్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తుందంటూ బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
బీజేపీని కేవలం రాష్ట్రం నుంచే కాకుండా దేశం నుంచి కూడా తరిమికొట్టాలని బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వం వహించి మరీ బీజేపీని అధికారం నుంచి తొలగించాలని అన్నారు. అప్పుడే రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగు పడుతుందని చెప్పారు. 

గతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఫైర్.. 
తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. ఒక్క మంచిపనైనా తెలంగాణకు కేంద్రం నుంచి చేయించడం కిషన్ రెడ్డికి చేతకాలేక పోయిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కిషన్ రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డిని దిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో గుమస్తాలు కూడా గుర్తుపట్టరని ఎద్దేవా చేశారు. బీజేపీ ఒక దొంగలముఠా అని, ప్రజల కోసం పాటుపడే పార్టీ టీఆర్ఎస్ అని, తెలంగాణ ప్రభుత్వం అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Food Adulteration: లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
Breaking News: బెయిల్ వచ్చిన వెంటనే ప్రశ్న రావణ్ అరెస్ట్.. జైల్లోనే చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు
బెయిల్ వచ్చిన వెంటనే ప్రశ్న రావణ్ అరెస్ట్.. జైల్లోనే చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు
IIIT Student Commits Suicide: ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
Bandla Ganesh : అన్యాయం జరిగింది... సుప్రీంకోర్టుకు వెళ్తా - ఆస్తి వివాదంపై బండ్ల గణేష్ ట్వీట్... అసలేం జరిగిందంటే?
అన్యాయం జరిగింది... సుప్రీంకోర్టుకు వెళ్తా - ఆస్తి వివాదంపై బండ్ల గణేష్ ట్వీట్... అసలేం జరిగిందంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget