అన్వేషించండి

Minister KTR : మునుగోడు ఫలితం బీజేపీ అహంకారానికి చెంపపెట్టు- మంత్రి కేటీఆర్

Minister KTR : మునుగోడు ఉపఎన్నిక ఫలితం బీజేపీ కేంద్ర నాయకత్వానికి చెంపపెట్టు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

Minister KTR : నల్గొండ జిల్లాలో 12 ఎమ్మెల్యే స్థానాలను  టీఆర్ఎస్ కైవసం చేసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక విజయం తర్వాత హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్... నల్గొండ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్టులతో తెచ్చిన ఉపఎన్నికలో ప్రజలు బీజేపీకి బుద్ధిచెప్పారన్నారు. అహంకారంతో, డబ్బు మదంతో కళ్లు నెత్తికొక్కి మునుగోడు ఉపఎన్నికను తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దారని కేటీఆర్ విమర్శించారు. దిల్లీ బాసులు మోదీ, అమిత్ షాకు తెలంగాణ ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఎన్నికల్లో కనిపించింది రాజగోపాల్ రెడ్డి అయినా వెనకుండి నడిపించింది దిల్లీ బాసులు అని మండిపడ్డారు. 9 రాష్ట్రాల్లో అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూల్చారని, తెలంగాణలో కూడా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని మంత్రి కేటీఆర్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వందల కోట్లు కుమ్మరించారు 

"మునుగోడు రాజకీయ క్రీడకు తెరలేపింది మోదీ, అమిత్ షా. బీజేపీ దిల్లీ నాయకత్వం, గల్లీ నాయకత్వం వందల కోట్ల రూపాయలు తెచ్చి ఓటర్లను కొనుగోలు చేయాలని ప్రయత్నించారు. దిల్లీ నుంచి డబ్బు సంచులు తెచ్చి మునుగోడులో గుమ్మనించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రకటన రాగానే కోటి రూపాయలతో బీజేపీ లీడర్ పట్టుపడ్డారు. ఈటల రాజేందర్ పీఏ కూడా డబ్బుతో పట్టుబడ్డారు. డా.వివేక్ గుజరాత్ నుంచి హవాలా రూపంలో నగదు తెచ్చి రాజగోపాల్ రెడ్డి, జమునా హచరీస్ కు బదిలీ చేసింది నిజం కాదా?. ఎవరి కోసం ఈ కోట్ల రూపాయలు బదిలీ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన ఇన్ ప్రా కంపెనీ నుంచి ఓటర్లకు నగదు బదిలీ చేశారు. దీనిని డాక్యుమెంటరీ ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశాం. అయితే ఈసీపై కేంద్ర పెద్దలతో ఒత్తిడి తెచ్చి చర్యలు తీసుకోకుండా చేశారు. పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను రంగంలోకి దించి గ్రామాలపై దండయాత్ర చేశారు. కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని ఈసీకి ఫిర్యాదు చేశాం. కేంద్రంలోని బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు కానీ టీఆర్ఎస్ మెజార్టీని తగ్గించగలిగారు."- మంత్రి కేటీఆర్ 

అభివృద్ధికే పట్టం 

మునుగోడు ప్రజలు అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టం కట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగుర వేసినందుకు నల్గొండ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలను ధనమయం చేసేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేసిందన్నారు.  ఎన్నికల డబ్బుమయం అయ్యాయని ఆరోపణలు వస్తున్నాయని, అయితే హుజూరాబాద్ , మునుగోడులో ధనవంతులు బరిలోకి దిగిన తర్వాతే డబ్బు మయం అయ్యాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ ఇద్దరు ధనవంతులను తీసుకొచ్చిన బీజేపీ ఎన్నికలను డబ్బుమయం చేశాయని ఆరోపించారు. వందల కోట్ల రూపాయలు దిల్లీ నుంచి పంపి ఎన్నికలను ధనమయం చేశారని విమర్శించారు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Congress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABPCM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Embed widget