అన్వేషించండి

Jagga Reddy On Puvvada : ఆ మంత్రి ఓ సైకో, బర్తరఫ్ చేయకుంటే ప్రభుత్వానికే నష్టం : జగ్గారెడ్డి

Jagga Reddy : ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కలకలం రేపుతోంది. తాజాగా జగ్గారెడ్డి మంత్రి పువ్వాడ అజయ్ పై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను కూడా మంత్రి వేధిస్తున్నారని ఆరోపించారు.

Jagga Reddy On Puvvada : ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు.  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్యపై బాధితుల వాంగ్మూలం తీసుకొని ఎమ్మారో, ఆర్డీవో, సీఐ, డీఎస్పీని సస్పెండ్ చేయాలన్నారు. గత మూడేళ్లుగా పువ్వాడ అజయ్ ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా అనేక కేసులు, పీడీ యాక్ట్ లు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. పువ్వాడ అజయ్ పై డీజీపీకి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని జగ్గారెడ్డి అన్నారు.  

మంత్రి ఓ సైకో 

"మంత్రి  పువ్వాడ అజయ్ ఓ సైకో. కేసీఆర్, కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేడానికి పువ్వాడ ఓవర్ యాక్షన్ చేస్తు్న్నారు. పువ్వాడకి కొందరు పోలీసులు చెంచాగిరి చేస్తున్నారు. మూడేళ్లుగా ఖమ్మంలో పోలీసుల వేధింపులు ఎక్కువ అయ్యాయన్నారు. సీఎం వెంటనే పువ్వాడని బర్తరఫ్ చేయాలి. మూడేళ్లుగా అజయ్ మీద ఉన్న ఫిర్యాదులపై విచారణ చేయాలి. కేసీఆర్ ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే నష్టం.  ఖమ్మంలో ఇంత జరుగుతుంటే ఎస్పీ ఏం చేస్తున్నారు. పోలీసులపై ప్రజలకు విశ్వాసం పోకుండా చూడాలి" అని తూర్పు జగ్గారెడ్డి అన్నారు. 

మంత్రిపై కేసు నమోదుకు డిమాండ్ 

మంత్రి పువ్వాడపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పీడీ యాక్టు కేసులు పెట్టిన పోలీసులను సస్పెండ్ చేయాలన్నారు. సీఎం కేసీఆర్ కాలయాపన చేస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందన్నారు.  బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్ ను ఇంక్లూడ్ చేయాలన్నారు. ఈ కేసులో పోలీసులు వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మార్వో, పోలీసుల వాంగ్మూలం కూడా తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

బీజేపీ కార్యకర్త ఆత్మహత్య 

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంత్రి పువ్వాడ అజయ్, పోలీసుల వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నాడని ఆ పార్టీ నేతలు, బంధువులు ఆరోపిస్తున్నారు. బీజేపీ కార్యకర్త మృతదేహాన్ని నిన్న ఖమ్మం ఆసుపత్రికి తీసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ పెట్టించిన తప్పులు కేసుల వల్లే మరణించాడని ఆరోపించారు. పట్టణంలోని మంత్రి కటౌట్లకు బీజేపీ కార్యకర్తలు నిప్పుపెట్టారు. దీంతో ఖమ్మంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.  

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Food Adulteration: లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
IIIT Student Commits Suicide: ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
Breaking News: బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలైన ప్రశ్న రావణ్.. త్వరలోనే ప్రెస్ మీట్
బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలైన ప్రశ్న రావణ్.. త్వరలోనే ప్రెస్ మీట్
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: రావణ్‌ను చంపగలరు, ప్రశ్నల్ని కాదు! నేనంటే అంత భయమెందుకు? 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
రావణ్‌ను చంపగలరు, ప్రశ్నల్ని కాదు! నేనంటే అంత భయమెందుకు? 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget