అన్వేషించండి

Praja Samgrama Yatra : ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర, జేపీ నడ్డాతో కలిసి భద్రకాళి అమ్మవారి దర్శనం

Praja Samgrama Yatra : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగిసింది. హనుమకొండ భద్రకాళి అమ్మవారి పాదాల చెంత పాదయాత్రను ముగించారు బండి సంజయ్.

Praja Samgrama Yatra : బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కుమార్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగిసింది. హనుమకొండ భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగించారు. మూడో విడత చివరి రోజు బండి సంజయ్ 14 కిలోమీటర్లు నడిచారు.  బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఇతర జాతీయ నేతలతో కలిసి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని బండి సంజయ్ దర్శించుకున్నారు.  

ముగిసిన పాదయాత్ర 

బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ఆగస్టు 2న తేదీ నుంచి 27 వరకు జరిగింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి ప్రారంభమయ్యే యాత్ర హనుమకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు కొనసాగింది. మొత్తం 26 రోజులపాటు యాదాద్రి, నల్గొండ, జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల మీదుగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో పాదయాత్ర నిర్వహించారు. మొత్తం 328 కిలోమీటర్ల మేర మూడో విడత పాదయాత్ర చేశారు బండి సంజయ్. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, జనగామ, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగింది. 

మూడో విడత యాత్రలో టెన్షన్ 

బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఉద్రిక్తంగా సాగింది. పలు ప్రాంతాల్లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఆగస్టు 15న జనగామ (Janagama) జిల్లాలోని దేవరుప్పుల (Devaruppula) మండల కేంద్రం నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమయంలోనే బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అది క్రమంగా ఘర్షణకు దారి తీసింది. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎవరికీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని బండి సంజయ్‌ మాట్లాడుతూ విమర్శలు చేశారు. అదే సమయంలో అక్కడ ఉన్న కొంతమంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ వ్యాఖ్యలతో విభేదించారు. వారు బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. గట్టిగా నినాదాలు చేస్తూ బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.  

హైకోర్టు ఆదేశాలతో పాదయాత్ర 

 జనగామలో పాదయాత్రలో ఉన్న బండిసంజయ్‌ బీజేపీ నేతల అరెస్టులను నిరసిస్తూ దీక్షకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బండి సంజయ్ ను అరెస్టు చేసి కరీంనగర్ తరలించారు. ఆ తర్వాత వర్ధన్నపేట పోలీసులు బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని నోటీసులు జారీ చేశారు. పాదయాత్ర కొనసాగింపుపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసు నోటీసులు కోర్టు సస్పెండ్ చేయడంతో ఆగస్టు 26 తిరిగి పాదయాత్ర ప్రారంభించారు బండి సంజయ్. ఈ పాదయాత్ర నేటితో ముగిసింది. అయితే మూడో విడత పాదయాత్ర సక్సెస్ అయిందనే చెప్పాలి. పాదయాత్ర అద్యంతం బండి సంజయ్  టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. విమర్శలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 

Also Read : TS BJP Cine Glamour : తెలంగాణ బీజేపీకి స్టార్ అట్రాక్షన్ ! పిలిస్తే తిరస్కరించే ధైర్యం ఎవరికైనా ఉందా !?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2024: డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
YS Sharmila: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
Nani: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
PM Modi: ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP DesamOld Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction | ముంబయికి రోహిత్ గుడ్ బై..| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2024: డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
YS Sharmila: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
Nani: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
PM Modi: ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
Viral Video: ఇలా చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు - ఈయన సలహా విన్నారా?
ఇలా చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు - ఈయన సలహా విన్నారా?
Crime News: అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు
అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు
Sreeleela :ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
Bengaluru: బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
Embed widget