అన్వేషించండి

TS BJP Cine Glamour : తెలంగాణ బీజేపీకి స్టార్ అట్రాక్షన్ ! పిలిస్తే తిరస్కరించే ధైర్యం ఎవరికైనా ఉందా !?

సినీ గ్లామర్ కోసం తెలంగాణలో ప్రయత్నం చేస్తున్న బిజెపికి ఆ గ్లామర్ కలిసి వస్తుందా.? బీజేపీ ఆహ్వానం అందితే తిరస్కరించే ధైర్యం ఎవరికైనా ఉందా ?

TS BJP Cine Glamour :    ఓ వైపు కాంగ్రెస్‌ ఇంటిపోరుతో ఇరుక్కుపోతే మరోవైపు బీజేపీ ఇక యావత్‌ దేశం కాషాయమయం కావాలన్న కసితో ముందుకు పోతోంది. ఏ రోజు ఏ వ్యూహంతో ముందుకు పోతోందో తెలుసుకోవడం విపక్షాలకు కష్టంగా మారుతోంది. ఇలాంటి టైమ్‌ లో టాలీవుడ్‌ స్టార్లతో పాటు వివిధ రంగానికి చెందిన ప్రముఖులని కాషాయం పెద్దలు పిలవడంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.ఇంతకుముందు సినీతారలే రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తిచూపించేవాళ్లు. అలాగే పార్టీలు కూడా సినీ గ్లామర్‌ ని కాదనకుండా వాడేసుకున్నాయి ప్రజాదరణని బట్టి ఆయా సినీతారలకు పదవులను కూడా కట్టబెట్టింది. ఇది నిన్నటిమాట. ఇప్పుడు సినీ రివర్స్‌.

కళాపురం వైపు బీజేపీ చూపు ! 

కాషాయం చూపు కళారంగంపై పడింది. ముఖ్యంగా బాలీవుడ్‌ ని ఏలేస్తోన్న టాలీవుడ్‌ స్టార్లపై పడింది. అందుకే ఇప్పుడు ఆ స్టార్‌ డమ్‌ ని పార్టీకి అనుకూలంగా మార్చేందుకు ప్లాన్‌ లు చేస్తోంది. అందులో భాగంగానే నిన్న ఎన్టీఆర్‌ ఇప్పుడు నితిన్‌ రేపో మాపో ప్రభాస్ ని కూడా పిలవచ్చన్న ఊహాగానాలు హడావుడి చేస్తున్నాయి.ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ నటనని చూసి ఫిదా అయిన అమిత్‌ షా ఆయన్ను పిలిచి మాట్లాడారని కాషాయం కవరింగ్‌ ఇచ్చింది. మరి నితిన్‌ తో ఎందుకు నడ్డా భేటీ అవుతున్నారన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. ఎన్టీఆర్‌ లాగా నితిన్‌ ఏమన్నా స్టార్‌ హీరోనా ,అంటే అదీ కాదు. పోనీ ప్యాన్‌ ఇండియా యాక్టరా అంటే అదీ కాదు. ఓ మీడియం రేంజ్ హీరో. ఆయన తండ్రి ఓ మాములు నిర్మాత. అలాంటి హీరోతో బీజేపీ నేత నడ్డా ఎందుకు భేటీ అవుతున్నారన్నదే ఇప్పుడు చర్చ. 

బరిలోకి టాలీవుడ్ స్టార్లను రంగంలోకి దింపాలనుకుంటున్నారా? 

రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారానికి టాలీవుడ్‌ స్టార్లని రంగంలోకి దింపాలన్న ఆలోచనలో భాగమే ఇదంటున్నారు. టాలీవుడ్‌ లో ఏపీకి చెందిన కళకారులే ఎక్కువ. తెలంగాణ నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా తక్కువమంది ఉన్నారు. అందుకే కళారంగాన్ని కేరాఫ్‌ గా చేసుకొని ఇక్కడి స్టార్లతో తెలంగాణలో కాషాయాన్ని కలర్‌ ఫుల్‌ గా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్లాన్‌ తోనే తెలంగాణకి చెందిన సినీతారగణానంత కదిలిస్తోందట. అలాగే వివిధ రంగాలకు చెందిన, ప్రభుత్వ గుర్తింపు అందుకోని ప్రముఖులనంతా ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ పార్టీ, కెసిఆర్‌ కి చెక్‌ పెట్టాలన్న ప్లాన్‌ ని సిద్ధం చేస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రభాస్‌నూ ఉపయోగించుకునే యోచనలో బీజేపీ ! 

త్వరలో ప్రభాస్‌ ని కూడా పిలవనుందట బీజేపీ. బాహుబలి సినిమాతో యావత్‌ ప్రపంచాన్నిఆకట్టుకున్న ప్రభాస్‌ సాహోతో బాలీవుడ్‌ లో పాగా వేశాడు. వచ్చే ఏడాది ప్రభాస్‌ చేస్తోన్న బాలీవుడ్‌ సినిమా ఆదిపురుష్‌ విడుదల కాబోతోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈసినిమాపై కాషాయం నేతలు కన్నేశారని ఇంతకుముందే వార్తలు వినిపించాయి. 

బీజేపీ పిలిస్తే రాక తప్పుతుందా !?

ఎన్నికల ప్రచారంలో సినీగ్లామర్‌ ఉండటం మాములే కానీ దీన్ని ఎందుకింత ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారన్న దానిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు సినీతారలకు ఆసక్తి ఉంటేనే ఎన్నికల ప్రచారానికి వచ్చేవారు. ఎవరూ బలవంతం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు దేశంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్న వాదనలు ప్రతిరోజూ వినిపిస్తూనే ఉన్నాయి.
మోదీ-షాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వారికి ఈడీ నోటీసులు, జైలు జీవితం లేదంటే రాజకీయజీవితమే లేకుండా చేస్తారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల్లో చీలికలు తేవడం, సిఎంలను కుట్రరాజకీయాలతో పీఠం నుంచి దింపేయడం వంటి పనులతో బీజేపీని చూసి భయపడుతున్నారు. రాజకీయపార్టీలు, నేతలే కాదు వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులు సైతం మోదీ-షాల తీరుపై మాట్లాడలేని స్థితిలో ఉన్నారు.

ఎంత మంది టాలీవుడ్ ప్రముఖులను బీజేపీ గురి పెట్టిందో !?

ఇలాంటి స్థితిలో కళారంగాన్నే నమ్ముకున్న సినీతారలు ఆపార్టీ పిలిస్తే రాకుండా ఎలా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్యాన్‌ ఇండియా సినిమాలతో అమాంతంగా కోట్లలో రెమ్యునిరేషన్‌ అందుకుంటున్న సినీతారల్లో ఎంతమంది నిజాయతీగా ఐటీ రిటర్న్స్‌ కడుతున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ విషయంలో చూసీ చూడనట్లు ఉన్న కాషాయం రేపు ఈ సినీస్టార్లు రాకపోతే ఆ పన్ను ఎగవేతనే ఎరగా వేసి పరువు తీయడం ఖాయమంటున్నారు. ఆ భయంతోనే బీజేపీ పెద్దలు పిలవగానే స్టార్లంతా పరుగులు పెడుతున్నారని కథనాలు వినిపిస్తున్నాయి.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
Andhra Pradesh Local Polls: లోకల్ పోల్సే ఏపీలో కూటమికి అతి పెద్ద సవాల్ - పోటీ వైసీపీతో కాదు.. స్నేహితుల మధ్యే !
లోకల్ పోల్సే ఏపీలో కూటమికి అతి పెద్ద సవాల్ - పోటీ వైసీపీతో కాదు.. స్నేహితుల మధ్యే !
BRS Politics: క్లీన్‌చిట్‌తో కవితకు సానుభూతి - కొత్త పార్టీతో సంచలనాలే - బీఆర్ఎస్‌ స్వాగతించలేకపోతోందా?
క్లీన్‌చిట్‌తో కవితకు సానుభూతి - కొత్త పార్టీతో సంచలనాలే - బీఆర్ఎస్‌ స్వాగతించలేకపోతోందా?
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Embed widget