అన్వేషించండి

KCR PK Issue: పీకే ఓ పాగల్ అని కేసీఆరే అన్నారు, ఇప్పుడు ఆయన భయపడుతున్నట్లే - మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ప్రశాంత్ కిషోర్ ఒక పాగల్ అని గతంలో ఓ సభలో కేసీఆర్ ఆన్నారని, ప్రశాంత్ కిషోర్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని కేసీఆరే విమర్శించారని వివేక్ గుర్తు చేశారు.

తిరుమలలో తెలంగాణ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజలు మంచి పరిపాలన కోరుకుంటున్నారన్నారు. తెలంగాణాలో సీఎం కేసీఆర్ కు ఓటమి‌ భయం పట్టుకుందని, అందుకే కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ జపం చేస్తున్నారని విమర్శించారు. 

ప్రశాంత్ కిషోర్ ఒక పాగల్ అని గతంలో ఓ సభలో కేసీఆర్ ఆన్నారని, ప్రశాంత్ కిషోర్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని కేసీఆరే విమర్శించారని గుర్తు చేశారు. ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్నారంటే కేసీఆర్ ఓటమి పాలు అవుతున్నట్లు ఒప్పుకుంటున్నారని అన్నారు. అవినీతి, నియంతృత్వ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని అన్నారు. తెలంగాణలో వరుస ఎన్నికలలో బీజేపీకే ప్రజలు పట్టం కడుతున్నారని ఆయన తెలిపారు.

ప్రాణహిత పుష్కరాలకు నిధులేవీ?

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నిన్న ప్రాణహిత పుష్కరాల్లో పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న పుష్కరాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఆయన కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత పుష్కర పుణ్య స్నానం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రాణహిత పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి మరీ రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయించిన విషయాన్ని వివేక్ గుర్తు చేశారు. 

ఫామ్ హౌస్ లో యజ్ఞాలు చేసి తాను పెద్ద భక్తుడినని చెప్పుకునే ముఖ్యమంత్రి.. పుష్కరాల సందర్భంగా పూజ నిర్వహించేందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆపి కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టిండని వివేక్ ఆరోపించారు. ఈ అంశం నుంచి దృష్టి మరల్చడానికే ప్రాణహిత పుష్కరాలకు నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గ్రాఫ్ ప్రజల్లో పడిపోతోందని వివేక్ అన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. వరంగల్ సభలో కేటీఆర్ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్న ఆయన.. రాష్ట్రానికి కేంద్రం నిధులు మంజూరు చేయడంలేదన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
Ramya Moksha Kancharla: అలేఖ్య కాదు... రమ్య మోక్ష పికిల్స్... కమ్ బ్యాక్ అనౌన్స్ చేసిన చిట్టి చెల్లెలు
అలేఖ్య కాదు... రమ్య మోక్ష పికిల్స్... కమ్ బ్యాక్ అనౌన్స్ చేసిన చిట్టి చెల్లెలు
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Holi party bill: హోలీ పార్టీ చేసుకుని బిల్లు ప్రభుత్వానికి పెట్టారు - చీఫ్ సెక్రటరీపై మండిపడుతున్న పార్టీలు
హోలీ పార్టీ చేసుకుని బిల్లు ప్రభుత్వానికి పెట్టారు - చీఫ్ సెక్రటరీపై మండిపడుతున్న పార్టీలు
Toy Library: మంచి వ్యాపారం చేయాలనుకునే వాళ్లకు టాయ్‌ లైబ్రరీ గుడ్ ఆప్షన్ 
మంచి వ్యాపారం చేయాలనుకునే వాళ్లకు టాయ్‌ లైబ్రరీ గుడ్ ఆప్షన్ 
Embed widget