Shenlong Suezmax Mumbai Arrival: యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్ సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
Shenlong Suezmax Mumbai Arrival: హుర్ముజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు వ్యాపారానికి గుండెకాయ వంటిది. ప్రపంచంలోని మొత్తం ముడి చమురులో ఐదో వంతు ఈ చిన్న మార్గం గుండానే వెళ్లాలి.

Shenlong Suezmax Mumbai Arrival: పశ్చిమాసియాలో రాజుకున్న అగ్గి ప్రపంచాన్నే వణికిస్తోంది. ఎక్కడెక్కడో ట్రావెల్ చేస్తున్న నౌకలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఇలాంటి ఉద్రిక్తతలు వేళ సముద్ర మార్గాల్లో ప్రయాణం సాహసమే అని చెప్పాలి. ముఖ్యంగా అమెరికా- ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడులు చేస్తున్న కారణంగా హుర్ముజ్ జలసంధిని మూసేశారు. రాకపోకలను పూర్తిగా బంద్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక భారతీయ కెప్టెన్ తన చాకచక్యంతో నిఘా కళ్లకు గంతలు కట్టి లక్ష టన్నుల ముడి చమురు ముంబై తీరానికి సురక్షితంగా చేర్చారు. ఈ సాహసయానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
ఎవరా కెప్టెన్? ఏమిటా నౌక?
ముంబై పోర్టుకు చేరుకున్న ఈ భారీ నౌక పేరు షెన్లాంగ్సూయజ్మాక్స్. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఈ ట్యాంకర్, సౌదీ అరేబియా నుంచి ముడి చమురును తీసుకొని ఇండియాకు బయల్దేరింది. ఈ నౌకకు భారతీయ కెప్టెన్ సుక్షాంత్ సింగ్ సంధు నాయకత్వం వహిస్తున్నారు. ఆయనతోపాటు ఈ నౌకలో భారత్, పాకిసస్థాన్, ఫిలిప్పీన్స్కు చెందిన మొత్తం 29 మంది సిబ్బంది ఉన్నారు. యుద్ధం మొదలైన తర్వాత ఈ ప్రమాదకరమైన జలసంధిని దాటి భారత్కు చేరుకున్న మొదటి నౌక ఇదే.
నిఘా కళ్లు కప్పి ఎలా వచ్చారు?
హుర్ముజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు వ్యాపారానికి గుండెకాయ వంటిది. ప్రపంచంలోని మొత్తం ముడి చమురులో ఐదో వంతు ఈ చిన్న మార్గం గుండానే వెళ్లాలి. అయితే ప్రస్తుతం ఇరాన్ ఈ మార్గంలో వెళ్లే నౌకలపై దాడులు చేస్తోంది. చైనాకు వెళ్లే నౌకలను తప్ప మిగిలిన ఏ నౌకను కూడా ఇక్కడి నుంచి వెళ్లనివ్వబోమని హెచ్చరించింది.
ఇలాంటి పరిస్థితిలో కెప్టెన్ సంధు అద్భుతమైన ప్లాన్ వేశారు. మార్చి 1న సౌదీలోని రాస్తనురా పోర్టులో చమురును నింపుకున్న ఈ నౌక మార్చి 3న ప్రాణం మొదలు పెట్టింది. మార్చి 8 నాటికి హుర్ముజ్ జలసంధి వద్దకు చేరింది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతం దాటే వరకు ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ట్రాన్స్ పాండర్లను కెప్టెన్ సంధు ఆపేశారు. దీని వల్ల సముద్రంలో నౌక ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. దీనినే నావీ భాషలో గోయింగ్ డార్క్ అంటారు. ఒక రోజు పాటు చీకట్లోనే ప్రయాణించి ప్రాణాపాయం ఉన్న ఆ ప్రాంతాన్ని దాటిన తర్వాత మర్చి 9న మళ్లీ సిగ్నల్ వ్యవస్థను ఆన్ చేశారు. అలా నిఘా రాడార్లకు దొరక్కుండా క్షేమంగా భారత్ చేర్చారు.
ముంబై చేరుకున్న చమురు నౌక- ఊపిరి పీల్చుకున్న రిఫైనరీలు
బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ముంబై పోర్టుకు చేరుకున్న షెన్లాంగ్ నౌక, సాయంత్రం ఆరు గంటలకు తన బెర్త్కు చేరుకుంది. ముంబై పోర్ట్ ఆథారిటీ డిప్యూటీ కన్సర్వేటర్ ప్రవీణ్ సింగ్ మాట్లాడుతూ ఈ నౌకలో 1, 35, 335 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉందన్నారు.
ఈ చమురు అన్లోడ్ చేయడానికి సుమారు 36 గంటల సమయం పడుతుంది. ఇక్కడి నుంచి ఈ చమురు ముంబై తూర్పు ప్రాంతంలోని మాహుల్లో ఉన్న రిఫైనరీలకు చేరుతుంది. దేశంలో ఇంధన కొరత ఏర్పడుతున్న ఆందోళనలో ఉన్న భారత్కు, ఈ నౌక రాక పెద్ద ఊరటనిచ్చింది.
మిగిలిన నౌకల పరిస్థితి ఏంటీ?
షెన్లాంగ్ క్షేమంగా వచ్చింది సరే, కానీ ఇంకా 28 భారతీయ జెండాతో ఉన్న నౌకలు ఆ ప్రమాదకర ప్రాంతంలోనే చిక్కుకుపోయి ఉన్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వర్గాలు వెల్లడించాయి. అయితే యుద్ధం మొదలైన సమయంలో అక్కడ ఉన్న కొన్ని నౌకలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నాయి. దేశ్ మహిమ, దేశ్ అభిమాన్, స్వర్ణ కమల్, విశ్వ ప్రేరణ, జగ్ విరాట్, జగ్ లోకేష్, ఎల్ఎన్జీసీ అసీమ్ అనే ఏడు నౌకలు అరేబియా సముద్రంవైపు వచ్చేయగా జగన్ లక్ష్యం అనే మరో నౌక అంగోలా దేశం వైపు వెళ్లింది.
ప్రస్తుతం అక్కడ ఉన్న నౌకలు కొన్ని తమను తాము చైనా నౌకలుగా రాడార్లలో కనిపించేలా సిగ్నల్ మారుస్తూ బయటపడేందుకు యత్నిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి ఆంక్షలు లేకపోయినా, కెప్టెన్లు తమ విచక్షణతో పరిస్థితులను బట్టి ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు



















