అన్వేషించండి

Prajapalana: ఈ 17లోపు ప్రజా పాలన దరఖాస్తుల ఎంట్రీ పూర్తి చేయాలి: సీఎస్ శాంతికుమారి ఆదేశాలు

Praja Palana Applications: ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈ నెల 17వ తేదీలోపు పూర్తి చేయాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు.

Collectors Teleconference: ప్రజాపాలన ( Praja palana Applications) దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈ నెల 17వ తేదీలోపు పూర్తి చేయాలని తెలంగాణ (Telangana) సీఎస్ శాంతికుమారి (CS Shanthi Kumari ) కలెక్టర్లను ఆదేశించారు.  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎస్‌ శాంతి కుమారి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇక నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రజాపాలన సదస్సులు ముగిసిన వెంటనే దరఖాస్తుల్లోని డేటా ఎంట్రీ ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు. వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈనెల 17 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు.

 డేటా ఎంట్రీపై రాష్ట్ర స్థాయి సిబ్బందికి గురువారం, జిల్లా స్థాయి సిబ్బందికి శుక్రవారం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.  ఆధార్‌, తెల్ల రేషన్‌ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారుల డేటా నమోదు చేయాలని,  మండల కేంద్రాల్లోనూ డేటా ఎంట్రీ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. ప్రజాపాలనను ప్రతి నాలుగు నెలలకోసారి నిర్వహిస్తున్నందున, ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారంతా మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. 

పరిపాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి, అక్కడే సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రజాపాలన పేరుతో కార్యక్రమం చేపట్టింది. డిసెంబరు 28 నుంచి ఈనెల 6 వరకు...పది రోజులపాటు ప్రజాపాలన నిర్వహిస్తోంది. ఆయా జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం, గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహిస్తోంది. ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకుంటోంది. గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా నిర్ణయాలు తీసుకుంటోంది. జిల్లా అధికారులు గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నారు. తొలుత పది రోజుల పాటు గ్రామస్థాయిలో ప్రజాపాలన నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ప్రజాపాలన సదస్సుల పొడిగింపు ఉండదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 

ఆరు గ్యారెంటీల దరఖాస్తులు
ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికకు డిసెంబరు 28 నుంచి దరఖాస్తుల స్వీకరిస్తోంది. 5వందల గ్యాస్ సిలిండర్, మహిళలకు 2వేల 500 నగదు బదిలీ, పెన్షన్ల పెంపు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల నగదుసాయం, కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమాను అమలు చేస్తోంది.  హహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 నగదు, పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్ కల్పిస్తామని హామీ ఇచ్చింది.  రైతు భరోసా కింద ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పింది. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింది  ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పింది. గృహజ్యోతి పథకం కింద పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వనుంది. చేయూత పథకం కింద దీన్ని ఇప్పటికే అమలు చేస్తోంది. యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్‌ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం అందిస్తామని, ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పింది. 

 

 

టాప్ హెడ్ లైన్స్

Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Breaking News: నేటి నుంచి రెండు రోజులపాటు కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
నేటి నుంచి రెండు రోజులపాటు కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
Telangana BJP Internal Strategy: గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
కాగజ్‌నగర్ గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం
గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Tata Sierra EV on EMI: టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Embed widget